సాక్షి, హైదరాబాద్: ఎర్రచందనం అక్రమ రవాణాలో ప్రధాన నిందితుడిగా ఉన్న ‘అప్పు’ గత ఏడాది నకిలీ మద్యం కేసులో సీఐడీ పోలీసులకు చిక్కాడు. అతడే ఎర్రచందనం స్మగ్లింగ్లోనూ నిందితుడు అనే విషయం వారికి తెలియదు. తీరా అప్పు నకిలీ మద్యం కేసులో బెయిల్పై బయటపడేందుకు ప్రయత్నిస్తుండగా నిఘా విభాగం.. అతడు ‘ఎర్ర‘ కేసుల్లోనూ నిందితుడని తేల్చడంతో ఆ కేసుల్లోనూ అప్పును అరెస్టు చేశారు. లేదంటే అతడు జైలు నుంచి బయటకు వెళ్లి తన నేర చరిత్రను కొనసాగించే వాడే.
ఇలాంటి సమాచార మార్పిడి లోపాన్ని నివారించేందుకు దేశంలోని అన్ని పోలీసుస్టేషన్లు, ప్రత్యేక విభాగాలను అనుసంధానం చేస్తూ సీసీటీఎన్ఎస్ (క్రైం అండ్ క్రిమినల్ టెక్నాలజీ నెట్వర్క్ అండ్ సిస్టం)ను కేంద్రం 2011 లో ఏర్పాటు చేసింది. మొదటి దశలో భాగంగా హైదరాబాద్లోని మాదాపూర్ పోలీస్స్టేషన్ను ఎంపిక చేసింది. ఈ విధానాన్ని 2013 సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలోని అన్ని పోలీస్స్టేషన్లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా అన్ని స్టేషన్లకు కంప్యూటర్లు, ఇతర సామాగ్రిని అందజేశారు.
అయితే ప్రభుత్వాల అలసత్వంతో నేటికీ ఈ విధానం కార్యరూపం దాల్చలేదు. దీంతో సమాచార మార్పిడి వ్యవస్థ సరిగ్గా లేక పోలీసుల ముందే నేరస్తులు దర్జాగా తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో సీసీటీఎన్ఎస్ను వెంటనే అమలు చేసేందుకు స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేయడం కోసం బుధవారం (నేడు) అన్ని రాష్ట్రాల సీఎస్, డీజీలతో సమీక్ష నిర్వహించనున్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా డిజిటల్ టెక్నాలజీని వేగవంతమైన నేర పరిశోధనకు ఉపయోగించుకోవాలని ప్రధాని భావిస్తున్నారు.
సీసీటీఎన్ఎస్ పనితీరు ఇలా..
ఒక నేరం కింద పట్టుబడిన వ్యక్తికి సంబంధించి ప్రాథమిక సమాచారంతో పాటు వారి వేలిముద్రలు తదితర వాటిని పోలీసులు నమోదు చేస్తారు. వాటిని సీసీటీఎన్ఎస్కు అనుసంధానం చేస్తారు. దీంతో అతని సమాచారం దేశంలోని అన్ని పోలీసు స్టేషన్లకు చేరుతుంది. ఇక ఆ వ్యక్తి ఇతర ప్రాంతాల్లో మరో నేరం చేస్తూ పట్టుబడితే వేలిముద్రల ఆధారంగా అతడి గత చరిత్ర బయటపడుతుంది.
అడ్డంకిగా మారుతున్న నెట్వర్క్..
సీసీటీఎన్ఎస్ అమలుకు నెట్వర్కింగ్ అడ్డంకిగా మారుతోంది. ఇప్పటికీ కొన్ని పోలీస్స్టేషన్లలో ఇంటర్నెట్ సౌకర్యం లేదు. సిబ్బంది కూడా లేరు... ఉన్న చోట శిక్షణ ఇవ్వడం లేదు. వీటన్నింటిని అధిగమించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సీసీటీఎన్ఎస్ వ్యవస్థ అమలు ముందుకు సాగడం లేదు.
‘నెట్’వర్క్ లేదు..!
Published Wed, Aug 26 2015 3:57 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్ఐ హత్య
హీరోగా జబర్దస్త్ కమెడియన్.. ఆసక్తిగా ట్రైలర్!
‘రాహుల్ గాంధీపై పాక్ ప్రేమ ఆందోళన కలిగించింది’
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
కొత్త పగటివేషగాడు వచ్చాడు
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
మహిళల టీ20 వరల్డ్కప్ 2024: అక్టోబర్ 6న భారత్-పాక్ మ్యాచ్
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాస్వతంగా రద్దే!
తప్పక చదవండి
- కొత్త పగటివేషగాడు వచ్చాడు
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- రేటే 'బంగార'మాయెనే..!
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement