Sakshi News home page

వన్ ప్లస్ 2 మొబైల్ ధర రూ. 22,999

Published Tue, Jul 28 2015 11:20 AM

వన్ ప్లస్ 2 మొబైల్ ధర రూ. 22,999 - Sakshi

న్యూఢిల్లీ: కొన్ని నెలలుగా సాగుతున్న ఊహాగానాలకు తెర దించుతూ ఎట్టకేలకు వన్ ప్లస్ 2  సరికొత్త మొబైల్ ను చైనా మొబైల్ తయారీ సంస్థ మంగళవారం రిలీజ్ చేసింది. మార్కెట్లోకి రాబోతున్న ఈ సరికొత్త వన్ ప్లస్ 2 మొబైల్ ప్రారంభ ధర రూ. 22, 999 ఉంటుందని ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే ఈ మొబైల్ రెండు భిన్నమైన ఫీచర్లతో మార్కెట్లోలో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. 16జీబీ ఇంటర్నెనల్ మెమెరీ, 3జీబీ ర్యామ్ ఫీచర్లు కలిగిన మొబైల్ ధర రూ. 22,999 కాగా, 64జీబీ ఇంటర్నెనల్ మెమెరీ, 4జీబీ ర్యామ్ ఫీచర్లతో ధర రూ. 24,999గా మార్కెట్లో లభ్యమవునున్నట్టు పేర్కొంది.

మిగతా ఫీచర్లు 2కె క్వాడ్ హెచ్డీ డిసిప్లే, టైప్-సీ యూఎస్బీ,13 మెగా పిక్సల్ రియర్ కెమెరా, దాంతో పాటు 1.3 మైక్రోన్ ఇమేజ్ సెన్సర్, 3,300 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ఉంటాయి. తమ మొట్టమొదటి ప్రధాన హ్యాండ్సెట్ వన్ ప్లస్ వన్ ధర మీద నామమాత్రమేనని తెలిపింది. అయితే దీనికి సంబంధించి తొలి యూనిట్ భారత్ సహా ఇతర దేశాలలో ఆగస్టు 11 నుంచి మార్కెట్లలో అమ్ముడు కానున్నట్టు వెల్లడించింది.



Advertisement

What’s your opinion

Advertisement