నిండు ప్రాణాన్ని బలితీసుకున్న11కేవీ లైన్ | Sakshi
Sakshi News home page

నిండు ప్రాణాన్ని బలితీసుకున్న11కేవీ లైన్

Published Sun, Apr 19 2015 2:21 PM

Man dies due to power shock of 11KV power line

మిర్యాలగూడ: నల్లగొండ జిల్లాలో 11కేవీ విద్యుత్ లైన్ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఆదివారం ఉదయం మండలంలోని తుంగపాడు గ్రామపంచాయతీ పరిధిలో ఎస్సీకాలనీ వద్ద 11కేవీ విద్యుత్ లైన్ ఓ ప్రొక్లెయినర్‌ను తాకడంతో దాన్ని నడుపుతున్న బ్రహ్మయ్య(35) విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరయ్యపాలేనికి చెందిన బ్రహ్మయ్య ఓ కాంట్రాక్టర్‌కు చెందిన ప్రొక్లెయినర్‌కు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

తుంగపాడు ఎస్సీకాలనీ వద్ద 11కేవీ విద్యుత్ లైన్ తీగలు చాలా తక్కువ ఎత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఇక్కడ 11కేవీ తీగలు తాకి ఇప్పటికి ముగ్గురు ప్రాణాలు కోల్పోయినా విద్యుత్ శాఖ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement