లండన్: భారత్లో ‘అసహనం’కు వ్యతిరేకంగా ప్రారంభమైన పోరాటం లండన్దాకా పాకింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల లండన్ పర్యటనను వ్యతిరేకిస్తూ బ్రిటన్ సామాజిక కార్యకర్తల నెట్వర్క్ ‘అవాజ్’ గురువారం లండన్ వీధుల్లో ప్రదర్శన జరిపింది. విద్వేషపూరిత రాజకీయాలకు తాము వ్యతిరేకమని, హిందూ, ముస్లిం, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, హేతువాదులు సభ్యులుగావున్న ‘అవాజ్’ సంఘం నినదించింది.
‘మేము మోదీని స్వాగతించడం లేదు’ అనే నినాదంతో ఆదివారం నాడు లండన్ పార్లమెంట్ భవనంపై అవాజ్ ప్రొజెక్ట్ చేసిన పోస్టర్ వివాదాస్పదమైన విషయం తెల్సిందే. ఆ పోస్టర్పై చేతిలో ఖడ్గం ధరించిన మోదీ చిత్రంతోపాటు స్వస్తిక్ గుర్తును తలపించేలా ‘ఓం’ గుర్తును చిత్రీకరించడం ప్రధానంగా వివాదాస్పదమైంది. దీనిపై బ్రిటన్ ప్రజా ప్రతినిధుల సభలో పార్లమెంట్ సభ్యుడు బాబ్ బ్లాక్మాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పోస్టర్ ప్రదర్శనకు బాధ్యులైన వారిని విచారించి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దీనిపై డిప్యూటీ స్పీకర్ లిండ్సే హోయల్ స్పందిస్తూ ‘రిమెంబ్రెన్స్ డే ( రెండు ప్రపంచ యుద్ధాల్లో మరణించిన సైనికులకు నివాళి అర్పించడం కోసం కామన్వెల్త్ దేశాలు జరుపుకునే సంస్మరణ దినం) సందర్భంగా ముందస్తు అనుమతి లేకుండా పార్లమెంట్ గోడలపై ఏమైనా ప్రొజెక్టు చేసుకోవచ్చని, అయితే ఓం...ను స్వస్తిక్ అర్థం వచ్చేలా చిత్రీకరించడం, ఓ దేశానినేత ఫొటోను అలా ప్రొజెక్ట్ చేయడం ఎంతమాత్రం ఆమోదనీయం కాదని అన్నారు. తీసుకునే చర్యల గురించి ఆయన ప్రస్తావించలేదు.
అయితే తాము ఎందుకు అలా చిత్రీకరించాల్సి వచ్చిందో ‘అవాజ్’ సంస్థ వివరణ ఇచ్చింది. ‘మైనారీలు, హేతువాదులు, దళితులు, రాజకీయ ప్రత్యర్థులపై భారత్లో అసహనంతో దాడులు చేస్తున్నారు. రిమెంబ్రెన్స్ డేను పుస్కరించుకొని నాజీయిజం ఆనవాళ్లంటిని ప్రశ్నించదల్చుకున్నాం. నాజీయిజంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పలు దేశాల సైనికులతోపాటు భారతీయులు చనిపోయారు. హిట్లర్ను, ముస్సోలిన్ను ఆరాధించే ఆరెస్సెస్ వ్యవస్థాపకులు నాజీయిజంను సమర్ధించడం అందరికి తెల్సిందే. ప్రపంచంలో గొప్ప మతాల్లో ఒకటైన హిందూ మతాన్ని ఫాసిస్ట్ మతంగా మార్చేందుకు నేడు ఆరెస్సెస్ శక్తులు ప్రయత్నిస్తున్నాయి. దానికి అధికారంలో ఉన్న మోదీ ఆమోదం కూడా ఉంది. అందుకనే ఆ విధంగా మేము పోస్టర్ను ప్లాన్ చేశాం. ఇందులో ఎంతోమంది సాంకేతిక నిపుణలు పాల్గొన్నారు. పార్లమెంట్ సభ్యుడు బాబ్ బ్లాక్మన్ కూడా ఆరెస్సెస్ వాది. ఆయన లండన్లో జరిగిన పలు ఆరెస్సెస్ శిబిరాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు’ అని అవాజ్ బుధవారం రాత్రి వివరణ ఇచ్చింది.
మోదీపై లండన్లో ‘అవాజ్’
Published Thu, Nov 12 2015 1:34 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement