నా జీవిత కథ పాఠ్యాంశమా... వద్దు వద్దు | Sakshi
Sakshi News home page

నా జీవిత కథ పాఠ్యాంశమా... వద్దు వద్దు

Published Fri, May 30 2014 11:01 AM

నా జీవిత కథ పాఠ్యాంశమా... వద్దు వద్దు - Sakshi

తన జీవిత కథను పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం స్పందించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలపై ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. దేశంలో ఎందరో మహనీయులు ఉన్నారని, వారి జీవిత కథలను పాఠ్యాంశాలుగా చేరిస్తే పాఠశాల విద్యార్థులు మరింత స్పూర్తి పొందిన వారు అవుతారని ఆయన అభిప్రాయపడ్డారు. భారత ప్రధాని పీఠాన్ని అధిరోహించిన నరేంద్ర మోడీ జీవిత కథను పాఠ్యాంశంగా చేర్చాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న నరేంద్ర మోడీ శుక్రవారం తన ట్విట్టర్లోపై విధంగా స్పందించారు.

Advertisement
Advertisement