పండగలా జరిపిస్తాం | Sakshi
Sakshi News home page

పండగలా జరిపిస్తాం

Published Thu, Oct 1 2015 10:36 AM

పండగలా జరిపిస్తాం - Sakshi

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపన పండగలా జరిపిస్తామని ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. గురువారం విజయవాడలో విలేకర్ల సమావేశంలో ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీతోపాటు లక్ష మంది రాజధాని శంకుస్థాపనలో పాల్గొంటారని తెలిపారు.

రాజధాని నిర్మాణానికి భూమిలిస్తున్న రైతులకు ఇన్విటేషన్ ఇస్తామన్నారు. అంతేకుండా వారికి పట్టు వస్త్రాలు ఇచ్చి రాజధాని శంకుస్థాపనకు ఆహ్వానిస్తామని ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు.  
 

Advertisement
Advertisement