హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కవిత భేటీ | Sakshi
Sakshi News home page

హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కవిత భేటీ

Published Mon, Oct 27 2014 4:16 PM

MP kavita meets rajnath singh

ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో తెలంగాణ ఎంపీ కవిత సమావేశమైయ్యారు. ఆలిండియా సర్వీస్ ఉద్యోగుల విభజనకు సంబంధించి రాజ్ నాథ్ ను ఆమె సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అఖిల భారత సర్వీస్ ఉద్యోగుల విభజనతో పాటు రాష్ట్ర స్థాయి ఉద్యోగుల విభజనను త్వరతగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని  హోంమంత్రికి ఆమె విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కవిత కోరారు.

 

Advertisement
Advertisement