* టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటా
* పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి
* రాష్ట్రాభివృద్ధికి సలహాలిస్తానని హామీ
సాక్షి, విజయవాడ బ్యూరో: దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు అధునాతన టెక్నాలజీయే పరిష్కార మార్గాలు చూపుతుందని టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటా అన్నారు. విద్యుత్, సురక్షిత త్రాగునీరు, పరి సరాల పరిశుభ్రత, ఆరోగ్యానికి సంబంధించిన అనే క ఇబ్బందులను టెక్నాలజీ ద్వారా అధిగమించవచ్చని ఆయన తెలిపారు.
సోమవారం నగరంలోని ఒక హోటల్లో ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రతన్ టాటా, ఏపీ సీఎం చంద్రబాబుతో పారిశ్రామికవేత్తల ముఖాముఖి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు అడిగిన ప్రశ్నలకు రతన్టాటా సమాధానం చెప్పారు. టాటా ట్రస్ట్, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టే పలు సామాజిక ప్రాజెక్టుల ఎంఓయూకు తాను మద్దతిస్తానని తెలిపారు. తొలుత సీఎం మాట్లాడుతూ భారతదేశం, ఇక్కడి పరిశ్రమలకు రతన్టాటా సింబల్గా ఉన్నారని, ఆయన దేశానికి ఒక ఐకాన్ అని ప్రశంసించారు.
జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం...
రాష్ట్ర ప్రభుత్వంతో టాటా ట్రస్టు చేసుకున్న ఒప్పందం ప్రజల జీవనప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుందని రతన్టాటా అన్నారు. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలోని 264 గ్రామాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టాటా ట్రస్టుతో ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున గ్రామీణాభివృద్ధి అదనపు కార్యదర్శి శాంతిప్రియపాండె, టాటా ట్రస్టు సీఈవో ఆర్.వెంకట్రామన్లు అంగీకార పత్రాలపై సంతకాలు చేశారు.
బ్రాండ్ అంబాసిడర్గా ఉండలేను: రతన్
ఏపీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలని సీఎం చేసిన విజ్ఞప్తిని టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటా తిరస్కరించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేర కు క్యాంప్ ఆఫీసులో జరిగిన సమావేశంలో రాష్ట్రాని కి బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలని బాబు టాటాను కోరినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనను రతన్ టాటా సున్నితంగా తిరస్కరించారు.
వ్యాపారాభివృద్ధికి కావాల్సిన సలహాలు ఇస్తానని చెప్పారు. పారిశ్రామికవేత్తల సమావేశంలోనూ పలువురు ఏపీలో టీసీఎస్ కంపెనీని ఏర్పాటు చేయాలని కోరగా ఇప్పుడు టాటా గ్రూపునకు తాను చైర్మన్ను కాదని, ఈ ప్రతిపాదనను గ్రూపునకు సూచిస్తానని చెప్పారు.
టెక్నాలజీయే పరిష్కార మార్గం
Published Tue, Aug 25 2015 1:45 AM
Related news
-
కూటమిది అసత్యాల మేనిఫెస్టో
చిలకలపూడి (మచిలీపట్నం): ప్రజలను మరొకసారి మోసం చేసేందుకే ఎన్డీయే కూటమి అసత్యాల మేనిఫెస్టోను విడుదల చేసిందని మాజీమంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు. ఆయన మంగళవారం రాత్రి కృష్ణాజిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మూడు పార్టీలు కలిశామని కూటమి అభ్యర్థులు చెప్పుకొంటున్నా.. మేనిఫెస్టోపై ఒకరి ఫొటో లేకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. మూడుఫోటోలు రెండు ఫోటోలయ్యాయంటే మేనిఫెస్టోలోని అంశాలు ఫొటోలేని వారికి ఇష్టం లేదా అని ప్రశ్నించారు. ఆడిన అబద్ధం ఆడకుండా జరగనవి, అసత్యాల మేనిఫెస్టో రూపొందించిన కూటమి సభ్యులు.. 40 ఏళ్ల రాజకీయ జీవితం, 14 ఏళ్లు ముఖ్యమంత్రి చేశానని చెప్పుకోవటం చూస్తే ప్రజలకే అర్థమవుతోందన్నారు. 50 ఏళ్ల వయసున్న సీఎం జగన్ 2019లో మేనిఫెస్టోను విడుదల చేసి 99 శాతం అమలు చేసి ప్రజలకు మంచిచేస్తేనే నాకు ఓటేయండని ధైర్యంగా అడుగుతున్నారని చెప్పారు. సంవత్సరానికి 71 వేల కోట్లతో సంక్షేమ పథకాలను ధైర్యంగా అమలు చేశారన్నారు.నిజాయితీగల వారైతే చంద్రబాబు 2014 మేనిఫెస్టోలో అమలు చేసిన వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. డ్వాక్రా గ్రూపుల వారికి రూ.14 వేల కోట్ల రుణాలు, రైతులకు రూ.84 వేలకోట్ల రుణాలు మాఫీచేస్తానని చెప్పి.. వాటిని ఎంతవరకు అమలు చేశావో ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు. జన్మభూమి కమిటీల పేరుతో పంచాయతీ వ్యవస్థను సర్వనాశనం చేసింది చంద్రబాబేనన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమిగా ఏర్పడ్డామని, ఎన్డీయేలో కలిశామని చెప్పుకొంటున్న చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రత్యేకహోదా, రైల్వేజోన్, విశాఖ స్టీల్ప్లాంట్, కడప స్టీల్ కర్మాగారం ఏర్పాటు విషయాలు ఎందుకు పొందుపరచలేదో చెప్పాలన్నారు. అధికారం కోసమే కూటమి అధికారం కోసమే కూటమిగా ఏర్పడ్డారని ఇప్పటికే ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు. ఏపీలో ఏడాదికి 10 శాతం మాత్రమే పెరుగుతున్న ఆదాయాన్ని బట్టి సీఎం జగన్ మేనిఫెస్టో రూపొందించారన్నారు. ఏడాదికి రూ.2 లక్షల కోట్లు అవసరమయ్యే విధంగా మేనిఫెస్టో రూపొందించిన చంద్రబాబు ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారో, ఏ విధంగా అమలు చేస్తారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పాటుపడతానని చెబుతున్న చంద్రబాబు ఆయన పాలనలో ముస్లింలకు ఎమ్మెల్యే, మంత్రి పదవి ఇవ్వలేదని గుర్తుచేశారు. రాజ్యాధికారంలో మైనార్టీలు భాగస్వామ్యులు కాకూడదనుకునే బాబుకు ఇప్పుడు వారిపై ప్రేమ పుట్టుకొచ్చిందా అని నిలదీశారు. రజకులకు, కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన హామీలు ఏమయ్యాయన్నారు. నాయీబ్రాహ్మణులకు ఉపకరణాలు ఇస్తామని చెబుతున్న చంద్రబాబు వారి పిల్లలకు చదువులు ఎందుకు చెప్పించవని ప్రశ్నించారు. వారు ఆర్థికంగా, విద్యాపరంగా ఎదగకుండా కులవృత్తిలోనే బతకాలా అని నిలదీశారు. రాష్ట్రంలో ప్రజలకు మేలు జరిగితేనే నాకు ఓటు వేయండని ధైర్యంగా చెబుతున్న సీఎం జగన్లాగా చెప్పగల దమ్ముందా అని చంద్రబాబును ప్రశ్నించారు.చంద్రబాబు ఏది చెబితే అదేనంటూ.. కూటమిలో పార్టీలు బుర్రకథల బ్యాచ్లా ఉన్నాయని ఎద్దేవా చేశారు. 2014లో కోటిమంది నిరుపేదలు ఉన్నప్పుడు ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి చెల్లిస్తానని మాయమాటలు చెప్పి ఏ ఒక్కరికి ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా..ఇప్పుడు 20 లక్షల మందికి ఉద్యోగాలిస్తానని అసత్యాల దొంతర అయిన మేనిఫెస్టోలో చెప్పటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. -
నీ హామీలకు డబ్బెక్కడిది బాబూ?
సాక్షి, అమరావతి: అధికారమే పరమావధిగా ప్రజలను వంచించేందుకు సిద్ధమైన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మేనిఫెస్టోలో ఇష్టం వచ్చినట్లు ఇచ్చిన హామీల అమలుకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? ఈ ప్రశ్న ఇప్పుడు ఆర్థిక నిపుణులను సైతం వేధిస్తోంది. అలవికాని హామీలను ఎడాపెడా ఇచ్చేసిన చంద్రబాబు అసలు వాటిని అమలు చేయడం సాధ్యమా? అందుకు ఎంత ఖర్చు అవుతుంది? అంత సొమ్ము ఎక్కడి నుంచి సమీకరిస్తారు? అనే అంశాలకు సమాధానం లేదు. ప్రాథమిక అంచనాల ప్రకారం చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేయాలంటే ఏడాదికి రూ.1.65 లక్షల కోట్లు ఖర్చవుతుంది. అంత డబ్బు సమీకరించుకునే అవకాశం ఉందా? రాష్ట్రంలో అందుకు తగ్గ వనరులు ఉన్నాయా?.. అంటే లేదనే సమాధానం వస్తుంది. వాస్తవికంగా ఆలోచిస్తూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించదు కాబట్టే సీఎం వైఎస్ జగన్కు ఇంకా సంక్షేమం అందించాలని మనసులో ఉన్నా కొత్త హామీలు ఇవ్వలేదు. అన్ని లెక్కలు వేసుకుని, వనరుల సమీకరణ చూసుకుని చేయగలిగే హామీలను మాత్రమే ఆయన మేనిఫెస్టోలో చేర్చారు. ప్రస్తుతం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల కోసం ఏటా రూ.70 వేల కోట్లు దాకా ఖర్చు చేస్తున్నారు. ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా పారదర్శకంగా నేరుగా లబ్దిదారులకే ప్రయోజనం చేకూరుస్తున్నారు.దీనికి అదనంగా మరికొంత లబ్ధిని జోడిస్తూ మేనిఫెస్టోను రూపొందించారు. తాము అమలు చేసే పథకాలు, కార్యక్రమాలు, వాటికి అయ్యే ఖర్చు, ఎక్కడి నుంచి సమీకరిస్తామనే విషయాలను ఆయన కూలంకషంగా వివరించారు. పథకాల అమలులో ఎక్కడా అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్దిదారుల అకౌంట్లలోనే డబ్బు జమ చేయడం (డీబీటీ) లాంటి వినూత్న విధానాల ద్వారా చాలా పకడ్బందీగా ఐదేళ్లు ఆర్థిక క్రమశిక్షణ పాటించి ఇబ్బందికర పరిస్థితుల్లోనూ నెట్టుకొచ్చారు. పింఛన్లకు ఇంకా ఎక్కువ ఇవ్వాలని ఉన్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలించవు కనుకే రూ.3,500 చొప్పున ఇస్తామని ప్రకటించారు. ఒకవేళ అప్పులు తెద్దామన్నా అవి కూడా పరిమితులకు లోబడే తేవాల్సి ఉంటుంది. అన్నీ బేరీజు వేసుకుని, ఉన్న వనరులను సది్వనియోగం చేసుకుంటూ పథకాలను కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. వేలం పాటలా పోటీ పడి హామీలు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కనీస ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్లు హామీలు గుప్పించారు. చిత్తశుద్ధితో నెరవేర్చే ఉద్దేశం లేనందువల్లే వేలం పాటలో రేటు పెట్టినట్లుగా సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలకే తాను ఇంకా ఎక్కువ ఇస్తానని నమ్మబలికారు. అమ్మఒడి, రైతు భరోసా పథకాల పేర్లు మార్చి ఇష్టం వచ్చినట్లు ప్రకటించారు. సీఎం జగన్ అమలు చేస్తున్న చాలా పథకాలతోపాటు ఇతర రాష్ట్రాల్లో ప్రకటించిన పథకాలను సైతం కాపీ కొట్టి మేనిఫెస్టోలో చేర్చి ప్రజలను ఏమార్చేందుకు సిద్ధమయ్యారు. మరి ఇన్ని హామీలను అమలు చేయడం సాధ్యమా? ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారనే దానికి ఆయన వద్ద సమాధానం లేదు. మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఒక మీడియా ప్రతినిధి ఈ హామీల అమలుకు ఎంత ఖర్చవుతుందని అడగడంతో సమాధానం చెప్పకుండా కస్సుమని మండిపడ్డారు. దాన్నిబట్టే ఆయనకు తాను ఇచ్చిన హామీలపై చిత్తశుద్ధి లేదనే విషయం స్పష్టమైంది. సీఎం జగన్ ఇస్తున్నారు కాబట్టి తాను అంతకంటే ఎక్కువ ప్రకటించి ప్రజలను నమ్మించాలి, ఆ తరువాత ఎలాగూ అమలు చేసేది లేదని తనకు అలవాటైన రీతిలో వాగ్దానాలు చేస్తున్నారు. సాధ్యం కాదనే బీజేపీ పట్టించుకోలేదు చంద్రబాబు హామీలను అమలు చేయడం సాధ్యం కాదని గుర్తించడం వల్లే బీజేపీ ఆయన మేనిఫెస్టోను అంగీకరించలేదు. ప్రధాని మోదీతోపాటు బీజేపీ నేతల ఫొటోలు మేనిఫెస్టోలో కనీసం ముద్రించేందుకు కూడా ఒప్పుకోలేదు. చివరికి మేనిఫెస్టోను తాకడానికి సైతం బీజేపీ పరిశీలకుడు సిద్ధార్థనాథ్సింగ్ ఇష్టపడలేదంటే బాబు హామీలపై వారికి ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే చంద్రబాబు హామీలకు కేంద్రం నుంచి కూడా ఎలాంటి సహకారం ఉండదని చెప్పకనే చెప్పేశారు. రాష్ట్రంలో ఆర్థిక వనరులు సమకూర్చుకునే పరిస్థితులు లేక, కేంద్రం సహకరించకపోతే చంద్రబాబు అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారనే దానికి సమాధానమే లేదు. అంటే ఆయన ఇచ్చిన హామీలు అమలు చేసేవి కావని తేటతెల్లమైంది. కేవలం ప్రజలను మభ్య పెట్టేందుకు, మరోసారి మాయ చేసేందుకే వేలం పాట మాదిరిగా సంక్షేమ పథకాలు ప్రకటించారు. పొరపాటున జనం నమ్మితే ఇక అంతే సంగతులు. 2014లో మాదిరిగా ఆ మేనిఫెస్టో మాయం కావడం ఖాయం. -
బాబు కిచిడీ మేనిఫెస్టో
సాక్షి, అమరావతి: చంద్రబాబు అంటేనే మోసం, మాయ, వెన్నుపోటు. ఏదో విధంగా ప్రజలను మభ్యపెట్టడం, అధికారంలోకి వస్తే అదే ప్రజలను మోసం చేసి, వెన్నుపోటు పొడిచి, తాను లాభపడటం.. ఇదే నైజం. ప్రజలకు మేలు చేసే మనసు ఆయనకు ఏ కోశానా లేదు. మంగళవారం విడుదల చేసిన తాజా మేనిఫెస్టోలోనూ చంద్రబాబు ఇదే నైజాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఏపీలో, పక్క రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలనే కాపీ కొట్టి తన మేనిఫెస్టో తయారు చేశారు.నిబద్దతతో పనిచేసే నాయకుడైతే ప్రజలకు తానేమి మేలు చేస్తాడో ఆలోచించి, వాటిని మేనిఫెస్టోలో చెప్తాడు. కానీ, చంద్రబాబు ప్రజల కోసం ఏమీ చేయరన్నది గతంలో ఆయన పరిపాలనే విస్పష్టంగా చెబుతుంది. ఇటువంటి నాయకుడి మేనిఫెస్టోలో ఏ హామీలు ఉంటే ప్రజలకేం ఉపయోగం? అందుకే చంద్రబాబు ఇప్పటికే రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న ప్రజోపయోగ పథకాలు, పక్క రాష్ట్రాల్లో ఉన్నవీ తెచ్చి తాజా మేనిఫెస్టోలో చేప్పేసుకున్నారు.. ఏమాత్రం కష్టం లేకుండా. గతంలో 2104, 2019లో తాను ప్రజలను మోసగించడానికి ఇచ్చిన హామీలను కూడా ఈసారి మేనిఫెస్టోలో ఉంచారు.. ఇందులో ఆయన ఏమాత్రం సిగ్గుపడలేదు. ఈ మేనిఫెస్టోలో 177 హామీలు ఉన్నప్పటికీ, అవన్నీ కాపీ కొట్టినవి, పాతవే.అరువు తెచ్చుకున్న సూపర్ సిక్స్చంద్రబాబు తాజా మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పేరుతో ప్రకటించిన ప్రధాన హామీలు అన్నీ అరువు తెచ్చుకున్నవే. వీటిలో సగం రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న పథకాలు కాగా, మిగతావి పక్క రాష్ట్రాల నుంచి కాపీ కొట్టారు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు, ప్రతి రైతుకు ఏటా రూ.20 వేల ఆర్థిక సాయం అందించే పథకాలను అమ్మఒడి, రైతు భరోసా పేరుతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐదేళ్ల నుంచి అమలు చేస్తోంది. వీటికే పేర్లు మార్చి, చంద్రబాబు మేనిఫెస్టోలో రాసుకున్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కూడా వైఎస్సార్సీపీ నుంచి కాపీ కొట్టిందే. ఇది కాకుండా నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, ప్రతి మహిళకి నెలకు రూ.1500, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీలను తెలంగాణ, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి కాపీ కొట్టారు. అంతే కాదు.. జాబు కావాలంటే బాబు రావాలంటూ 2014లో ఊదరగొట్టిన చంద్రబాబు.. జాబు లేదంటే నిరుద్యోగ భృతి అంటూ యువతను నిలువునా మోసం చేసి, మళ్లీ అదే హామీ ఇప్పుడూ ఇవ్వడమే ఆయనలోని గొప్పతనం.అవినీతి అమరావతిని మళ్లీ కడతారటఅధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ పేదలను పట్టించుకోని చంద్రబాబు.. మళ్లీ అధికారంలోకి వస్తే వారిని సంపన్నులను చేసేందుకు పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్టనర్షిప్ (పీ4) పేరుతో పథకాలు ఇస్తానని ప్రకటించారు. అంతర్జాతీయ అవినీతి కుంభకోణంగా మారిన రాజధాని అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తానని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల గురించి పట్టించుకోకుండా అమరావతి జపం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేస్తానని నమ్మబలుకుతున్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు వద్దే వద్దంటూ అక్కడ హైకోర్టు బెంచిని తక్షణం ఏర్పాటు చేస్తామని నమ్మబలికారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొల్లగొట్టి లక్షలాది మందిని నడిరోడ్డున పడేసిన విషయాన్ని మరచిపోయి, ఇప్పుడు బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెబుతున్నారు.రూ.4 వేలు పింఛనంటూ మాయ హామీచంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లూ సామాజిక పింఛన్లు రూ.1,000 మాత్రమే ఇచ్చారు. అందులోనూ చాలా మోసాలు. ఇచ్చిందే తక్కువ. అందులోనూ జన్మభూమి కమిటీల దందా, అవినీతి. వృద్ధులు నెల నెలా నానా అవస్థలుపడి ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లి, అక్కడ ఇచ్చినంత తెచ్చుకోవాల్సిన దుస్థితి. అవ్వాతాతలు, దివ్యాంగులు, ఇతర పెన్షనర్లకు చంద్రబాబు పెట్టిన అవస్థల నుంచి విముక్తి కల్పిస్తూ సీఎం జగన్ చర్యలు చేపట్టారు. బాబు రూ. వెయ్యి పింఛను ఇవ్వగా, దానిని సీఎం జగన్ రూ.3 వేలు ఇచ్చి, ఇంటి వద్దనే వలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఐదేళ్లుగా ఇస్తున్న రూ.3 వేలను రూ.4 వేలకు పెంచి ఇస్తామని చంద్రబాబు మభ్యపెట్టే హామీ ఇచ్చారు. అది కూడా 50 ఏళ్లకే ఇస్తామని చెప్పడం మాయ చేయడానికేనని కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. గతంలో చేయకుండా ఇప్పుడు మెగా డీఎస్సీ ప్రకటిస్తామని, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అంటూ ప్రకటించారు. ప్రతి ఇంటికీ మేలు చేసేలా జగన్ ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థను తూలనాడి, 2 నెలలుగా వారిని విధులకు దూరం చేసిన చంద్రబాబు.. వారికి రూ.10 వేలు గౌరవ వేతనం ఇస్తానని ప్రకటించడం ఆయన దివాళాకోరుతనమే. ఉద్యోగుల గురించి ఏనాడూ పట్టించుకోని చంద్రబాబు.. ఇప్పుడు అధికారంలోకి వస్తే వారికి మేలు చేస్తానంటున్నారు.ఇది మరో రకం మోసంఎన్డీఏలో భాగస్వామిగా ఉండి ఆ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో చేయాలని చెబుతున్న ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేస్తామని చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రకటించడమూ ప్రజలను మోసం చేయడమే. 2014, 2019 మేనిఫెస్టోల్లో చెప్పినట్టుగానే ఈ మేనిఫెస్టోలోనూ పోలవరం ప్రాజెక్టును సత్వరం పూర్తి చేస్తామని, నదుల అనుసంధానం, ప్రతి ఎకరానికి నీరు అంటూ పాత హామీలను పెట్టారు. రాష్ట్రంలో ఇప్పుడు పారదర్శకంగా ఇసుక విధానం అమలవుతుండగా తన హయాంలో అభాసుపాలైన ఉచిత ఇసుక విధానాన్ని మళ్లీ తెస్తానని చంద్రబాబు ప్రకటించారు. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ వంటి సకల మౌలిక వసతులతో గ్రామాల ముఖ చిత్రమే మారిపోయినా, గ్రామాల్లో మౌలిక వసతులు, మండల, జిల్లా కేంద్రాల్లో వర్క్ ఫ్రం హోం స్టేషన్లు అంటూ హామీలిచ్చారు. బీసీలకు బురిడీచంద్రబాబు అధికారంలో ఉండగా బీసీలకు స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు తగ్గించేశారు. ఇప్పుడు 34 శాతం ఇస్తామని చెప్పడం ఆ వర్గాలను మభ్యపెట్టడమే. 2014, 2019 మేనిఫెస్టోల్లో చెప్పినట్టుగానే ఇప్పుడూ బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేస్తామని మరోసారి పాత హామీనే ఇచ్చారు. మరోసారి మహిళలను మోసం చేసేలా..స్వయం సహాయక సంఘాలను మళ్లీ కొత్త తరహాలో మోసం చేయడానికి చంద్రబాబు కొత్త హామీ ఇచ్చారు. స్వయం సహాయక సంఘాల రుణాలు మాఫీ చేస్తానని 2014 మేనిఫెస్టోలో హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరినీ వంచించి, ఆ సంఘాలను దివాలా తీయించారు చంద్రబాబు. ఇప్పుడు రూ. 3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తామంటూ నిస్సిగ్గుగా మరోసారి ప్రకటించారు. ఇది మరోసారి మహిళలను వంచనకు గురిచేయడమే.ఆరోగ్యశ్రీకి మంగళమే!సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే ఆరోగ్య శ్రీ పథకం కింద రూ.25 లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నారు. చంద్రబాబు ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేలా ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా ఇస్తామని ప్రకటించారు. అంటే చంద్రబాబు వస్తే ప్రజలకు బీమానే వర్తిస్తుంది తప్ప, ఆరోగ్య శ్రీ ఉండదు. ఆరోగ్యానికి భరోసా ఉండదు. డిజిటల్ హెల్త్ కార్డులు ఇప్పటికే రాష్ట్రంలో కోట్ల మందికి పంపిణీ చేసినా తానూ చేస్తానని చెప్పారు. విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలి డాక్టర్, జగనన్న సురక్ష పథకాలన్నీ వైద్యాన్ని పేదలకు చేరువ చేయగా వాటికి ఏమాత్రం సాటిరాని, తీసికట్టుగా జన ఔషధి కేంద్రాలు, బీపీ, షుగర్ వ్యాధులకు ఉచితంగా జనరిక్ మందులు పంపిణీ చేస్తామని చెబుతున్నారు. విద్యా రంగంలో వైఎస్ జగన్ విప్లవాత్మకమైన మార్పులు తెస్తే, వాటి దరిదాపుల్లోకి సైతం రాలేని స్థితిలో కేజీ టు పీజీ సిలబస్ని రివ్యూ చేస్తామని, మూతపడిన పాఠశాలలు పునరుద్ధరిస్తామంటూ పస లేని హామీలు ఇచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ ప్రస్తుతం అమల్లో ఉండగా, నేరుగా కాలేజీలకే రుసుం చెల్లిస్తామని ప్రకటించి దానిపైనా తిరకాసు హామీ ఇచ్చారు.ఇప్పుడు అమలవుతున్నవే ఆయనొచ్చి చేస్తాడట..» సీఎం జగన్ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లింలు, కాపులు, వడ్డెరలు, ఆర్య వైశ్యులు, క్షత్రియులు, అగ్రవర్ణ పేదలకు నవరత్నాలతో రూ.వేల కోట్ల సంక్షేమ అందిస్తుంటే.. ఇప్పుడు బాబు వారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటానని అనడం కొసమెరుపు.» 2019 ఎన్నికల్లో ఇచ్చినట్టుగానే గ్రామాల్లో పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తానని, పక్కా ఇళ్లు కట్టిస్తానంటూ పాత పాటే పాడారు. నిజానికి ఈ ఐదేళ్లలో పేదలకు సీఎం వైఎస్ జగన్ 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వగా, వీటిలో ఇప్పటికే 22 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఆయనొచ్చి చేసేదేముంది?» నైపుణ్య శిక్షణ కేంద్రాలు, క్రీడా మౌలిక సదుపాయాలు, డిజిటల్ లైబ్రరీలు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నా, వాటి గురించి మేనిఫెస్టో చేర్చడం ప్రజలను మభ్యపెట్టడం కాక మరేమిటి? కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇప్పటికే రాష్ట్రంలో అమల్లో ఉండగా తానూ అమలు చేస్తానని ప్రకటించడం పక్కా మోసమే.» వైఎస్ జగన్ ప్రభుత్వం ఏడాది నుంచి రాష్ట్రంలో శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు ఇస్తుండగా.. తాము అందిస్తామంటూ అదే హామీ ఇచ్చారు.» గొర్రెల పెంపకం యూనిట్లకు రాయితీలు, బీమా సౌకర్యం ఇప్పటికే ఉండగా దాన్ని తాను ఇస్తానని అంటున్నారు.» నాయీ బ్రాహ్మణుల షాపులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తుండగా దాన్ని ఇస్తానంటూ చెప్పుకొంటున్నారు. » మత్స్యకారుల సంక్షేమానికి ఇప్పటికే వైఎస్సార్సీపీ రూ.10 వేలు ఆర్థిక సాయం అందిస్తుండగా దాన్ని పెంచుతామని నమ్మబలికారు.» వైఎస్సార్సీపీ వాహన మిత్ర పథకం అమలు చేస్తూ రవాణా రంగ కార్మికులకు మేలు చేస్తుండగా, ఇప్పుడు తాను డ్రైవర్లకు ప్రమాద బీమా ఇస్తానని, వడ్డీ సబ్సిడీ ఇస్తానంటూ నమ్మబలికారు.» వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ విద్యుత్ సరఫరా ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇస్తుండగా తాను అధికారంలోకి వస్తే ఇస్తానన్నారు.» వైఎస్ జగన్ సీఎం కాగానే ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయగా, ఇప్పుడు తాను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.» సేంద్రీయ వ్యవసాయం, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ, ప్రభుత్వ గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీ యూనిట్ల వంటివన్నీ వైఎస్సాÆŠసీపీ ప్రభుత్వం చేస్తుండగా వాటిని తన మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ఇప్పుడు అమల్లో ఉన్న పథకాలన్నీ తాను చేస్తాననడం ప్రజలను వంచించడమే కదా? -
అప్పుడలా.. ఇప్పుడిలా..
పింఛను లబ్ధిదారుల్లో ఇప్పటికే బ్యాంకు ఖాతా ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ పింఛను డబ్బులు నేరుగా వారి ఖాతాల్లోకి జమచేయాలి. సచివాలయాల దాకా వెళ్లి పింఛన్లు తీసుకోలేని వారికి మినహాయింపులు ఇవ్వొచ్చు. అలాంటి వారికి ఇంటి దగ్గరకు వెళ్లి ఇవ్వడానికి మా సిటిజన్ ఫర్ డెమోక్రసీకి అభ్యంతరంలేదు. ఇక బ్యాంకు అకౌంట్లులేని వారు సచివాలయంలో పింఛను డబ్బులు తీసుకునే అవకాశం కల్పించాలని ఈసీ అధికారులను కోరాం.– చంద్రబాబు నమ్మినబంటు మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ 20 రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసిన తర్వాత మీడియాతో అన్న మాటలు.తాము 2024 మార్చి 30న పేర్కొన్న ఆదేశాల ప్రకారం.. బ్యాంకు ఖాతాలున్న లబ్ధిదారులకు డీబీటీ (బ్యాంకు ఖాతాలో జమచేసే) విధానంలో పింఛన్ల పంపిణీకే ప్రాధాన్యత ఇవ్వండి. లేదంటే శాశ్వత ఉద్యోగుల ద్వారా పంపిణీ చేపట్టండి. – ఏప్రిల్ 26న కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జారీచేసిన ఆదేశాల సారాంశం ఇది. ఏప్రిల్లో దివ్యాంగులకు ఇళ్లవద్దే.. మిగిలిన వారికి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పంపిణీ కొనసాగించడంపైనా టీడీపీ–బీజేపీ–జనసేన నేతలు 20 రోజులుగా రోజూ ఫిర్యాదులు చేయడంతో ఈసీ జారీచేసిన ఆదేశాలివి.టీడీపీ–బీజేపీ–జనసేన నేతల వరుస ఫిర్యాదులతో మే ఒకటి నుంచి చేపట్టే పింఛన్ల పంపిణీ డీబీటీ విధానంలో అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘమే స్పష్టంగా ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో బ్యాంకు ఖాతాలున్న 75 శాతం మంది పింఛనర్లకు బ్యాంకు ఖాతాల్లోనే పింఛన్ల జమకు అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత 58 నెలలుగా ప్రతినెలా ఠంఛన్గా ఒకటో తేదీనే వలంటీర్ల ద్వారా కొనసాగుతున్న పింఛన్ల పంపిణీని నెలరోజుల క్రితం అడ్డుకున్న విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల వద్ద కూడా ఆ పంపిణీ కొనసాగకూడదంటూ రోజూ అదేపనిగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసి, మళ్లీ అవ్వాతాతలు తనపై ఎక్కడ ఆగ్రహం చూపుతారోనని భయంతో ‘పండుటాకులను బ్యాంకుల చుట్టూ తిప్పిస్తారా’ అంటూ చంద్రబాబు ఎప్పటిలాగే ప్లేటు ఫిరాయించారు. నిజానికి.. మొదటినుంచీ చంద్రబాబుది ఇదే తరహా రాజకీయం. ఏ అంశంపైనైనా ముందు తప్పుచేసేసి దాన్ని సరిదిద్దుకునేందుకు ఎదుటివారిపై బురదజల్లుతూ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తారు. రాష్ట్ర విభజన సమయంలో.. ప్రత్యేక హోదా తదితర అంశాల విషయంలో ఆయన అనేకమార్లు బొక్కబోర్లాపడినా తనదే పైచేయి అని బిల్డప్ ఇచ్చే రకం. ఎన్నికల కోడ్ను అడ్డంపెట్టుకుని వలంటీర్లపై చంద్రబాబు అవలంబించిన వైఖరి కూడా అచ్చం ఇలాంటిదే. నెలరోజుల క్రితం..నిజానికి.. నాలుగున్నరేళ్లకు పైగా రాష్ట్రంలో వలంటీర్ల ఆధ్వర్యంలో ప్రతినెలా ఠంఛనుగా లబ్ధిదారుల ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీ కొనసాగగా.. ఈ వర్గానికి చెందిన ఓట్లు టీడీపీకి దక్కవేమోనన్న దుగ్థతో ఎన్నికల నేపథ్యంలో ఈ విధానంపై పచ్చముఠా ఇప్పుడు వరుసపెట్టి ఫిర్యాదులు చేసింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వయంగా ఈ ఏడాది మార్చి ఒకటిన ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అలాగే, చంద్రబాబు జేబులోని మనిషి, ఆయన సొంత సామాజికవర్గానికి చెందిన నిమ్మగడ్డ రమేష్కుమార్ అయితే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ పేరుతో అచ్చం ఇదే పనిమీద ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23, 25 తేదీల్లో పింఛన్ల పంపిణీలో వలంటీర్లను దూరంగా ఉంచాలని రెండుసార్లు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటివరకు ఇళ్లవద్దే ఇస్తున్న పింఛన్ల పంపిణీకి బ్రేకులు పడ్డాయి. ఫలితంగా.. ఏప్రిల్ నెల దివ్యాంగులు, కదలలేని స్థితిలో ఉండే అవ్వాతాతలకు ఇబ్బందిలేకుండా వారికి ఇంటివద్దే పింఛన్లను పంపిణీ చేసి, మిగిలిన వారికి సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పంపిణీ చేశారు. ఈ నిర్ణయంపై పింఛనర్లు తీవ్రస్థాయిలో రగిలిపోయారు. చంద్రబాబు, ఆయన ముఠా తీరుపై బహిరంగంగానే విరుచుకుపడ్డారు. ఆగని ఫిర్యాదులు..చంద్రబాబు ముఠా కోరుకున్నట్లుగా తీసుకున్న ఈ పింఛన్ల పంపిణీ నిర్ణయం ఆయనకే బెడిసికొట్టింది. అనుకున్నదొకటి.. అయినదొక్కటి బోల్తాకొట్టిందిరో బాబు పిట్ట అన్నట్లుగా తయారైంది ఆయన పరిస్థితి. దీంతో తన సహజ లక్షణమైన యూటర్న్ను తీసేసుకున్నారు. అంతే.. మళ్లీ గత నెలరోజులుగా టీడీపీ–జనసేన–బీజేపీతో కూడా పచ్చబ్యాచ్ ఉమ్మడిగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుల పరంపర కొనసాగించింది. ఇందులో భాగంగానే నిమ్మగడ్డ 20 రోజుల క్రితం మళ్లీ ఎన్నికల సంఘం అధికారులను కలిసి, పింఛన్ల పంపిణీ సచివాలయాల వద్ద కాకుండా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమచేయాలని కోరారు. ఇలా దాదాపు రోజు మార్చి రోజు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. మరోపక్క.. తమ అనుకూల మీడియాలో రాష్ట్ర ఉన్నతాధికారులను బ్లాక్మెయిల్ చేసేలా నిత్యం కథనాలు రాయించి బ్యాంకుల ద్వారా పింఛన్లను పంపిణీ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. సెలవైనా ఒకటినే బ్యాంకులో పింఛను..మేడే కారణంగా బ్యాంకులకు సెలవు అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా 65,49,864 మంది లబ్ధిదారులకు ఒకటో తేదీనే పింఛను డబ్బులను అందుబాటులో ఉంచుతూ రాష్ట్ర ప్రభుత్వం రూ.1,945.39 కోట్లు విడుదలచేసింది. విభిన్న దివ్యాంగ వర్గానికి చెందిన లబ్ధిదారులతో పాటు తీవ్రమైన అనారోగ్యాల కారణంగా పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్చైర్లకు పరిమితమయ్యే 16,57,361 మందికి ఒకటో తేదీ (బుధవారం) ఉదయం నుంచే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు పంపిణీ చేపట్టేలా మంగళవారమే వారికి సంబంధించిన రూ.474.17 కోట్లను గ్రామ, వార్డు సచివాలయాల వారీగా బ్యాంకు ఖాతాల్లో జమచేసినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన 48,92,503 మంది లబ్ధిదారుల పింఛన్ డబ్బులు బుధవారం బ్యాంకులకు సెలవు అయినప్పటికీ అదేరోజు ఉ.8 గంటల నుంచి వారి ఖాతాల్లో జమయ్యేలా అన్ని బ్యాంకులు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.– సాక్షి, అమరావతి -
కేంద్రం టైటిల్తో బాబు డ్రామా
అమలులోకి రాని చట్టంపైఇంత దుష్ప్రచారమెందుకు? ల్యాండ్ టైట్లింగ్ చట్టం తేవాలని కేంద్రం స్పష్టంగా అన్ని రాష్ట్రాలకూ చెబుతున్న నేపథ్యంలో.. జనానికి నచ్చినా, నచ్చకపోయినా.. బలవంతంగానైనా దాన్ని అమల్లోకి తెచ్చే అవకాశం ఎవరి హయాంలో ఉంటుంది? బీజేపీతో కలిసి పోటీ చేస్తూ.. ఎన్డీఏతో కూటమి గట్టిన చంద్రబాబు నాయుడి హయాంలోనే కదా? ఏ పార్టీతోనూ సంబంధం లేకుండా స్వతంత్రంగాఎన్నికల బరిలో ఉన్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆ చట్టాన్ని ప్రజల ఇష్టాయిష్టాల మేరకు అమల్లోకి తేవటమో, తేకుండా నిలిపేయటమో ఏదైనా చేయగలరు. కానీ చంద్రబాబు పరిస్థితి అలా కాదు కదా! బీజేపీతో కూటమి గట్టి పోటీ చేస్తున్నారు గనక.. ఎన్డీఏ పేరుతో ఓట్లడుగుతున్నారు కనక.. ప్రజలకు ఇష్టం ఉన్నా, లేకున్నా చచ్చినట్టు ఈ చట్టాన్ని అమలు చేసి తీరాలి. ఇది వాస్తవం. ఇది పచ్చి నిజం. మరి దొంగ మాటలెందుకు చంద్రబాబూ? పైపెచ్చు అమల్లోకి రాని ఈ చట్టాన్ని రద్దు చేస్తాననే ఓ పిచ్చి హామీని మేనిఫెస్టోలో పెట్టారంటే మిమ్మల్ని ఏమనుకోవాలి? మీ మానసిక స్థితి సరిగానే ఉందా? అసలు అమల్లోకే రాని ఈ చట్టంపై ఉన్నవీ లేనివీ చెబుతూ...దాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి ఆపాదిస్తూ.. వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చేసిందని, అందరి భూములూ లాక్కుంటోందని దిగజారిపోయి దౌర్భాగ్యపు ప్రచారానికి దిగటం ఎంత నీచం? ఈ చంద్రబాబు నాయుడి నైచ్యానికి అంతూ పొంతూ ఉండదా? మనిíÙగా పుట్టాక కాస్తయినా సిగ్గూ శరం ఉండాలి కదా? 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని చెబుతున్న ఈ పెద్ద మనిíÙ.. ఇంత కుళ్లూ కుతంత్రాలతో.. జనం సాక్షిగా కళ్లు మూయకుండా అబద్ధాలు చెప్పేస్తూ విషం కక్కుతుండటం హేయం కాదా?సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: వాస్తవానికి ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి పునాది పడింది 1989లోనే. భూ వివాదాలకు శాశ్వతంగా ముగింపు పలకటానికి, ఎవరి పేరుతో భూమి ఉందో వారి పేరిట టైటిల్ ఇచ్చి.. ఆ టైటిల్కు ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చేలా చట్టాన్ని చేయాలని, దీనికోసం ల్యాండ్ రికార్డులన్నిటినీ డిజిటల్ చేయాల్సి ఉంటుందని అప్పట్లోనే తీర్మానించారు. ఆ తీర్మానాలకు కొనసాగింపుగా.. 2004లో జాతీయ ల్యాండ్ రికార్డుల కంప్యూటరీకరణ (ఎన్ఎల్ఆర్ఏపీ) పథకాన్ని రూపొందించారు.దాని ప్రకారం 2009లో తొలి మోడల్ చట్టం తయారైంది. ఈ మోడల్ చట్టాన్ని అనుసరిస్తూ 2011లో నాటి యూపీఏ ప్రభుత్వం ఒక ముసాయిదా చట్టాన్ని తెచ్చింది. దానికి కొన్ని సవరణలు చేస్తూ 2015లో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో ముసాయిదా చట్టాన్ని తెచ్చింది. అదిగో ఆ తర్వాతే...అంటే 2015లో ముసాయిదా తెచ్చాకే కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ ‘నీతీ ఆయోగ్’ దీనికో రోడ్ మ్యాప్ ఇచ్చింది. టైటిల్ గ్యారంటీకి ఏమేం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? ఏం చేస్తే మనం ఆ దశకు చేరుకోగలమనే రోడ్డు మ్యాప్ అది. ఆ రోడ్ మ్యాప్కు తగ్గట్టుగానే 2019లో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మరో ముసాయిదా చట్టాన్ని రూపొందించింది. ఈ ముసాయిదాకు అనుగుణంగా.. ఈ చట్టాన్ని తేవాలంటే రాష్ట్ర భూముల సర్వేను పూర్తి చేయటం తప్పనిసరి కనక... ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రీ సర్వే పూర్తయితేనే ‘ల్యాండ్ టైట్లింగ్’ వాస్తవానికి రాష్ట్రంలో 17,000 గ్రామాలుండగా వాటిలో ఇప్పటికే 6 వేల గ్రామాల్లో రీ సర్వే పూర్తయింది. ఇంకా 11 వేల గ్రామాల్లో రీసర్వే జరగాల్సి ఉంది. రీ సర్వే జరిగి.. ఆ సందర్భంగా తలెత్తే వివాదాలన్నీ పరిష్కారం కావటానికి చాలా సమయం పడుతుంది. అదంతా పూర్తయ్యాక, రీ సర్వేలో పేర్కొన్న వ్యక్తులకు భూ హక్కు పత్రాలిస్తారు. ఆ పత్రాల ఆధారంగానే.. ప్రతి ఒక్కరికీ ఆయా భూముల టైటిల్ను వారి పేరిట మంజూరు చేస్తారు. అంటే.. రీ సర్వే పూర్తి కాకుండా ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని తేవటం అసాధ్యం. రీ సర్వే పూర్తయి.. ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమల్లోకి వస్తే... భూములపై సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, ఆర్థిక నేరాలు, ఇవేవీ లేకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. ఇదీ వాస్తవం. ల్యాండ్ టైట్లింగ్ చట్టం అవసరమా? నిజానికిప్పుడు భూమికి సంబంధించి రకరకాల పత్రాలుంటున్నాయి. 10(1), అడంగల్ వంటివి రెవెన్యూ విభాగం ఇచ్చేవి. ఇక రిజిస్ట్రేషన్ శాఖ విషయానికొస్తే ఆ శాఖ రిజిస్టరైన ప్రతిసారీ ఒక డాక్యుమెంట్ నెంబరు కేటాయిస్తుంది. అంతేకాదు.. సర్వే సెటిల్మెంట్, ఎండోమెంట్, అటవీ శాఖ, వక్ఫ్, స్థానిక సంస్థలు.. వీటన్నిటి వద్దా ఒకే భూమికి సంబంధించి వేర్వేరు రికార్డులు ఉంటున్నాయి. ఆ భూమిని ఒకరు కొన్నప్పుడో, అమ్మినప్పుడో అన్ని రికార్డుల్లోనూ ఒకేసారి నమోదయ్యే అవకాశం లేదు.దీంతో కొన్ని రికార్డుల్లో ఆ లావాదేవీలు నమోదవుతాయి. కొన్ని రికార్డుల్లో నమోదు కావటం లేదు. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఒక భూమిని కొన్నాక... రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయాక... వేరెవరో వచ్చి అది తాను ముందే కొన్నానని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో రిజిస్ట్రేషన్ కూడా అయిపోయాక... అది అసైన్డ్ భూమి అనో, గ్రామ కంఠం భూమి అనో, లేదా చుక్కల భూమి అనో తెలుస్తోంది. ఒక భూమికి సంబంధించిన రికార్డులు పలు చోట్ల పలు రకాలుగా ఉండటం వల్ల వస్తున్న సమస్య ఇది. ఇక రుణాల సంగతి తీసుకుంటే.. ఒక బ్యాంకు దగ్గరకు వెళ్లి డాక్యుమెంట్లు పెట్టి రుణాలు తీసుకుంటే ఆ సమాచారం రిజి్రస్టార్ కార్యాలయంలో అప్డేట్ కాదు. కొన్ని సందర్భాల్లో డాక్యుమెంట్లు పోయాయని చెప్పి డూప్లికేట్ డాక్యుమెంట్ తీసుకుని దాని ఆధారంగా మరోసారి రుణం తీసుకోవటమో, రుణం తీçర్చకుండానే ఆ భూమిని అమ్మేయటమో జరుగుతోంది. నిజంగా ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమల్లోకి వస్తే ఇలాంటి అక్రమాలçకు ఆస్కారం ఉండదు. అన్ని రికార్డులూ ఒకే రిజిస్టర్లో... ల్యాండ్ టైట్లింగ్ చట్టం వస్తే... టైటిల్ రిజిస్టరులో ప్రతి భూమికీ ఒక యునిక్ నంబరును (రీ సర్వేలో పేర్కొన్న మేరకు) కేటాయిస్తారు. ఆ రిజిస్టరు భూములతో సంబంధం ఉండే ప్రతి విభాగానికీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా ప్రతి బ్యాంకుకూ, ఆర్థిక సంస్థకూ అందుబాటులో ఉంటుంది. దీంతో ఆయా సంస్థలు తామిచ్చే రుణాలతో సహా ఆ భూమికి సంబంధించిన లావాదేవీలన్నిటినీ ఆ రిజిస్టరులో నమోదు చేస్తాయి. కాబట్టి తదుపరి మోసాలకు, వివాదాలకు తావుండదు. అందుకే ప్రభుత్వ గ్యారంటీ మోసాలకు తావుండదు కనక.. ఈ చట్టం ప్రకారం ప్రతి భూమికీ ప్రభుత్వం ఆయా టైటిల్ దారు పేరిట బీమా చేయిస్తుంది. కాబట్టి ఊహించని పరిస్థితుల్లో ఆ భూమి తనదంటూ వేరెవరైనా వివాదం తెచ్చినా... ఒకవేళ అది ఏ అసైన్డ్ భూమో అని తేలినా.. టైటిల్ దారుకు ప్రభుత్వమే పరిహారం చెల్లిస్తుంది. అంటే ఆ టైటిల్దారుకు ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుందన్న మాట. ఇదీ చంద్రబాబు సహా ఎల్లో ముఠా ఎక్కడా చెప్పని పచ్చి నిజం.మోదీతో చెప్పించు బాబూ? అసలు ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని తయారు చేసింది కేంద్రమే కదా? దానిపై వివిధ రాష్ట్రాలతో కమిటీ వేసి మరీ.. తగిన మార్గదర్శకాలు రూపొందించింది కేంద్ర ప్రభుత్వ నోడల్ సంస్థ ‘నీతీ ఆయోగ్’ కదా? ఆ కమిటీ నివేదిక మేరకు.. దానికి రకరకాల ముసాయిదాలు రూపొందించి.. దాన్ని అన్ని రాష్ట్రాలకూ పంపించింది అబద్ధమా? దానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తన రాష్ట్రానికి సంబంధించిన ముసాయిదా చేయటం అబద్ధమా? ఆ కోవలోనే కదా! ఈ చట్టం తేవాలంటే ముందుగా రాష్ట్రం మొత్తాన్ని రీ సర్వే చేయాల్సి ఉంటుంది కనక ఆ సర్వే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అంత మాత్రానికే ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమల్లోకి వచ్చేసిందంటూ అన్ని భూములనూ జగన్ ప్రభుత్వం తన పేరిట రాసేసుకుంటోందని చెబుతూ ఎన్నికల ముందర చంద్రబాబు, ఆయన పచ్చ ముఠా వికృత క్రీడ మొదలు పెట్టింది. లేని చట్టాన్ని రద్దు చేస్తామంటూ మేనిఫెస్టోలో కూడా హామీ ఇచ్చింది. ఈ రాష్ట్రంలో టీడీపీ ఒంటరిగా పోటీ చేయటం లేదు. బీజేపీతో, జనసేనతో కలిసి పోటీ చేస్తోంది. పైపెచ్చు రాష్ట్రంలో ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీనీ పిలిపిస్తోంది.ఇప్పటికే ఒకసారి ప్రచారం చేసి వెళ్లిన నరేంద్ర మోదీ.. త్వరలో మళ్లీ రాష్ట్రానికి రాబోతున్నారు. మరి ఆ రోజున ప్రధాన మంత్రి ముందే ఈ చట్టాన్ని మేం అమలు చేయబోమని చెప్పగలవా చంద్రబాబూ? ఈ చట్టాన్ని ఏ రాష్ట్రంలోనూ అమలు చేయబోమని మోదీతో చెప్పించగలవా? ల్యాండ్ టైట్లింగ్ అంటూ ఊగిపోతున్న పవన్ కల్యాణ్.. మోదీ ముందు అదే నటనను కొనసాగించగలరా? ఎన్నాళ్లీ పనికిమాలిన డ్రామాలు?ఇదీ... ఎల్లో ముఠా సాగిస్తున్న విష ప్రచారం 1. ల్యాండ్ టైట్లింగ్ చట్టం ద్వారా భూములన్నీ లాగేసుకుంటారు. రాత్రికి రాత్రి ఆన్లైన్లో రికార్డులను మార్చేస్తారు. 2. సివిల్ కోర్టులకు ఇక భూములపై అధికారాలు ఉండవు. ల్యాండ్ టైటిల్స్ కోర్టులు ఇవ్వాలి గానీ, రెవెన్యూ శాఖ ఎలా ఇస్తుంది.. 3. భూములకు సంబంధించిన అన్ని అధికారాలు తీసుకెళ్లి టైటిల్ రిజిస్టర్ అధికారికి ఇస్తున్నారు.. ఆయన ఎమ్మెల్యే, ఎంపీ, అధికార పార్టీ వాళ్లు చెప్పిన ఎవరికి కావాలంటే వారికి భూములు రాసేస్తారు. 4. ఈ చట్టం వచ్చాక భూములున్న వారంతా మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.అసలు వాస్తవాలు ఇవీ.. 1. ప్రభుత్వం భూములెలా లాక్కుంటుంది? 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, గిరిజనులకు 3.22 లక్షల ఎకరాలకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు అందజేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం కలలోనైనా ఇలాంటి ఆలోచన చేస్తుందా? నిజానికి రీసర్వే చేసేటపుడే ఆ భూమి ఎవరిదో తేల్చి.. వారి పేరిట హక్కు పత్రాలు ఇస్తోంది. ఆ హక్కుదారు పేరే కదా రికార్డుల్లో ఉంటుంది. మరి ఆ పేరును మార్చేయటం సాధ్యమా? రాత్రికి రాత్రి ఆన్లైన్లో ఎలా మార్చేస్తారు? మన పేరిట హక్కు పత్రం ఇచ్చినపుడు...ఆ పత్రం మనదగ్గర ఉన్నపుడు రికార్డుల్లో మన పేరు మార్చేయటం ఎలా సాధ్యం? ఏ కొంచెం ఆలోచన ఉన్నా ఇది తెలిసిపోతుంది కదా! 2. రికార్డుల్లో జరిగే తప్పులపై ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నది తహసీల్దారు, ఆర్డీఓ, కలెక్టరు ప్రభుత్వ అధికారులకే కదా? వీళ్లతో పాటు ఉండే టైటిల్ రిజి్రస్టారు కూడా ప్రభుత్వాధికారే ఉంటారు. దీన్లో తప్పేముంది? ఇక భూమి యాజమాన్యంపై వచ్చే సివిల్ వివాదాలు ఇప్పటి మాదిరే కోర్టుల్లోనే పరిష్కారమవుతాయి. దీన్లో ఎలాంటి తేడా ఉండదు. మరి కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదనటం పచ్చి అబద్ధం కాదా? 3. అన్ని అధికారాలూ టైటిల్ రిజి్రస్టారుకు ఎందుకుంటాయి? ఇప్పుడు భూముల రిజిస్టరు సబ్ రిజి్రస్టారు కార్యాలయంలో ఉంటోంది. ఆయన కూడా ప్రభుత్వాధికారే. మరి ఆయన ఎమ్మెల్యే, ఎంపీలు చెప్పినట్లు రికార్డుల్లో పేర్లు మార్చేయగలుగుతున్నారా? ఎవరికి కావాలంటే వారికి భూములు రాసేయగలుగుతున్నారా? రికార్డుల్లోని వివరాల నిర్వహణకు ప్రభుత్వం నియమించే గుమాస్తాగానే ఆయన్ను చూడాలి తప్ప.. రికార్డులు మార్చే అధికారం తనకు ఎందుకుంటుంది? 4. మళ్లీ ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు? అసలు ఆ అవసరం ఎందుకుంటుంది? వివిధ కార్యాలయాల్లో ఉండే వివరాలను ఆన్లైన్లో క్రోడీకరించి.. రీ సర్వేలో ఇచ్చిన హక్కు పత్రాల ఆధారంగా రిజిస్టరులో ప్రభుత్వమే నమోదు చేసుకుంటుంది. మళ్లీ రిజిస్ట్రేషన్ అక్కర్లేదు.
Related News by category
-
సొమ్మంతా ప్రసాదార్పణం
కృష్ణాజిల్లాశుక్రవారం శ్రీ 19 శ్రీ ఏప్రిల్ శ్రీ 2024అక్కడ వ్యాపారుల కూటమి షో అట్టర్ ఫ్లాప్ వెండితొడుగు బహూకరణ పామర్రు మండలం రాపర్లలో ఉన్న వీరాంజనేయ స్వామి దేవాలయానికి భక్తులు వెండి సర్వాంగాన్ని బహూకరించారు. బెజవాడలో భారీ అగ్ని ప్రమాదంవిజయవాడలో గురువారం జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో రూ.కోటి ఆస్తి నష్టం వాటిల్లింది. మందుల, వస్త్రాల గోడౌన్లో ప్రమాదం సంభవించింది. u8లో సాక్షి ప్రతినిధి, విజయవాడ: సార్వత్రిక ఎన్నికల ఫండ్ పేరుతో కూటమి అభ్యర్థి అందినకాడికి వసూలు చేసేస్తున్నాడు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో భాగమైన ఆ నియోజకవర్గంలో ఆ అగ్రకుల పెత్తందారు సీటు దక్కించుకునే దగ్గర నుంచి అన్నింటా వసూళ్లే. ఈ ఎన్నికల్లో ఎలాగూ గెలిచేది లేదని నిర్థారణకు వచ్చిన ఆయన కొత్త ఎత్తుగడ వేశారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందాన, వసూళ్లకు తెగబడి అందినకాడికి దోచుకోవాలనే వ్యూహానికి తెర లేపారు. విజయవాడ సిటీకి ఆనుకుని ఉండే ఈ నియోజకవర్గాన్ని కై వసం చేసుకుని తద్వారా ఇక్కడ ఉన్న సహజవనరులు దోచుకోవాలని, రియల్ వ్యాపారంలో కోట్లు కూడబెట్టాలన్నది ఆయన లక్ష్యం. అది ఫలించే సూచనలు కనిపించకపోవడంతో ఆయా రంగాల్లో ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని తనకు ఇప్పుడు సహకరిస్తేనే...రేపు తన వంతు సహకారం ఉంటుందని అన్యాపదేశంగా హెచ్చరిస్తుండటం గమనార్హం. కప్పం కట్టాల్సిందేనంటూ ఇండెంట్లు జిల్లాలో హాట్ సీట్..ఇన్కం క్రియేట్ సీట్గా పేరున్న ఆ నియోజకవర్గంలో రియల్ వ్యాపారం అధికంగా జరిగే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని బిల్డర్లు, రియల్ వ్యాపారులకు ఇప్పటికే ఇండెంట్లు ఇచ్చేశారు. వైద్యం, విద్య, వ్యాపార రంగంలో స్థిరపడ్డ వ్యక్తులను కూడా టార్గెట్ చేశారు. అన్నీ సజావుగా సాగాలంటే కప్పం కట్టాలని హుకుం జారీ చేస్తున్నారు. భవిష్యత్తు ‘‘కమ్మ’’గా ఉండాలంటే మీకు బాధ్యత ఉందా? లేదా? అనే సెంటిమెంట్నూ వాడుకుంటున్నారు. గ్రామాల వారీగా ఎన్ఆర్ఐల జాబితాను సిద్ధం చేసి తన అనుయాయుల ద్వారా ఫోన్లు చేయించి ఫండ్ రెడీ చేసుకోమని తాము చెప్పిన వ్యక్తుల ఖాతాలకు డబ్బులు పంపాలని సూచిస్తున్నట్టు తెలిసింది. 2014లో అధికారాన్ని అనుభవించిన ఆయన ఉచిత ఇసుక, రియల్ వ్యాపారం, విద్య, వైద్య రంగాల్లో వ్యాపారాలకు తన వంతు సహాయ సహకారాలను అందించారు. అడ్డగోలుగా సహజవనరుల్ని బొక్కేసి, అనుయాయులు నాలుగురాళ్లు వెనకేసుకునేలా తోడ్పాటునందించారు. ఈ దఫా వాళ్లందరినీ ఫండ్స్ కోసం టార్గెట్ చేసి గల్లా పెట్టె నింపుకొనే పనిలో పడ్డారు. ఎన్ఆర్ఐల ఫండ్తోనే సీటు దక్కింది ఆది నుంచి సీటు లేదని తేలిపోవటంతో ఏడ్చి పెడబొబ్బలు పెట్టాడాయన. ఎన్ఆర్ఐల ద్వారా అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి, వారి ద్వారా కప్పం కట్టించి మరీ చివరి నిమిషంలో అభ్యర్థిత్వం ఖరారు చేసుకున్నారు. ఇప్పుడిక వసూళ్ల పర్వానికి తెరలేపారు. ఇండెంట్లు పెట్టడానికి, ముక్కుపిండి వసూలు చేసేందుకు ఓ పది మందితో కూడిన కమిటీని వేశారు. ఓ మాజీ సర్పంచ్కు ఆ కమిటీ అధ్యక్ష పీఠం కట్టబెట్టి రంగంలోకి దించారు. ఇక ఆ కమిటీ కొద్ది రోజులుగా ఇదే పనిలో ఉంది. ఎన్నికల నేపథ్యంలో ఖర్చులకు కనీసం రూ.25 కోట్లకు పైగా వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకుని జల్లెడ పట్టేస్తున్నారు. ఎంపీ అభ్యర్థి ఇచ్చేది, పార్టీ అధిష్టానం దయతలచి ఇచ్చేది కాగా వచ్చిన సొమ్ములో కొంత ఖర్చులు పోనూ మిగిలిన దాంతో ఇల్లు చక్కపెట్టుకునే పనిలో ఉన్నారు. ఇంద్రకీలాద్రిపై శుక్రవారం నుంచి చైత్రమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించే ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ద్వాదళ ప్రదక్షిణలు, పవళింపు సేవలు నిర్వహిస్తారు. శుక్రవారం ఉదయం 9–30 గంటలకు దుర్గా మల్లేశ్వరస్వామి వార్లకు మంగళ స్నానాలను నిర్వహిస్తారు. ఉత్సవమూర్తులకు పంచామృత అభిషేకాలు, మంగళస్నానాలు, నూతన వధూవరులుగా అలంకరణ చేస్తారు. సాయంత్రం విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, ఉత్సవాలకు అంకురార్పణ, అఖండ దీపస్థాపన, కలశారాధన, బలిహరణ, అగ్నిప్రతిష్టాపన, ఉత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహిస్తారు. 19 నుంచి 23 వరకుగత ఎన్నికల్లో సైతం... జగన్కు అడుగడుగునా జన ప్రవాహం 7న్యూస్రీల్ఎన్నికలొస్తే ఆ అగ్రకుల అభ్యర్థికి పండగే...తన సామాజిక వర్గం దండిగా ఉన్న ఆ నియోజకవర్గంలో గ్రామాల వారీగా కోటీశ్వరులు, ఎన్ఆర్ఐల జాబితాలు తయారుచేసి వసూళ్ల పర్వం మొదలెడతాడు. వచ్చిన దాంట్లో సగం ఖర్చు పెట్టి, మిగతా సగం వెనకేసుకుంటాడు. గతంలో ఇలాగే చేశాడు. ఈసారి ఆ పార్టీ టికెట్ కోసం విపరీతమైన పోటీ రాగా ఎన్ఆర్ఐల ఫండ్ గ్యారంటీతోనే చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం గెలుపుపై ఆశలు సన్నగిల్లిన ఆయన బరితెగించి వసూళ్ల కోసం ఏకంగా ఓ కమిటీనే నియమించాడు. ఊరూరా ఎన్ఆర్ఐలు, బడా వ్యాపారుల జాబితాలు సేకరించి వసూళ్ల పర్వం మొదలెట్టాడు. ఆ నియోజకవర్గంలో టీడీపీ కూటమి అభ్యర్థి వసూళ్ల పర్వం వసూళ్ల కోసం ప్రత్యేకంగా కమిటీ నియామకం బిల్డర్లు, వ్యాపారులు, ఎన్ఆర్ఐలే లక్ష్యం కోట్లు వసూలు చేసి ఇల్లు చక్కబెట్టుకునే యత్నం ఇప్పటికే బోలెడు డెనేషన్ల వసూలు కూటమి అభ్యర్థి 2019లో అధిష్టానం ఇచ్చిన సొమ్ము, ఇతరత్రా ఫండ్స్లో ఖర్చుపెట్టగా తమ ప్రభుత్వమే వస్తుందన్న ధీమాతో సుమారు రూ.4 కోట్లకు పైగా పందేలు కట్టారు. సొమ్ము పోయి శని పట్టింది. ఈ దఫా అలాంటి పరిస్థితి రాకుండా కొంత జాగ్రత్త వహిస్తున్నారు. గత ఎన్నికల్లో పోయిన సొమ్ముతో పాటుగా ఈ దఫా అధికమొత్తంలో వసూలు చేసుకుంటున్నారు. ఈ చందాల వసూళ్లు నియోజక వర్గంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల ముందే ఈ రేంజ్లో దోపిడీ ఉంటే...పొరపాటున ఈయన గెలిస్తే ఇంకెలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల రూపంలో ఆయనకు బుద్ధి చెప్పేందుకు రెడీ అవుతున్నారు. -
జగనన్న రావాలి.. పథకాలు అందుకోవాలి
ప్రజాదీవెనలో జెడ్పీ చైర్పర్సన్ హారిక బంటుమిల్లి: రాష్ట్రంలో తిరిగి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా లబ్ధిదారుల ఇంటి ముందుకు వస్తాయని ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం బంటుమిల్లిలో ప్రజాదీవెన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ అభ్యర్థి ఉప్పాల రమేష్(రాము) నాయకులు, కార్యకర్తలతో కలసి ఆమె పాల్గొన్నారు. ఇందులో భాగంగా హారిక, రాము ఇద్దరు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు అందజేస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి ఎమ్మెల్యేగా రామును, మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖరరావును గెలిపించాలని వారు కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ వి. చినబాబు, వైస్ ఎంపీపీ ఒ.చిన్నారి బాబు, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ టి.శ్రీనివాసరావు, ఏఎంసీ వైస్చైర్మన్ పి. బాబూరావు, ఎంపీటీసీ సభ్యులు కమాల్ బాషా, పి.వీరబాబు, ఆలీం, కె. శ్రీనివాసరావు, కె.నాగేశ్వరరావు, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు ఎస్. మహేష్, నాయకులు ఎం. నాగేశ్వరరావు, ఎం.రాజబాబు, ఎం.వెంకటేశ్వరరావు, జి.బాల, సీహెచ్ రాధాకృష్ణ, బి. గాంధీ, పి.నాని తదితరులు పాల్గొన్నారు. -
ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ
● అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు నామినేషన్లు ● పార్లమెంట్ స్థానానికి దాఖలు కాని నామినేషన్లు చిలకలపూడి(మచిలీపట్నం): సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కీలక ఘట్టమైన అభ్యర్థులు నామినేషన్ల దాఖలు కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులకు వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్ పత్రాలను దాఖలు చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గానికి తొలిరోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పామర్రు అసెంబ్లీ సెగ్మెంట్కు టీడీపీ అభ్యర్థిగా వర్ల కుమార్రాజా గురువారం రిటర్నింగ్ అధికారి శ్రీదేవికి నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. మచిలీపట్నం అసెంబ్లీ సెగ్మెంట్కు సంబంధించి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి వక్కలగడ్డ పావని రిటర్నింగ్ అధికారి ఎం.వాణికి నామినేషన్ పత్రాన్ని అందజేశారు. గన్నవరం అసెంబ్లీ సెగ్మెంట్కు సంబంధించి టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు రెండు సెట్ల నామినేషన్లు, ఆయన భార్య యార్లగడ్డ జ్ఞానేశ్వరి ఒక సెట్ నామినేషన్ రిటర్నింగ్ అధికారి గీతాంజలిశర్మకు అందజేశారు. ఎన్టీఆర్ జిల్లాలో అసెంబ్లీకి 11,పార్లమెంట్కు రెండు నామినేషన్లు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఫారం –1 పబ్లిక్ నోటీసు జారీ చేయడంతో ఈ నామినేషన్ల పర్వం మొదలైంది. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఆర్వో కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు పబ్లిక్ నోటీసు జారీ చేశారు. ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ కార్యాలయాల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు తొలి రోజు 13 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో విజయవాడ పార్లమెంట్కు సంబంధించి 2, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 11 నామినేషన్లు వేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి తొలి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. వైఎస్సార్ సీపీ, బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి సంబంధించి ముగ్గురు అభ్యర్థులు మాత్రమే తొలి రోజు నామినేషన్లు దాఖలు చేశారు. -
No Headline
సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారానికి ఎక్కడకు వెళ్లినా జన ప్రవాహం ఉవ్వెత్తున కదిలివస్తోంది. ఈ నెల 15వ తేదీన వైఎస్ జగన్ కృష్ణా జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహించారు. జిల్లాలో ప్రవేశించినప్పటి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలోకి వెళ్లే వరకు అడుగడుగునా జనం నీరాజనం పలికారు. గన్నవరం బస్సు యాత్రలో, బహిరంగ సభ ఏర్పాటు చేసిన గుడివాడలో వీధులన్నీ జనంతో నిండిపోయాయి. 10 ఎకరాల సభా మైదానం కిక్కిరిసిపోయి వేల మంది రోడ్లపైనే ఉండిపోయారు. జగన్ సభలకు వచ్చిన జనంతో పోలిస్తే... చంద్రబాబు కూటమి షోలు జనం లేక వెలవెలపోయాయి. సాక్షి, మచిలీపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు మూడు పార్టీల కూటమితో కలిసి నిర్వహిస్తున్న షోలు వరుసగా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. ప్రజల మద్దతు లేకపోవడంతో అసహనానికి గురవుతున్న ఆ పార్టీ నేతలు సంక్షేమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం, వైఎస్సార్ సీపీ అధినేత, సీఎం జగన్పై ఆరోపణలు చేయడమే లక్ష్యంగా తమ ప్రచారాలు నిర్వహిస్తున్నారు. జనసేన, బీజేపీలతో జతకట్టిన తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న షోలు, సభలకు ఏ మాత్రం స్పందన కానరావడం లేదు. ఈ నేపథ్యంలో రోజువారీ కూలీలకు డబ్బు, మందు, బిర్యానీలు ఆఫర్ ఇచ్చి రప్పించినా.. సభ పూర్తయ్యే వరకు కూడా వారు ఉండడం లేదు. పాడిందే పాట అన్నట్లు చంద్రబాబు చెప్పిందే చెబుతుండడంతో ఆ సోది వినలేక సభ ప్రారంభమై, బాబు మైకు అందుకోగానే జనం వెనక నుంచి గుంపులు గుంపులుగా ఇళ్లకు వెళ్లిపోతున్నారు. పెడన, మచిలీపట్నంలో... ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఆయన జనసేన నేత పవన్ కల్యాణ్తో కలిసి జిల్లాలోని పెడన, మచిలీపట్నంలలో కార్యక్రమం నిర్వహించారు. సభను జయప్రదం చేసి, ఉనికి కాపాడుకోవాలనే తాపత్రయంలో కూటమి నేతలు ఎంత కసరత్తు చేసినా ప్రజల నుంచి అంతంత మాత్రంగానే స్పందన లభించింది. ఇది ముందే ఊహించిన పార్టీ నేతలు తమ సభలను మైదానాల్లో కాకుండా ఇరుకు సందులు, ట్రాఫిక్ ఉండే రోడ్లలో ఏర్పాటు చేసుకుంటుండటం గమనార్హం. పెడనలో బస్టాండ్ సెంటర్లో, మచిలీపట్నంలో కోనేరు సెంటర్ నుంచి విజయవాడ వెళ్లే రోడ్డులో ట్రాఫిక్ నిలిపివేసి సభలు నిర్వహించారు. పెడనలో మూడు పార్టీలు కలిసినా 3వేలకు మించని జనం. మచిలీపట్నంలో సైతం 5వేలు దాటలేదు. గతంలో పామర్రు, ఉయ్యూరుల్లోనూ ఇదే పరిస్థితి. జనం లేక ఆలస్యంగా సభలు జన సమీకరణ కోసం కూటమి అభ్యర్థులు పెద్దఎత్తున ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. షెడ్యూల్ ప్రకారం పెడనలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన సభ సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమైంది. మచిలీపట్నంలో రాత్రి 7 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా 9 గంటలకు ఆరంభమైంది. ఆచరణకు సాధ్యం కాని అబద్ధపు హామీలతో కూడిన చంద్రబాబు ప్రసంగం వినే ఓపిక తమకు లేదని జనం అనుకుంటున్నారు. బాబు మాట్లాడడం ప్రారంభమైన వెంటనే జనం గుంపులు గుంపులుగా వెనుతిరిగి వెళ్లిపోవడం ప్రారంభించారు. ఎక్కడా కనిపించని బీజేపీ జెండాలు ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో చంద్రబాబు జనసేన, బీజేపీలతో జత కట్టారు. అయితే ఆయన ఆ పార్టీ అధినేతలను తన వైపు తిప్పుకున్నప్పటికీ కింది స్థాయి కేడర్, కార్యకర్తల నుంచి పూర్తి స్థాయి మద్దతు కరువైంది. మచిలీపట్నంలో జరిగిన సభలో బీజేపీ జెండాలు ఎక్కడా కనిపించలేదు. జనాకర్షణ ఏ మాత్రం లేని చంద్రబాబు, పవన్ పర్యటన గళం వినే జనం లేక గంటల సేపు బస్సులోనే బాబు మూడు పార్టీలు కలిసి సమీకరించినా అంతంతమాత్రంగానే హాజరు మచిలీపట్నంలో కనిపించని బీజేపీ నేతలు, జెండాలు బాబు మైకు అందుకోగానే సోది వినలేక వెనుతిరిగిన జనం -
ముగిసిన వసంత నవరాత్రోత్సవాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో నిర్వహిస్తున్న వసంత నవరాత్రోత్సవాలు గురువారంతో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతి నిత్యం అమ్మవారికి పుష్పార్చన నిర్వహించారు. చివరి రోజు అమ్మవారికి అన్ని రకాల పుష్పాలతో అర్చన చేశారు. దేవస్థాన యాగశాలలో మహా పూర్ణాహుతితో ఉత్సవాలు లాంఛనంగా ముగిసాయి. అమ్మవారికి అర్చన నిర్వహించే పుష్పాలతో ఆలయ ఈవో కెఎస్.రామరావు దంపతులు, స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఏఈవో రమేష్బాబు, ఇతర అధికారులు ఊరేగింపుగా వేదిక వద్దకు చేరుకున్నారు. పుష్పార్చన వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. భక్తులకు పుష్పాలను పంపిణీ చేశారు. యాగశాలలో ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు యజ్ఞనారాయణ మూర్తి, రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి పర్యవేక్షణలో పూర్ణాహుతి నిర్వహించారు. పూర్ణాహుతితో పరిసమాప్తం నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ఆది దంపతులకు మంగళ స్నానాలు ధ్వజారోహణతో దేవతలకు ఆహ్వానం
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
ఎండుతున్న జలకళ
షూటింగ్... పార్టీయింగ్...
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
బిందువే సిరుల సింధువు
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement