టైమ్ ‘పర్సన్ ఆఫ్ ద ఇయర్’ తుది రేసులో మోడీ | Sakshi
Sakshi News home page

టైమ్ ‘పర్సన్ ఆఫ్ ద ఇయర్’ తుది రేసులో మోడీ

Published Wed, Nov 27 2013 2:54 AM

Narendra Modi in final race of Time person of the year

 న్యూయార్క్: ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ టైమ్... ‘పర్సన్ ఆఫ్ ద ఇయర్-2013’ అవార్డుకు కుదించిన తుది జాబితాలో బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ సీఎం నరేంద్ర మోడీకి చోటు లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ జాబితాలో మొత్తం 42 మందికి చోటు దక్కగా భారత్ నుంచి ఇందులో స్థానం దక్కించుకున్న ఏకైక భారతీయుడు మోడీనే. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వాన్ని పడగొట్టగల అవకాశం ఉన్న వ్యక్తి ఆయనేనని ‘టైమ్’ పేర్కొంది. జాబితాలోని ఇతర ప్రముఖుల్లో జపాన్ ప్రధాని షింజో అబె, అమెరికా అధ్యక్షుడు ఒబామా, పాక్ సాహస బాలిక మలాలా, అమెరికా నిఘా రహస్యాలను బయటపెట్టిన ఎడ్వర్డ్ స్నోడెన్ ఉన్నారు. విజేతను ‘టైమ్’ ఎడిటర్లు వచ్చే నెల ఎంపిక చేస్తారు. అయితే ఈ ఏడాది వార్తల్లో (మంచి అయినా/చెడు అయినా) ఎక్కువగా నిలిచిన వ్యక్తికి ఓటు వేయాల్సిందిగా ఆన్‌లైన్ పాఠకులను ‘టైమ్’ కోరగా 2,650కిపైగా ఓట్లు/25 శాతంతో మోడీ తొలి స్థానంలో ఉన్నారు.
 

Advertisement
Advertisement