మోడీకి జాబ్ ఆఫర్ చేసిన మణి శంకర్ అయ్యర్ | Sakshi
Sakshi News home page

మోడీకి జాబ్ ఆఫర్ చేసిన మణి శంకర్ అయ్యర్

Published Fri, Jan 17 2014 2:15 PM

మోడీకి జాబ్ ఆఫర్ చేసిన మణి శంకర్ అయ్యర్ - Sakshi

న్యూఢిల్లీ : ఏఐసీసీ  సమావేశాలు వేదికగా కేంద్ర మంత్రి మణిశంకర్‌ అయ్యర్  రెచ్చిపోయారు. బీజేపీ, నరేంద్ర మోడీలే లక్ష్యంగా  చెలరేగిపోయారు. నరేంద్రమోడీని ప్రధాని అభ్యర్థిగా  ప్రకటించడం తెలివితక్కువ పనంటూ విమర్శించారు. మోడీ కారణంగా బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు ప్రాంతీయ పార్టీలు  ఆసక్తి చూపడం లేదన్నారు. దేశంలో బీజేపీ ప్రభావం చాలా తక్కువగా ఉందంటూ ఆయన అన్నారు. నరేంద్రమోడీ టీ అమ్ముకునేందుకు  ఏఐసీసీ ప్రాంగణంలో ఏర్పాట్లు కూడా చేస్తానంటూ వ్యాఖ్యలు చేశారు. దేశానికి మోడీ ఎప్పటికి ప్రధాని కాలేడంటూ తేల్చిచెప్పారు.
 

Advertisement
Advertisement