ఓఎన్‌జీసీ చైర్మన్ వాసుదేవకు స్కోప్ అవార్డు | Sakshi
Sakshi News home page

ఓఎన్‌జీసీ చైర్మన్ వాసుదేవకు స్కోప్ అవార్డు

Published Fri, Dec 13 2013 3:49 AM

ఓఎన్‌జీసీ చైర్మన్ వాసుదేవకు స్కోప్ అవార్డు

 న్యూఢిల్లీ: ఓఎన్‌జీసీ చైర్మన్ సుధీర్ వాసుదేవకు స్కోప్ ఇండివిడ్యువల్ లీడర్షిప్ అవార్డు లభించింది. ప్రభుత్వరంగ సంస్థల పనితీరు ఆధారంగా స్కోప్ సంస్థ అవార్డులనందిస్తోంది. మహారత్న/నవరత్న పీఎస్‌యూల కేటగిరిలో వ్యక్తిగత నాయకత్వం కింద స్కోప్ ఎక్స్‌లెన్స్ అవార్డు సుధీర్ వాసుదేవకు లభించింది. మినీరత్న కేటగిరిలో ఈ అవార్డు ఇంజినీర్స్ ఇండియా హెడ్ ఏ.కె. పుర్వహ ఎంపికయ్యారు. లాభాలార్జిస్తున్న ఇతర పీఎస్‌యూల కేటగిరిలో ఈ అవార్డు జాతీయ బలహీనవర్గాల ఆర్థిక, అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ ఏ.ఏ. నఖ్వీకి లభించింది. పీఎస్‌యూల్లో అద్వితీయ ప్రతిభ కనబరిచిన మహిళా మేనేజర్ అవార్డ్ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో గ్రూప్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న నీరుకు లభించింది.  
 

Advertisement
Advertisement