చావు దెబ్బలు కొట్టిన కానిస్టేబుల్ | Sakshi
Sakshi News home page

చావు దెబ్బలు కొట్టిన కానిస్టేబుల్

Published Sun, Jul 12 2015 2:48 PM

చావు దెబ్బలు కొట్టిన కానిస్టేబుల్ - Sakshi

రాజ్బుండి: ఎలాంటి కారణం, సంబంధం లేకుండానే ఓ కానిస్టేబుల్ అతడి కుమారుడు కలిసి ఓ 42 ఏళ్ల వ్యక్తిపై దాడి చేసి పదునైన ఆయుధాలతో చావు దెబ్బలు కొట్టారు. అనూహ్యంగా జరిగిన ఈ దాడికి బాధితుడు బిత్తరపోయాడు. ఏం జరుగుతుందో అర్థమవుతుండగానే అతడిపై పిడిగుద్దుల వర్షం పడింది. దీంతో బతుకుజీవుడా అంటూ ఆ వ్యక్తి దగ్గర్లోని తన బంధువుల ఇంట్లోకి వెళ్లి ప్రాణాలు దక్కించుకున్నాడు.

పోలీసుల వివరాల ప్రకారం జై కిషన్ గుజ్జర్ అనే వ్యక్తి కొత్వాలీ జిల్లాలో పాలమ్ముకొని జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 6న అతడు తన అల్లుడితో కలిసి పాలమ్ముకొని వస్తుండగా జోద్రాజ్ అనే కానిస్టేబుల్, అతడి కుమారుడు మరో ముగ్గురు కలసి ఒక్కసారిగా వారిపై దాడికి పాల్పడ్డారు. తీవ్రగాయాలవడంతో ప్రస్తుతం జై కిషన్ గుజ్జర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తనకు అసలు ఆ కానిస్టేబుల్ ఎవరో తెలియదని, తనకు ఎవరితో వైరం కూడా లేదని, అయితే అతడు ఎందుకు ఇలా చేశాడో అర్థం కాలేదని చెప్పాడు. దీంతో పోలీసులు కానిస్టేబుల్పై ఇతర నిందితులపై కేసులు నమోదు చేశారు.

Advertisement
Advertisement