ఫేస్బుక్లో సచిన్ టెండూల్కర్ ను మించిన నరేంద్ర మోడీ
Published
Mon, Dec 9 2013 11:03 PM
న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ను అధిగమించి రికార్డు సృష్టించారు. ఆశ్చరపోకండి... పరుగులు చేయడంలో కాదు... సామాజిక అనుసంధాన వేదికల్లో... దేశంలోని నెటిజన్లు ఆన్లైన్లో ఎక్కువగా నరేంద్రమోడీ గురించే మాట్లాడుకున్నారని ఫేస్బుక్ సంస్థ తెలిపింది. 2013లో భారతీయ నెటిజన్లు ఎక్కువగా చర్చించిన అంశాలను ప్రస్తావించింది. ఇందులో ఆర్బీఐ గవర్నర్ రఘురాం రంజన్, మార్స్ మిషన్లు కూడా ఉన్నప్పటికీ ఇవేవీ మోడీ చరిష్మాను అధిగమించలేకపోయాయి.
దీంతో ఈ ఏడాది ఫేస్బుక్లో ఎక్కువమంది మాట్లాడుకున్న వ్యక్తిగా బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ రికార్డు సృష్టించారు. తర్వాత స్థానం ఇటీవల క్రికెట్ నుంచి రిటైర్డ్ అయిన సచిన్ను వరించింది. ఐ-ఫోన్5, ఆర్బీఐ గవర్నర్ రఘురాంరంజన్ మూడు,నాలుగు స్థానాల్లో నిలిచారు.