సర్వశక్తులు ఒడ్డుతున్న నితీశ్ | Sakshi
Sakshi News home page

సర్వశక్తులు ఒడ్డుతున్న నితీశ్

Published Mon, Feb 9 2015 10:04 PM

సర్వశక్తులు ఒడ్డుతున్న నితీశ్ - Sakshi

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి మళ్లీ దక్కించుకునేందుకు జేడీ(యూ) నాయకుడు నితీశ్ కుమార్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇందులో భాగంగా తనకు మద్దతుగా నిలిచిన 130 ఎమ్మెల్యేలతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముందు పరేడ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం బుధవారం రాష్టప్రతిని కలవాలని సమయం కోరినట్టు జేడీ(యూ) ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి తెలిపారు.

సోమవారం 130 మంది ఎమ్మెల్యేలతో గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠిని కలిశారు. సీఎంగా తనకు అవకాశమిస్తే మెజారిటీ నిరూపించుకుంటానని గవర్నర్ ను కోరారు. మరోవైపు తనకు 56 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రస్తుత ముఖ్యమంత్రి జితన్ రాం మంఝి ప్రకటించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement