బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్.. సహచర బృందంతో రాష్ట్రపతి భవన్కు మార్చ్
న్యూఢిల్లీ: అసహనంపై నిరసనలకు, ‘అవార్డ్ వాపసీ’ కార్యక్రమానికి వ్యతిరేకంగా ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఆధ్వర్యంలో శనివారం పలువురు రచయితలు, సినీ కళాకారులు రాష్ట్రపతి భవన్కు ర్యాలీ నిర్వహించారు. దేశాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్రపూరిత ఉద్దేశంతోనే ప్రభుత్వ పురస్కారాలను వెనక్కిస్తున్నారని ఖేర్ ఆరోపించారు. భారతదేశం సహనశీల దేశమని, భారతీయులంతా లౌకికవాదులేనన్నారు. హత్యలను ఖండించాల్సిందేనని, అయితే, ఈ ఘటనలను చూపుతూ ప్రపంచం దృష్టిలో భారత్ పరువు తీస్తున్నారని విమర్శించారు. దేశంలో అసహనం పెరుగుతోందన్న ప్రచారం కొందరే చేస్తున్నారని ఆరోపించారు.
ఇప్పుడు అవార్డ్లు వెనక్కిస్తున్నవారంతా గతంలో ప్రధాని అభ్యర్థిగా మోదీని వ్యతిరేకించిన వారేనని ర్యాలీలో పాల్గొన్న దర్శకుడు జాతీయ పురస్కార గ్రహీత మాధుర్ భండార్కర్ అన్నారు. అవార్డ్లను వెనక్కివ్వడాన్ని పిల్ల చేష్టని డెరైక్టర్ ప్రియదర్శన్ అన్నారు. ర్యాలీ తర్వాత రాష్ట్రపతికి మెమొరాండం సమర్పించారు. దానిపై కమల్ హాసన్, శేఖర్ కపూర్, వివేక్ ఒబేరాయ్, విద్యాబాలన్ సహా 90 మంది సంతకాలు చేశారు. తర్వాత ఖేర్ బృందం ప్రధాని మోదీని కలిసింది.
అసహనాన్ని మించిన భారత సంస్కృతి: మోదీ
అసహనాన్ని మించిన సంస్కృతి భారత దేశానిదని.. దీనికి ప్రతిదాన్ని స్వీకరించటమే తప్ప తిరస్కరించటం తెలియదని ప్రధాని మోదీ తెలిపారు. అసహనంపై కాంగ్రెస్, లెఫ్ట్ మేధావుల నిరసనలకు వ్యతిరేకంగా ఖేర్ నాయకత్వంలో 51 మంది కళాకారులు మోదీని కలిశారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘కాంగ్రెస్ది రక్షణాత్మక ధోరణి’
‘అసహనం’పై ఆగ్రహ వ్యక్తీకరణలో మేధావులు కాంగ్రెస్నూ లక్ష్యంగా చేసుకున్నారు. మతవాదాన్ని సరిగ్గా ఎదుర్కోలేకపోతోందంటూ మండిపడ్డారు. అనాసక్త, పశ్చాత్తాపపూరిత లౌకిక విధానాన్ని పాటిస్తోందని, మతతత్వంపై రక్షణాత్మక ధోరణి అనుసరిస్తోందని విమర్శించారు. ఢిల్లీలో శనివారం జరిగిన ఒక చర్చాకార్యక్రమంలో పాల్గొన్న పలువురు విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు దేశంలో పెరుగుతున్న అసహన వాతావరణంపై ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలో ఎక్కడా అసహనం లేదు!
Published Sun, Nov 8 2015 1:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
Advertisement