జయకు మద్దతుగా ఎంపీల నిరాహారదీక్ష | Sakshi
Sakshi News home page

జయకు మద్దతుగా ఎంపీల నిరాహారదీక్ష

Published Thu, Oct 2 2014 12:50 PM

జయకు మద్దతుగా ఎంపీల నిరాహారదీక్ష - Sakshi

న్యూఢిల్లీ: 'అమ్మ'కు మద్దతుగా అన్నాడీఎంకే ఎంపీలు నిరహారదీక్ష చేపట్టారు. తమ పార్టీ అధినేత్రి జయలలితకు న్యాయం చేయాలంటూ పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం  ఎదుట అన్నాడీఎంకే ఎంపీలు గురువారం దీక్షకు దిగారు.

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు దీక్ష కొనసాగించనున్నామని అన్నాడీఎంకే పార్లమెంటరీ నాయకుడు పి. వేణుగోపాల్ తెలిపారు. జయలలిత బెయిల్ పిటిషన్ పై విచారణలో జాప్యంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చట్టప్రకారం వెంటనే ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement