విశాఖ మెడికల్: నర్సుల నియామకాలు, ఇతర డిమాండ్ల సాధన కోసం సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించనున్నట్టు ప్రభుత్వ నర్సుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి.భాగ్యలక్ష్మి తెలిపారు. విశాఖలో శనివారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 31 నుంచి రాష్ట్ర వ్యాప్తం గా అన్ని ఆస్పత్రుల్లో పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి ఆస్పత్రుల ఎదుట గంట పాటు నినాదాలతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ధర్నాలు చేపట్టి దశలువారీగా ఆందోళన ఉధృతం చేస్తామన్నారు.
2007 నుంచి ప్రభుత్వం పోస్టుల నియామకాలను నిలిపివేసిందని ఆరోపించా రు. ఇటీవల ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మంది నర్సు పోస్టుల భర్తీ చేపడతామని చెప్పినప్పటికీ ఇంతవరకూ ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదన్నారు. గుంటూరు జీజీహెచ్ ఆస్ప త్రి ఘటనకు సంబంధించి ఇద్దరు నర్సులను సేవా లోపం నెపంతో సస్పెండ్ చేయడాన్ని ఖండించారు.
రేపట్నుంచి నర్సుల రాష్ట్ర వ్యాప్త ఆందోళన
Published Sun, Aug 30 2015 9:49 AM
Related news
-
టీడీపీ హత్యా రాజకీయాలపై.. ఎగసిన నిరసన
సాక్షి, అమరావతి/నెట్వర్క్ : సీఎం వైఎస్ జగన్పై హత్యాయత్నానికి తెగబడటాన్ని నిరసిస్తూ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. స్కూలు పిల్లల నుంచి వృద్ధులు, అభిమానులు, మహిళలు, పార్టీ నేతలు పెద్దఎత్తున నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీలు నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్, జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ పోద్బలంతోనే ఈ హత్యాయత్నం జరిగిందని మండిపడ్డారు. ప్రజాక్షేత్రంలో జగన్ను ఎదుర్కోలేక.. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వస్తున్న ప్రజాస్పందనను చూసి ఓర్వలేక.. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించడం ఖాయమనే అక్కసుతోనే సీఎంపై హత్యాయత్నానికి పురిగొలిపారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అనేకచోట్ల చంద్రబాబు దిష్టిబొమ్మలను దగ్థం చేశారు. ఇందులో భాగంగా.. సీఎంపై హత్యాయత్నాన్ని ఖండిస్తూ ఆదివారం తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెంలో హోంమంత్రి తానేటి వనిత నేతృత్వంలో పార్టీ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రిని రాజకీయంగా ఎదుర్కోలేకే దాడిచేయడం బాధాకరమని మంత్రి అన్నారు. దండకున్న తీగ గుచ్చుకుని గాయమైనట్లు కొంతమంది వక్రీకరిస్తున్నారని.. తీగ గుచ్చుకుని గాయమైతే వెనుకనున్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్కు ఎలా గాయమైందని ప్రశ్నించారు. ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే కార్యాలయం వద్ద జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి, నాయకులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కుక్కునూరు మండలం కివ్వాక గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. భీమడోలు మండలం కోడేరుపాడు గ్రామంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం మర్రితిప్ప వద్ద చీఫ్ విప్, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కాకినాడ రూరల్ మండలంలో పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ప్రత్తిపాడులో ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, పెద్దాపురం నియోజకవర్గ అభ్యర్థి దవులూరి దొరబాబు సామర్లకోటలో, పి.గన్నవరంలో జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే అభ్యర్థి వేణుగోపాలరావు, జగ్గంపేట, తునిలో పార్టీ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. హత్యాయత్నానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. జగన్ను టచ్ చేశారు పుట్టగతులుండవు : మంత్రి ‘కొట్టు’ సీఎం జగన్ని దాడి ద్వారా టచ్ చేశారు, ఈ కుట్రకు పాల్పడిన వారికి పుట్టగతులుండవని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ హెచ్చరించారు. తాడేపల్లిగూడెంలో ఆయన నల్లరిబ్బన్లు ధరించి విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్ను ఎదుర్కోలేక పిరికిపంద చర్యలకు పాల్పతున్నారన్నారు. ఆయనకు వస్తున్న జనాదరణను తట్టుకోలేక ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇక సీఎంపై దాడి ముమ్మాటికీ చంద్రబాబు పనేనని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకులో ఆరోపించారు. పేదలకు సంక్షేమం, విద్య, వైద్యం ఉచితంగా అందిస్తున్నందుకు జగన్పై దాడులు చేయిస్తావా చంద్రబాబూ అని నిలదీశారు. వంగవీటి రంగాను అత్యంత కిరాతకంగా చంద్రబాబు అంతమొందించాడని, నేడు అదే కోవలో ప్రయత్నాలు చేస్తున్నాడని మండిపడ్డారు. విజయనగరంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జామి మండలంలోని పీతలపాలెంలో ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, పార్వతీపురం మన్యం జిల్లాలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్రాజు, ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, పాలకొండలో ఎమ్మెల్యే కళావతి నల్లబ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా నిరసన తెలిపారు. సీఎంపై జరిగిన దాడి అమానుషమని, ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు హేయమైనవని కోలగట్ల అన్నారు. సీఎం జగన్పై జరిగిన దాడికి నిరసనగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో స్పీకర్ తమ్మినేని సీతారాం, నరసన్నపేటలో ధర్మాన కృష్ణదాస్లు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సోంపేటలో జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, కొత్తూరులో ఎమ్మెల్యే రెడ్డిశాంతి నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. చంద్రబాబు కేడర్ను రెచ్చగొడుతున్నారు ఇక సీఎం జగన్పై దాడికి నిరసనగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్దఎత్తున నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. ఒంగోలులో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, మేయర్ గంగాడ సుజాత.. సింగరాయకొండలో మంత్రి ఆదిమూలపు సురేష్, చీమకుర్తిలో మంత్రి మేరుగ నాగార్జున, కంభంలో ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి, మార్కాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు, కనిగిరిలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. చంద్రబాబు పదేపదే తన కేడర్ను రెచ్చగొడుతున్నారని, ఇది హేయమైన చర్య అని బాలినేని, ఆదిమూలపు, మేరుగ నాగార్జున ఆరోపించారు. చీరాల, అద్దంకి, పర్చూరు, అధికార పార్టీ అభ్యర్థులు కరణం వెంకటేష్, పానెం హనిమిరెడ్డి, ఎడం బాలాజీ, వేమూరు అభ్యర్థి వరికూటి అశోక్బాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఎంపీ మోపిదేవి వెంకటరమణ, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, రేపల్లె అభ్యర్థి ఈవూరి గణేష్లు ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని ఖండించారు. ఉమ్మడి విశాఖలో ఆగ్రహ జ్వాలలు.. ఉమ్మడి విశాఖ జిల్లా మర్రిపాలెంలో వైఎస్సార్సీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి ఆడారి ఆనంద్కుమార్, ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఎండాడలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, మేయర్ గొలగాని హరివెంకట కుమారి, ఎమ్మెల్సీ రవీంద్రబాబు ఆధ్వర్యంలో మౌన దీక్ష నిర్వహించగా.. విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. గాజువాకలో మంత్రి అమర్నాథ్ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. చంద్రబాబు నీచరాజకీయాలు చెల్లవని.. ఇలాంటి దాడులను తాము సహించబోమన్నారు. అనకాపల్లి జిల్లా మునగపాకలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. పాయకరావుపేటలో ఎమ్మెల్యే అభ్యర్థి, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, పార్టీ శ్రేణులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల వ్యాప్తంగా.. జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే, విప్ సామినేని ఉదయభాను, తిరువూరులో ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాసు, మైలవరంలో ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు యాదవ్, విజయవాడ పశ్చిమంలో ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్, సెంట్రల్ నియోజకవర్గంలో డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, కార్పొరేటర్లు, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇక మచిలీపట్నం, అవనిగడ్డ, గన్నవరం, గుడివాడ, పామర్రు, పెడన, పెనమలూరు నియోజకవర్గాలోనూ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పెనమలూరు మండలం గంగూరులో మంత్రి జోగి రమేష్, పామర్రులో ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. గుంటూరులో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో.. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా, ఇక్కడి ప్రస్తుత అభ్యర్ధి షేక్ నూరిఫాతిమా ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. పొన్నూరులో ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ, గుంటూరులో ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, మచిలీపట్నం పోర్టు ట్రస్టు ఎండీ మేకతోటి దయాసాగర్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్కుమార్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇతర మండలాల్లోనూ నల్లబ్యాడ్జీలతో నిరసనలు చేశారు. అలాగే, సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు నాయకత్వంలో నల్లకండువాలు ధరించి ర్యాలీ నిర్వహించారు. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నరసరావుపేటలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అమరావతిలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు రాస్తారోకోలు, కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. రొంపిచర్ల, వినుకొండలోనూ ఆందోళనలు చేశారు. ఇది ముమ్మాటికీ కూటమి కుట్రే ఇదిలా ఉంటే.. సీఎంపై హత్యాయత్నం ముమ్మాటికీ ప్రతిపక్ష పార్టీల కుట్రేనని తుడా చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్రెడ్డి ఆరోపించారు. చంద్రగిరిలో ఆయన కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఇందులో పాల్గొన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి సతీమణి లక్ష్మి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి కూడా హాజరయ్యారు. అలాగే, హత్యాయత్నాన్ని ఖండిస్తూ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్, మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ ఆధ్వర్యంలో తిరుపతిలో నల్ల కండువాలు, నల్లబ్యాడ్జీలు ధరించి పెద్దఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. జగనన్నకు హాని జరిగితే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని వారన్నారు. ఇక అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో ప్రభుత్వవిప్ కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. సీఎంపై హత్యాయత్నం వెనుక కుట్రకోణం ఉందన్నారు. వైఎస్సార్ జిల్లా వేంపల్లెలో శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీ‹Ùకుమార్రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. మరోవైపు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు కూడా తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆదివారం రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, తాడిపత్రి, శింగనమల, గుంతకల్లు, అనంతపురం, రాప్తాడు నియోజకవర్గాల్లో భారీఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అలాగే శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి, ధర్మవరం, కదిరి, హిందూపురం, మడకశిర, పెనుకొండ నియోజకవర్గాల్లోనూ నిరసనలు జరిగాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి శాంతియుత ఆందోళనలు జరిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనూ జనాగ్రహం పెల్లుబికింది. ఆత్మకూరు పట్టణంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి ఆధ్వర్యంలో.. ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్రెడ్డి ఆధ్వర్యంలో నల్లరిబ్బన్లను ధరించి నిరసన వ్యక్తంచేశారు. నెల్లూరు నగరంలోనూ నిరసన ర్యాలీలను నిర్వహించారు. -
4 వేల నర్సుల పోస్టుల భర్తీ!
సాక్షి, హైదరాబాద్: నాలుగు వేల నర్సుల పోస్టులను భర్తీ చేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ సన్నాహాలు ప్రారంభించింది. వారం రోజుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. తెలంగాణ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు భర్తీ ఆధ్వర్యంలో పూర్తిగా రెగ్యులర్ విధానంలో భర్తీ చేయనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ప్రస్తుతం వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) పరిధిలో 4,400, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో 700, ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో దాదాపు 1,600 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు వీటిలో నాలుగు వేల పోస్టులకు పైనే భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా వైద్యారోగ్యశాఖ సిద్ధం చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలకు ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పచ్చజెండా ఊపారు. గతంలో 2017లో నర్సుల పోస్టుల భర్తీ జరిగింది. అప్పట్లో విడుదల చేసిన నోటిఫికేషన్లో వివిధ చిక్కులున్నాయని చాలా మంది గతంలో కోర్టులో కేసులు వేశారు. వైద్య,ఆరోగ్యశాఖకు కూడా చాలా ఫిర్యాదులు అందాయి. ఆ పోస్టులకు విపరీతమైన పోటీ ఇక నర్సింగ్కౌన్సిల్లెక్కల ప్రకారం 2014 నుంచి ఇప్పటివరకు సుమారు 60 వేల మందికి పైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. వీరిలో 25 శాతం మందికి పైగా ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ మిగతా వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. నర్సింగ్ కోర్సులు పూర్తి చేసినా, ఉద్యోగాలు లభించని పరిస్థితి నెలకొనడంతో కొందరు కోర్సుతో సంబంధంలేని ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు భర్తీ చేయబోయే నర్సుల పోస్టులకు భారీ పోటీ ఉంటుందని భావిస్తున్నారు. -
నర్సులకు నెలకు రూ.2.50 లక్షల జీతం!
సాక్షి, చెన్నై/తిరువొత్తియూర్: విదేశాలలో రూ.2.50 లక్షల వేతనంతో పనిచేసేందుకు అర్హులైన నర్సులు దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తమిళనాడు రాష్ట్ర విదేశీ ఉపాధి కల్పన సంస్థ డైరెక్టర్ మహేశ్వరన్ మంగళవారం ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంగ్లండ్లోని ఆస్పత్రులలో నెలకు రూ. 2 లక్షల మొదలుకొని రూ. 2 లక్షల 50 వేల వరకు జీతంతో డిప్లొమా, గ్రాడ్యుయేట్ అయిన మేల్ /ఫిమేల్ నర్సులు 500 మంది అవసరం ఉందన్నారు. అదే విధంగా.. పదవ తరగతి పరీక్ష పాస్ అయిన వారు 30 సంవత్సరాల వయస్సు నుంచి 43 వయస్సు వరకు ఉన్న వారు ఐసీసీ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన వారు కువైట్లో పనిచేసేందుకు నోటిఫికేషన్ వెలువడిందని పేర్కొన్నారు. అలాగే నెలకు రూ. 27 వేల నుంచి రూ.34 వేల వరకూ జీతంతో పనిచేయుటకు సౌదీ అరేబియాలోని హోటల్స్లో వంట మనిషి (పురుషులు) కావాల్సి ఉందన్నారు. ఇక కువైట్లో ఇంటి పనులు చేయుటకు 30 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న మహిళలు అవసరమని వీరికి నెలకు రూ.29,640 మొదలుకొని రూ. 32 వేల వరకు జీవం అందజేస్తారన్నారు. డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్, ఐటీఐ, ఫిట్టర్ పాసైన (22 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సువారు) క్యాస్టింగ్ / ఇన్స్పెక్షన్ /మెకానిక్ ఆపరేటర్లుగా పనిచేసేందుకు ఓమెన్ దేశంలో ఖాళీలు ఉన్నాయన్నారు. వారికి నెల రూ. 29 వేలు అందుతుందని తెలిపారు. జీతం కాకుండా విదేశాలలో పని చేసేవారి వారికి భోజనం, లాడ్జింగ్ అండ్ బోర్డింగ్, విమాన టికెట్లను ఆయా దేశ ఉపాధి సంస్థల వారు ప్రత్యేకంగా అందజేచేస్తారని వెల్లడించారు. ఆసక్తి ఉన్నవారు www.omcmanpower.com వెబ్సైట్లో తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలను విదేశీ ఉపాధికల్పన సంస్థలు 0 4 4 2 2 5 0 5 8 8 6 /22 502267 అనే ఈ నంబర్ల ద్వారా తెలుకోవచ్చన్నారు. కాగా ఈ విదేశీ ఉపాధి కల్పన సంస్థ ఇప్పటి వరకు 10,350 మందిని వేరువేరు దేశాలకు ఉద్యోగులకు పంపించినట్లు పేర్కొన్నారు. చదవండి: మైనర్ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్న యువతి! -
MK Stalin: స్టాలిన్ వరాల జల్లు.. వారికి గుడ్న్యూస్
సాక్షి ప్రతినిధి, చెన్నై: డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేలోపే ప్రభుత్వ పాలనలో మునిగిపోయారు. కరోనా పరిస్థితులను తెలుసుకుంటూ తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. మంగళవారం రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తమిళనాడు ప్రభుత్వాస్పత్రుల్లో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న నర్సులు తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కొంతకాలంగా కోరుతున్నారు. ఇదే డిమాండ్పై అనేకసార్లు ఆందోళనలు, ధర్నాలు చేపట్టారు. డీఎంకే అధికారంలోకి వస్తే కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న నర్సులను క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో స్టాలిన్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న దశలో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది సేవలు ఎంతో అవసరంగా మారిన విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రంజన్, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణన్ సోమవారం స్టాలిన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు పద్ధతిపై విధులు నిర్వర్తిస్తున్న 1,212 మంది నర్సుల ఉద్యోగాలను పర్మనెంట్ చేయనున్నట్లు స్టాలిన్ మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు విడుదల చేస్తామని.. అంకిత భావంతో కరోనా విధులు నిర్వహించాలని స్టాలిన్ నర్సులను కోరారు. జర్నలిస్టులు ఇక ఫ్రంట్లైన్ వారియర్లు తమిళనాడులో వివిధ మాధ్యమాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్స్గా పరిగణిస్తామని స్టాలిన్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న విలేకరుల సేవలను కొనియాడారు. జర్నలిస్టుల హక్కులను కాపాడుతూ తగిన రాయితీలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. చదవండి: MK Stalin: 7న స్టాలిన్ ప్రమాణం -
నల్ల రిబ్బన్లతో టీమిండియా..
అంటిగ్వా: వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు టీమిండియా ఆటగాళ్లు చేతికి నల్ల రిబ్బన్లు ధరించి మైదానంలోకి దిగారు. కేంద్ర మాజీ మంత్రి, మాజీ డీడీసీఏ అధ్యక్షుడు అరుణ్ జైట్లీ మరణానికి సంతాపంగా ఆటగాళ్లు చేతికి నల్ల రిబ్బన్లు ధరించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీ ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. కేంద్ర మంత్రిగా దేశానికి ఎనలేని సేవలు చేసిన జైట్లీకి క్రికెట్తోనూ మంచి అనుబంధం ఉంది. ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం(1999-2013) పని చేసిన జైట్లీ.. బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా కూడా తన సేవలందించారు. ఢిల్లీ క్రికెట్ అభివృద్ధికి కృషి చేశారు. ఆటగాళ్ల సమస్యలను, వారికి మౌలిక వసతులను కల్పించడంలో ప్రధాన పాత్ర పోషించారు. జైట్లీ డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఢిల్లీ ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, తదితరులు టీమిండియా తరుపున ఆడారు. ఇప్పటికే అరుణ్ జైట్లీ మృతి పట్ల తాజా, మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు.
Related News by category
-
నయన మనోహరం .. నృసింహ కల్యాణం
సింహాచలం: సింహగిరి కల్యాణ సిరిని సంతరించుకుంది. చైత్రశుద్ధ ఏకాదశి వేళ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవం శుక్రవారం రాత్రి నయనానందకరంగా జరిగింది. శ్రీ మహా విష్ణువు అవతారమైన వరాహ లక్ష్మీ నృసింహస్వామిని పెళ్లి కుమారుడిగా, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను పెళ్లి కుమార్తెలుగా దర్శించిన భక్తులు తన్మయులయ్యారు. కొట్నాల ఉత్సవంతో శ్రీకారం పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి కల్యాణోత్సవ ఘట్టాలను ఆలయ అర్చకులు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించారు. తొలుత ఆలయ నీలాద్రి గుమ్మం వద్ద అర్చకులు, ముత్తయిదువలు పసుపుకొమ్ములను దంచి కొట్నాల ఉత్సవాన్ని నిర్వహించారు. తదుపరి ముక్కోటి దేవతలకు కల్యాణోత్సవ ఆహ్వానాన్ని పలు కుతూ అలయ ధ్వజస్తంభం వద్ద అర్చకులు గరుడాళ్వార్ చిత్రపటాన్ని ఎగరవేసి ధ్వజారోహణ నిర్వహించారు. రసవత్తరంగా ఎదురు సన్నాహోత్సవం స్వామి వారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని బంగారురంగు పల్లకీలో.. శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ముత్యాల పల్లకీలో కొలువుదీర్చారు. ఈ పల్లకీలను సింహగిరి మాడవీధుల్లో చెరొకవైపు తీసుకెళ్లి పశ్చిమ మాడ వీధిలో జోడు భద్రాల వద్ద ఎదురెదురుగా ఏర్పాటు చేసిన వేదికలపై అధిష్టింపజేశారు. స్వామివారు, అమ్మవార్ల వైభవాన్ని, గొప్పతనాన్ని చాటిచెబుతూ జరిగిన ఎదురు సన్నాహోత్సవం ఆద్యంతం రసవత్తరంగా సాగింది. ఆలయ అర్చకులు పూలదండలతో నృత్యాలు చేస్తూ ఎదురు సన్నాహోత్సవాన్ని రక్తి కట్టించారు. వ్యాఖ్యాతలుగా రావులపాలే నికి చెందిన కందుకూరి రామకృష్ణ సూర్యనారాయణ, కందుకూరి సత్య సూర్యనారాయణమూర్తి వ్యవహరించారు. నేత్రపర్వం..రథోత్సవం సింహగిరి మాడ వీధుల్లో స్వామివారి రథోత్సవం నిర్వహించారు. రథంలో ఉన్న స్వామివారిని దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్గజపతిరాజు తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం జాలరి పెద్ద కదిరి లక్ష్మణరావు రథ సారథిగా నిలిచి రథ కదలికలను సూచిస్తుండగా, లక్ష్మీదేవి అమ్మవారి బంధువులుగా జాలర్లు రథం నడిపే బాధ్యతలు చేపట్టారు. అశేష భక్తజన సందోహం రథాన్ని తాళ్లతో లాగి పరవశించారు. విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి, నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్, దేవస్థానం ట్రస్ట్బోర్డు మాజీ సభ్యులు సభ్యులు గంట్ల శ్రీనుబాబు, వారణాసి దినేష్రాజ్ తదితరులు స్వామిని దర్శించుకున్నారు. కనులపండువగా కల్యాణోత్సవం సింహగిరిపై ఉన్న నృసింహ మండపంలో రాత్రి 10.30 గంటల నుంచి వార్షిక కల్యాణోత్సవం జరిపించారు. స్వామివారిని, అమ్మవార్లను నృసింహ మండపంలోకి తీసుకొచ్చి, భారీ ఎత్తున ఏర్పాటు చేసిన కల్యాణ వేదికపై కొలువుదీర్చి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తదుపరి భక్తులకు ముత్యాల తలంబ్రాలు, ప్రసాదం అందజేశారు. దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఇరగవరపు రమణాచార్యులు, పురోహిత అలంకారి కరి సీతారామాచార్యులు, అర్చకులు, వేదపండితులు కార్యక్రమాన్ని నిర్వహించారు. సింహాచలం దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. సీపీ రవిశంకర్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. డీసీపీ సత్తిబాబు, నార్త్ ఏసీపీ అన్నెపు నర్సింహమూర్తి బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు రథోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విజయనగరం జిల్లా గాజులరేగకు చెందిన దాసరి రాము ట్రూప్ పులివేషాలు, విజయనగరం జిల్లా వేపాడకు చెందిన సింహాద్రి అప్పన్న గరిడి నృత్యం, విశాఖలోని దువ్వాడకు చెందిన నూకాంబిక ట్రూప్ కోలాటం, వడ్లపూడికి చెందిన వెంకట పరమేశ్వరి అన్నమయ్య సంఘం మహిళల కోలాటం, కూర్మాన్నపాలేనికి చెందిన శ్రీ బాలాజీ త్రిశక్తి కోలాటం సంఘం మహిళలు చేసిన నృత్యం, మాధవధారకు చెందిన లలిత వైభవ కోలాటం, విజయనగరానికి చెందిన పులివేషాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కనువిందుగా ఎదురు సన్నాహోత్సవం వైభవంగా రథోత్సవం పరవశించిన భక్తజనం సింహగిరికి కల్యాణ సిరి కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులుమహిళల సాంస్కృతిక ప్రదర్శన -
రె‘బెల్స్’
● టీడీపీలో కొనసాగుతున్న సీట్ల ఫైట్ ● మాడుగుల అభ్యర్థిగా పైలా నామినేషన్ ● మాడుగుల అభ్యర్థిగా 22న నామినేషన్ వేస్తానని బండారు ప్రకటన ● పాడేరు నుంచి నామినేషన్ వేసిన కిల్లో రమేష్ నాయుడు ● టికెట్ మార్చి గిడ్డి ఈశ్వరికి ఇస్తారంటూ జోరందుకున్న ప్రచారం ● అరకులో చంద్రబాబుపై యుద్ధం ప్రకటించిన సివేరి అబ్రహం ● అదే బాటలో దొన్నుదొర.. నామినేషన్ వేసేందుకు సిద్ధం సాక్షి, విశాఖపట్నం: వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్గా మారిన టీడీపీ అధినేత చంద్రబాబు టికెట్ల కేటాయింపు విషయంలోనూ అదే పద్ధతి పాటిస్తున్నారు. తొలుత ప్రకటించిన అభ్యర్థులను మార్చుతారన్న సంకేతాలు రావడంతో ఆ పార్టీ నేతలు అధినేత తీరుపై మండిపడుతున్నారు. మరో వైపు నామినేషన్లు వేసిన తర్వాత కూడా అభ్యర్థులను మార్చుతారన్న సంకేతాలు రావడంతో భంగపడ్డ నాయకులు టీడీపీ రెబల్స్గా బరిలోకి దిగడానికి సిద్ధమయ్యారు. మాడుగుల, పాడేరు, అరకు.. ఇలా ప్రతిచోటా రెబెల్స్ మోగుతున్నాయి. దీంతో తిరుగుబావుటా ఎగరేసిన వారికి తాయిళాలు.. నామినేటెడ్ పదవులు ఇస్తామని జపిస్తున్నా.. చంద్రబాబు మాటలు నమ్మడం లేదు. అసలు ఎన్ని పదవులు ఉంటాయి.. ఒకే పదవి ఎంత మందికి ఇస్తారు.. అని భావించిన టికెట్ రాని టీడీపీ నేతలు రెబల్స్గా బరిలో దిగుతామని స్పష్టం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల టికెట్ ఆశించి భంగపడిన వారంతా లోలోపల రగిలిపోతున్నారు. బండారు ఇన్.. పైలా అవుట్ ! మాడుగుల టికెట్ పైలా ప్రసాద్కు కేటాయించారు. దీంతో ఆయన శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే భీ పారం ఇవ్వకముందే.. బండారు సత్యనారాయణమూర్తి తనకే టికెట్ ఇస్తారని నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో పైలాకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనే ప్రచారం సాగుతోంది. ఒకే వేళ తన సీటు మార్చితే లోకల్గా ఉన్న గవిరెడ్డి లేదా కుమార్కు ఇచ్చినా తాను సహకరిస్తాను తప్పా ఎక్కడి నుంచో వచ్చిన బండారుకు సహకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నామినేషన్ వేసి అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేశారు. తనను కాదని బండారుకి టికెట్ ఇస్తే.. ఆయన బండారం బయటపెట్టి.. ఎలా నెగ్గుతారో చూస్తానంటూ సవాల్ విసిరారు. అరకులో డబుల్ ధమాకా.. అరకు నియోజకవర్గంలో టీడీపీకి రెబల్ పోటు తప్పేలా లేదు. రాష్ట్రంలోనే మొట్టమొదటగా చంద్రబాబు ప్రకటించిన టికెట్ అరకులోయే. ఈ స్థానంలో టీడీపీ తరఫున దొన్నుదొర నిలబడుతున్నారంటూ ప్రజలందరి ముందు ప్రకటించారు. చివరికి ఆ టికెట్ను బీజేపీకి కేటాయించారు. దీంతో దొన్నుదొర చంద్రబాబుపై యుద్ధం ప్రకటించారు. ఇదే స్థానం కోసం ఆశలు పెట్టుకున్న అబ్రహంను కూడా చంద్రబాబు నడిరోడ్డుపై వదిలేశారు. దీంతో అబ్రహం, దొన్నుదొర ఇద్దరూ చంద్రబాబు తీరుపై రగిలిపోతున్నారు. కూటమి తరఫున బీజేపీ అభ్యర్థి పాంగి రాజారావు శుక్రవారం నామినేషన్ దాఖలు చేయగా.. ఇండిపెండెంట్ అభ్యర్థిగా అబ్రహం కూడా నామినేషన్ వేశారు. దొన్నుదొర కూడా 24న నామినేషన్ వేస్తానని ప్రకటించారు. అక్కడా తిరుగుబావుటా...! పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లోనూ అసమ్మతి రగులుతోంది. పాడేరు టికెట్ ఆశించి భంగపడిన గిడ్డి ఈశ్వరి రెబల్గా బరిలోకి దిగుతానంటూ హెచ్చరించారు. అయితే.. కిల్లు రమేష్ నాయుడుకు హ్యాండ్ ఇచ్చి.. గిడ్డి ఈశ్వరికి టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ బీ–ఫారం ఈశ్వరికి ఇస్తే.. తాను రెబల్గా పోటీ చేస్తానని కిల్లు హెచ్చరించారు. రంపచోడవరంలోనూ వంతల రాజేశ్వరి తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో నిలిచి.. గెలిచి.. చంద్రబాబు, లోకేష్కు తన సత్తా చూపిస్తానని సవాల్ విసురుతున్నారు. ఇలా.. ప్రతి చోటా టీడీపీకి రెబల్స్ ఉచ్చు బిగుసుకుంటోంది. తిరుగుబాటు చేస్తామన్న నాయకులందర్ని పిలిపించి అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తానంటూ చంద్రబాబు బుజ్జగిస్తున్నారు. బాబు హామీలను గమనించిన అసంతృప్త నేతలు అధికారంలోకి రాక ముందు హ్యాండి ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోరని మండిపడుతున్నారు. ఎన్నికల్లోనే తాడోపేడో తేల్చుకుంటామని స్పష్టం చేస్తున్నారు. -
ఎన్నికల నియమావళికి గంటా తూట్లు
మధురవాడ: భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల నియమావళికి తూ ట్లు పొడిచారు. జీవీఎంసీ 5వ వార్డు వైఎస్సార్ కాలనీ, గాయత్రీ మెడికల్ కళాశాల సమీపంలోని పవన్ మిత్ర అపార్ట్మెంట్ వద్ద రాత్రి 10 గంటల తర్వాత కూడా ఎన్నికలు ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్ కాలనీలో టీడీపీ నాయకులు రాత్రి 10 గంటలకు బాణసంచా కాల్చారు. తర్వాత రోడ్డు మధ్యలోనే ఫొటోలు దిగుతూ గంటా అభివాదం చేశారు. రాత్రి 10.15 గంటలకు పక్కనే ఉన్న పవన్ మిత్ర అపార్ట్మెంట్లోకి వెళ్లి ప్రచారం చేశారు. 10.25 గంటలకు వైఎస్సార్ కాలనీలో మహిళలతో ముచ్చటించి గ్రూప్ ఫొటో దిగారు. అర గంట పాటు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి గంటా ప్రచారం నిర్వహించినా అధికారులు, పోలీసులు ఇటువైపు కన్నెత్తి చూడలేదు. -
ఎన్నికల ఆర్థిక లావాదేవీలపై పటిష్ట నిఘా
మహరాణిపేట: ఎన్నికల సమయంలో అభ్యర్థులతోపాటు ఆర్థిక లావాదేవీలు, ఖర్చులు, ఇతర వ్యయాలపై పటిష్ట నిఘా ఉంచాలని జిల్లా అధికారులను రాష్ట్ర వ్యయ పరిశీలకులు నీనా నిగం ఆదేశించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాల్సి ఉందని స్పష్టం చేశారు. విశాఖ పార్లమెంట్ వ్యయ పరిశీలకులు రంగ రాజన్, భీమిలి, తూర్పు, దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు సౌమ్య పాండేజైన్, ఉత్తర, పశ్చిమ, గాజువాక, పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు అక్తా జైన్తో కలిసి శుక్రవారం జిల్లాలో నీనా నిగం పర్యటించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్థిక లావాదేవీలు, నగదు బట్వాడా, బహుమతులు, ఇతర వస్తువుల తరలింపు, మద్యం రవాణా తదితర అంశాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. అధికారులందరితో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కృషి చేయాలన్నారు. సమాచార లోపం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏమైనా సందేహాలుంటే రాష్ట్ర, జిల్లా స్థాయి ఎన్నికల అధికారులతో సంప్రదింపులు చేసి నివృత్తి చేసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : పార్టీలు గానీ, అభ్యర్థులు గానీ అనధికారికంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడానికి వీలులేదని, వారు చేసే ఆర్థిక లావాదేవీలపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని నీనా నిగం చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రత్యేక గ్రీవెన్స్ కమిటీ ద్వారా సాధారణ పౌరుల నుంచి జప్తు చేసిన నగదును ఆధారాలు పరిశీలించి త్వరితగతిన వెనక్కి ఇచ్చేయాలని సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, నగర పోలీస్ కమిషనర్ డా.ఎ.రవిశంకర్, ఎంసీసీ నోడల్ అధికారి, జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ, ఏడీసీ కె.ఎస్.విశ్వనాథన్, జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహన్కుమార్, ఇతర విభాగాల ఉన్నతాధికారులు ఆయా విభాగాల ఆధ్వర్యంలో చేపట్టిన చర్యల గురించి ఆమెకు వివరించారు. క్షేత్రస్థాయిలో చర్యలు, సేవలు కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ 11 చోట్ల చెక్ పోస్టులు పెట్టామని, ఇప్పటి వరకు వస్తు, ధన రూపంలో రూ.4.92 కోట్ల నగదును సీజ్ చేశామని తెలిపారు. మొత్తం 110 రకాల బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయని, నగదు తరలింపు, మద్యం రవాణాపై నిఘా ఉంచుతున్నాయని వివరించారు. 24/7 పనిచేసేలా కంట్రోల్ రూమ్ నుంచి సేవలందిస్తున్నామని పేర్కొన్నారు. 16 మంది నోడల్ అధికారులను నియమించామని, 502 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, 1,457 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ పెట్టేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. సీ–విజిల్ ద్వారా 388 వినతులు రాగా.. 285 వినతులను నిర్ణీత సమయంలో పరిష్కరించామని తెలిపారు. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన ఘటనల్లో 59 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయన్నారు. బాధ్యతగా ఎన్నికల విధులు జిల్లా అధికారులతో రాష్ట్ర వ్యయ పరిశీలకులు నీనా నిగం నియోజకవర్గాల వారీగా సమీక్షలు -
హత్యాయత్నం కేసులో ఐదేళ్ల జైలు
విశాఖ లీగల్ : వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తిని హత్య చేసేందుకు యత్నించిన నిందితునికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ నగరంలోని రెండో అదనపు జిల్లా న్యాయస్థానం న్యాయమూర్తి ఎం.వెంకటరమణ శుక్రవారం తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆ తీర్పులో పేర్కొన్నారు. ఇన్చార్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాండ్రేగుల జగదీశ్వరరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు డోలా సాయి (23) నగరంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొబ్బరితోట నివాసి. రౌడీ షీటర్గా స్థానికంగా పెత్తనం చెలాయించేవాడు. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న సాయి... ఆ బంధానికి సదరు మహిళ భర్త అడ్డం వస్తున్నాడని పలుమార్లు అతడిని హెచ్చరించాడు. అయినా మాట వినకపోవడంతో 2018 అక్టోబర్ 20న అతని మెడపై కత్తితో సాయి బలంగా గాయపరిచాడు. బాధితుని ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు డోలా సాయిపై కేసు నమోదు చేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో పైవిధంగా తీర్పు చెప్పారు.
Advertisement
Photos
View allVideo
View allTuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement