- కనీస మట్టం 510 అడుగులకు చేరువగా నీటి లభ్యత
- శ్రీశైలం నుంచి 9 టీఎంసీల నీరొస్తేనే హైదరాబాద్కు తాగునీటి సరఫరా
- లేదంటే పంపులు దిగువకు దించాల్సిందే
సాక్షి, హైదరాబాద్
తెలుగు రాష్ట్రాల తాగు, సాగు అవసరాలకు ప్రధాన వనరుగా ఉన్న నాగార్జునసాగర్లో నీటి లభ్యత కనీస మట్టానికి పడిపోయింది. ఎగువ నుంచి ప్రవాహాలు పూర్తిగా పడిపోవడం, దిగువకు క్రమంగా నీటి విడుదల కొనసాగుతుండటంతో సాగర్ మట్టం కనిష్టానికి చేరింది. సాగర్ కనీస నీటి మట్టం 510 అడుగులు కాగా, ఆదివారం ఉదయం 510.5 అడుగులు ఉంది. అది ఏ క్షణమైనా కనిష్టానికి పడిపోనుంది. ఈ ఏడాది కృష్ణా బేసిన్లో నీటి లభ్యత పుష్కలంగా ఉన్నా, సాగర్కు మాత్రం ఆశించిన స్థాయిలో నీరు చేరలేదు. దీంతో ఈ ఏడాది సాగర్ పూర్తి స్థాయిలో నిండనేలేదు.
ఇదే సమయంలో శ్రీశైలం, సాగర్లో లభ్యతగా ఉన్న నీటి విషయంపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదాలు నెలకొనడంతో కృష్ణాబోర్డు కనీస మట్టాలకు దిగువకు వెళ్లి నీటిని పంచేసింది. ఇరు రాష్ట్రాల తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలంలో 785 అడుగుల దిగువకు, సాగర్లో 503 అడుగుల దిగువకు వెళ్లి నీటిని తీసుకునేందుకు అనుమతించింది. ఎండీడీఎల్ దిగువన లభ్యతగా ఉండే 44 టీఎంసీలను ఇరు రాష్ట్రాలకు పంచేసింది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలు మొదట శ్రీశైలంలో కనీస నీటి మట్టం 834 అడుగుల దిగువకు వెళ్లి నీటిని వినియోగిస్తున్నాయి. దీంతో అక్కడ ప్రస్తుత మట్టం 814.8 అడుగులకు పడిపోయింది. అక్కడ 37.25 టీఎంసీలు మేత్రమే నీటి లభ్యత ఉంది. ఇందులోనూ బోర్డు చెప్పిన 785 అడుగుల వరకు గరిష్టంగా 10 నుంచి 13 టీఎంసీలు మించి తీసుకోవడానికి వీలుపడదు.
ఇక సాగర్ నుంచి హైదరాబాద్ తాగునీటికి, ఎడమ కాల్వ కింద సాగుకు నీటిని వదిలేస్తుండటంతో అక్కడ మట్టం 510.5 అడుగులకు చేరింది. అది సోమవారం ఉదయానికి కనిష్టానికి చేరనుంది. సాగర్లో కనిష్ట నీటి మట్టం పడిపోవుతుండటంతో తెలంగాణ ఇటీవలే బోర్డుకు లేఖ రాసింది. ఎగువ శ్రీశైలం నుంచి తన వాటా కింద రావాల్సిన 9.2 టీఎంసీలను దిగువకు విడుదల చేయాలని కోరింది. దీంతో ఏపీ ఆదివారం 5,941 క్యూసెక్కుల మేర సాగర్లోకి నీటిని విడుదల చేస్తోంది. అయితే సాగర్ నుంచి 10,089 క్యూసెక్కుల మేర నీరు బయటకు విడుదల చేస్తుండటంతో కనిష్ట మట్టాలను మెయింటేన్ చేయడం సాధ్యపడట్లేదు. ఒకవేళ సాగర్ నీటి లభ్యత 510 అడుగులకు తగ్గిపోయినట్లయితే హైదరాబాద్కు తాగునీటిని సరఫరా చేసే పంపులు ఆగిపోనున్నాయి. హైదరాబాద్ అవసరాలకు నెలకు 1.8 టీఎంసీ చొప్పున సాగర్ నుంచి నీటిని విడుదల చేయాల్సి ఉన్నా అది సాధ్యపడదు. ఈ పరిస్థితుల్లో పంపులను మరింత కిందకి దించి నీటిని వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. గత ఏడాది సైతం ఇదే రీతిన కనిష్టంగా 503 అడుగుల వరకు వెళ్లి నీటిని తీసుకున్నారు. ప్రస్తుత ఏడాది సైతం అదే పరిస్థితి ఎదురయ్యేలా ఉంది.
కనిష్టానికి సాగర్!
Published Mon, Mar 20 2017 2:54 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement