పట్నా: ఇటీవలి ఐదురాష్ట్రాల ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయన్న సంగతి మరిచి బీజేపీ అత్యుత్సాహంతో పొంగిపోతున్నదని, 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీం మోదీని మట్టికరిపించాలంటే జాతీయస్థాయిలో మహాకూటమి ఏర్పాటు అత్యావశ్యమని జనతాదళ్(యునైటెడ్) పార్టీ అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ అన్నారు. దేశంలోనే అతి పెద్ద పార్టీగా పేరున్న కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ఈ మేరకు సమాలోచన జరపాలని కోరారు. సోమవారం పట్నాలో లోక్సంవాద్ (ప్రజలతో ముఖాముఖి) కార్యక్రమం అనంతరం కొద్దిసేపు మీడియాతో మాట్లాడిన నితీశ్ పలు అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘మొన్నటి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పంజాబ్లో కాంగ్రెస్ గెలుపొందడం, మణిపూర్, గోవాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించడాన్ని బట్టిచూస్తే గాలి బీజేపీ వైపే వీచిందని చెప్పలేం. ఉత్తరప్రదేశ్లోనూ బిహార్(జేడీయూ-ఆర్జేడీ పొత్తు) తరహా మహా కూటమి ఏర్పాటై ఉండుంటే బీజేపీ ఖచ్చితంగా ఓడిపోయేది. సమాజ్వాదీ, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలు సాధించిన ఓట్ల శాతం బీజేపీకి పడిన ఓట్ల కంటే 10 శాతం ఎక్కువ అన్న విషయాన్ని గమనించాలి. గోవా, మణిపూర్ల్లో బీజేపీ ఏర్పాటుచేసింది అతుకుల బొంత లాంటి ప్రభుత్వాలేనని గుర్తుంచుకోవాలి. వచ్చే సర్వాత్రిక ఎన్నికల్లోనైనా బీజేపీ-ఎన్డీఏకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో మహాకూటమిని ఏర్పాటుచేయాలి. అందుకు కాంగ్రెస్ ముందడుగు వేయాలి. నా వంతుగా లెఫ్ట్ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నా’ అని నితిశ్ చెప్పారు.
వచ్చే లోక్సభ ఎన్నికల సంగతి పక్కనపెడితే ఏప్రిల్ 23న జరగనున్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ, ఆమ్ ఆద్మీ పార్టీలు విడివిడిగా బీజేపీతో తలపడుతున్నాయి. ఇదే విషయాన్ని ప్రస్తావించిన నితీశ్.. ‘లోకల్ ఎన్నికలు వేరు లోక్సభ ఎన్నికలు వేరు’ అని వ్యాఖ్యానించారు. ఇక ఈవీఎంల ట్యాంపరింగ్పై లాలూ ప్రసాద్ యాదవ్(ఆర్జేడీ), మాయావతి(బీఎస్పీ), అరవింద్ కేజ్రీవాల్(ఆప్) తదితరుల లేవనెత్తుతోన్న ఆక్షేపణలు పాతవేనని, ఎన్నికల సంఘమే వీటికి వివరణ ఇవ్వాలని అన్నారు.
2019లో మోదీని మట్టికరిపించాలంటే..
Published Mon, Apr 3 2017 8:05 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
ఎండుతున్న జలకళ
షూటింగ్... పార్టీయింగ్...
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
బిందువే సిరుల సింధువు
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement