{పత్యేక హోదాపై చంద్రబాబు తీరును విమర్శించిన వాసిరెడ్డి పద్మ
ఆయన కేంద్రాన్ని నిలదీయలేరు.. వారంటే ఆయనకు భయం..
‘ఓటుకు కోట్లు’లో ఇరుక్కున్న బాబు ఢిల్లీముందు సాగిలపడ్డారు..
తన కేసులకోసం కక్కుర్తిపడి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారు
హైదరాబాద్: తాను చేస్తున్న కుంభకోణాలను కప్పిపుచ్చుకోవడంతోపాటు తనపై ఎలాంటి విచారణలు, కేసులు లేకుండా ఉండేందుకే సీఎం చంద్రబాబు ఏపీ ప్రత్యేకహోదా కోసం ఎన్డీయే ప్రభుత్వంపై గట్టిగా పోరాడలేకుండా ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజ మెత్తారు. పార్టీ కేంద్రకార్యాలయంలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ప్రత్యేకహోదాపై చంద్రబాబు కేంద్రాన్ని నిలదీయలేరని, ఆయనకు వారంటే భయమని అన్నారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో ఇరుక్కున్న చంద్రబాబు ఢిల్లీ ముందు సాగిలపడి తనపైకి రాకుండా చేసుకున్నారని, బ్రహ్మదేవుడు కూడా చంద్రబాబును కాపాడలేడనుకున్న పరిస్థితి నుంచి ఈరోజు ఆ కేసు చార్జిషీటులో చంద్రబాబు పేరు ఉంటుందో లేదో తెలియని దశలో ఉందని ఆమె చెప్పారు.
అవసరం లేకున్నా పోలవరాన్ని నీరుగార్చేలా పట్టిసీమ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి అందులో భారీగా చంద్రబాబు ముడుపులు తీసుకున్నారని పద్మ ఆరోపించారు. రాజధాని నిర్మాణం విషయంలో బరితెగించి అవినీతికి పాల్పడుతున్నారని, జపాన్, సింగపూర్ ప్రైవేటు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని వారినుంచి లబ్ధి పొందుతున్నారని ధ్వజమెత్తారు. వీటన్నింటిపైనా విచారణ జరిగితే చంద్రబాబు జైల్లో ఉండాల్సి వస్తుందని, అందుకనే కేంద్రంతో పోరాడాలంటే భయపడుతూ.. తన కేసులకోసం కక్కుర్తిపడి రాష్ట్రప్రజల ప్రయోజనాల్ని తాకట్టు పెట్టారని ఆమె దుయ్యబట్టారు. చంద్రబాబుకు తన ప్రయోజనాలే ముఖ్యమని, రాష్ట్రప్రజలు ఎటుపోయినా, విద్యార్థులు, నిరుద్యోగులు ఎటుపోయినా ఆయనకు పట్టదన్నారు. ప్రత్యేక హోదా వస్తేనే తమకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, మేలు జరుగుతుందని ఎదురుచూస్తున్న వారి ప్రయోజనాల్ని తాకట్టుపెట్టి ప్రత్యేకహోదాపై మాట్లాడ్డం లేదని ఆమె దుయ్యబట్టారు.
ప్రజల్ని ఎందుకుమభ్యపెడుతున్నారు?
ఏ రాష్ట్రానికీ ప్రత్యేకహోదా ఇచ్చే అవకాశమే లేదని ఓవైపు కేంద్ర మంత్రి పార్లమెంటు సాక్షిగా తెగేసి చెబుతూ ఉంటే.. మరోవైపు చంద్రబాబు ప్రత్యేకహోదా వస్తుందని ఇంకా ప్రజల్ని ఎందుకు మభ్యపెడుతున్నారని వాసిరెడ్డి పద్మ నిలదీశారు. ప్రత్యేకహోదా రాదనే విషయం చంద్రబాబుకు ముందే తెలుసని, వారి ఎంపీయే ఆ విషయం బయటకు చెప్పారని ఆమె గుర్తు చేశారు. కేంద్రమంత్రి చేసిన ప్రకటన ఏపీకి సంబంధించింది కాదంటున్న చంద్రబాబు.. తాను స్వయంగా ఢిల్లీకెళ్లి ఎన్డీయే పెద్దల్ని కలసి ఆ ప్రకటన ఏపీకి సంబంధించింది కానే కాదని ఎందుకు చెప్పించలేకపోతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు టర్కీకి వెళ్లేబదులు తన ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల్ని తీసుకెళ్లి ఢిల్లీ నడిబొడ్డున ప్రత్యేకహోదాపై ఎన్డీయే సర్కారును నిలదీయాలని పద్మ డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు మౌనం వహించినా తాము మాత్రం పోరాడుతామని ఆమె స్పష్టం చేశారు.
కుంభకోణాలవల్లే మాట్లాడ్డం లేదు
Published Mon, Aug 3 2015 1:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement