సునంద మృతిపై జర్నలిస్ట్ మెహర్ షాక్ | Sakshi
Sakshi News home page

సునంద మృతిపై జర్నలిస్ట్ మెహర్ షాక్

Published Fri, Jan 17 2014 10:39 PM

సునంద మృతిపై జర్నలిస్ట్ మెహర్ షాక్ - Sakshi

ఇస్లామాబాద్: కేంద్రమంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతిపై పాకిస్తానీ జర్నలిస్ట్ మెహర్ తరార్(45) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సునంద మరణించినట్టు వార్తలు వెలవడటంతో ఒక్కసారిగా తాను షాక్ కు గురయ్యానట్టు ఆమె ట్విట్టర్లో పేర్కొంది. ఈ ఘటనపై తాను ఎలా స్పందించాలో తెలియటలేదని, తన నోటివెంట మాటలు రావడంలేదని మెహర్ తెలిపింది. అంతేకాకుండా సునందా ఆత్మకు శాంతి చేకురాలని తాను కోరుకుంటున్నట్టు మెహర్ మరో ట్విట్లో పేర్కొంది.

కాగా, పాకిస్థాన్ మహిళా జర్నలిస్టు మెహర్ తరార్‌, కేంద్ర మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్(52) మధ్య జరిగి ట్వీట్ల సమరం విషాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ వివాదం ముగిసిందని అందరూ అనుకుంటున్న తరుణంలోనే ఈ దారుణం జరిగింది. సునంద పుష్కర్ అనుమానాస్పద స్థితిలో ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్లో శవమై కనిపించారు. లీలా హోటల్లోని  345 నంబర్ రూములో ఆమె మృతదేహాన్ని పోలీసులు శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కనుగొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement