ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఎప్పటినుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవాళ్లను పక్కన పెట్టి.. బయటి వాళ్లకు టికెట్లు ఇస్తున్నారంటూ బీజేపీ కార్యకర్తలు మండిపడ్డారు. లక్నోలోని పార్టీ ప్రధాన కార్యాలయాన్ని పెద్ద సంఖ్యలో చుట్టుముట్టారు. స్థానిక నాయకులకు టికెట్లు ఇచ్చి తీరాలంటూ డిమాండ్ చేశారు.
ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కేశవప్రసాద్ మౌర్యను వాళ్లు ఘెరావ్ చేశారు. పార్టీ కేంద్ర నాయకత్వానికి వ్యతిరేకంగా కూడా కొంతమంది కార్యకర్తలు నినాదాలు చేయడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. స్థానిక నాయకత్వంపై సవతి ప్రేమ చూపుతూ, బయటినుంచి వచ్చినవారికి టికెట్లు ఇస్తున్నారన్నది కార్యకర్తల ఆరోపణ.