ఆ వార్తలను నమ్మొద్దు: మమత | Sakshi
Sakshi News home page

ఆ వార్తలను నమ్మొద్దు: మమత

Published Wed, Jan 28 2015 9:30 PM

ఆ వార్తలను నమ్మొద్దు: మమత

పనాగఢ్: పశ్చిమ బెంగాల్ లో తమ పార్టీ పటిష్టంగా ఉందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. క్షేత్రస్థాయిలో తృణమూల్ బలహీనపడిందన్న విపక్షాల వాదనను ఆమె తోసిపుచ్చారు. 'నేల గట్టిగా ఉంటే పులి గోరుతో కూడా దాన్ని తవ్వలేదు. నేల మెత్తగా ఉంటే చిరుకప్ప కూడా తవ్వేస్తుంది' అన్న సామెతను మమతా ఉటంకించారు.

కేంద్ర ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవడానికి తాము ప్రయత్నిస్తున్నామని వచ్చిన వార్తలను నమ్మొద్దని బెంగాల్ ప్రజలను మమత కోరారు. బర్ద్వాన్ జిల్లాలో మాతి ఉత్సవంలో బుధవారం ఆమె పాల్గొన్నారు.

Advertisement
Advertisement