'డబుల్' ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై హైకోర్టు
♦ ఎంపిక ప్రక్రియకు ఓ నిర్దిష్ట విధానం ఉంటుంది
♦ ఈ ఉత్తర్వులు చట్ట విరుద్ధంగా ఉన్నాయి
♦ వాటిని ఉపసంహరించుకుని తాజా జీవో ఇవ్వడం మంచిదని వ్యాఖ్య
♦ కౌంటర్ దాఖలు చేస్తామన్న ప్రభుత్వం తరఫు న్యాయవాది
♦ అంగీకరించిన ధర్మాసనం.. విచారణ 30కి వాయిదా
సాక్షి, హైదరాబాద్: రెండు పడక గదుల ఇళ్ల పథకంలో లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలు, మంత్రులకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు తప్పుపట్టింది. ఆ ఉత్తర్వులు చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. వారికి బదులు అధికారులతో కూడిన కమిటీకి లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను అప్పగించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. అసలు ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజల నుంచి ఎలా దరఖాస్తులను స్వీకరిస్తారని, ఇటువంటి ఉత్తర్వులను ఎలా జారీ చేస్తారని ప్రశ్నించింది. వాటిని ఉపసంహరించుకుని, తాజాగా జీవో జారీ చేయడం మంచిదని అభిప్రాయపడింది. అయితే దీనిపై గడువునిస్తే పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేస్తామని, ప్రస్తుతానికి లబ్ధిదారులను ఎంపిక చేయబోమని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది బి.మహేందర్రెడ్డి కోర్టుకు నివేదించారు. ఈ మేరకు గడువు ఇచ్చిన హైకోర్టు... తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.రవికుమార్లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
రెండు పడక గదుల ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలను ఎమ్మెల్యేలు, మంత్రులకు అప్పగించడాన్ని సవాలు చేస్తూ కరీంనగర్కు చెందిన జి.దేవదాస్ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖ లు చేశారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం తాత్కాలిక సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సరసాని సత్యం రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ పథకం లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలను సగం మంత్రులకు, సగం ఎమ్మెల్యేలకు అప్పగించారని... ఇది చట్టవిరుద్ధమని కోర్టుకు నివేదించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ఆ జీవో పట్ల తాము కూడా సంతృప్తికరంగా లేమని పేర్కొంది. లబ్ధిదారుల ఎంపికకు ఓ నిర్దిష్ట విధానం ఉంటుం దని, అందుకు విరుద్ధంగా ఎంపిక బాధ్యతను ప్రజాప్రతినిధులకు ఎలా కట్టబెడతారని ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది మహేందర్రెడ్డి స్పందిస్తూ.. లబ్ధిదారులను మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంపిక చేసినా కూడా... గ్రామ సభల్లో పరిశీలించిన తరువాతే జాబితాను ఖరారు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కౌంటర్ రూపంలో కోర్టు ముందు ఉంచుతామని చెప్పారు. దీనికి ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను వాయిదా వేసింది.
ఎమ్మెల్యేలు, మంత్రులకు ఎలా అప్పగిస్తారు?
Published Tue, Nov 24 2015 2:18 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement