సోనియా, రాహుల్కు నోటీసులు | Sakshi
Sakshi News home page

సోనియా, రాహుల్కు నోటీసులు

Published Sat, Aug 27 2016 3:11 PM

సోనియా, రాహుల్కు నోటీసులు - Sakshi

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ కోర్టు ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు మరో ఐదుగురికి నోటీసులు జారీచేసింది. రెండు వారాలలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను అక్టోబరు 4వ తేదీకి వాయిదా వేసింది.

నేషనల్ హెరాల్డ్ పత్రిక నిధులను సోనియా, రాహుల్ దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అసోసియేట్ జర్నల్ లిమిటెడ్(ఏజేఎల్), కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్యుమెంట్లు కోరుతూ సమన్లు జారీచేయాల్సిందిగా స్వామి కోర్టుకు విన్నవించారు. ఈ కేసును విచారించిన పాటియాల కోర్టు కాంగ్రెస్ నేతలకు నోటీసులు పంపింది.

Advertisement
Advertisement