భారత్‌లోకి ఓపో ఫ్లాగ్‌షిప్ మోడల్ ఎన్3 | Sakshi
Sakshi News home page

భారత్‌లోకి ఓపో ఫ్లాగ్‌షిప్ మోడల్ ఎన్3

Published Fri, Apr 10 2015 2:40 AM

భారత్‌లోకి ఓపో ఫ్లాగ్‌షిప్ మోడల్ ఎన్3

 న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ఓపో తాజాగా ఫ్లాగ్‌షిప్ మోడల్ ఎన్3ని భారత్‌లో విడుదల చేసింది. 5.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 2.3 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీ, ఆన్‌డ్రాయిడ్ కిట్‌క్యాట్, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లున్నాయి. 206 డిగ్రీల కోణంలో దానంతట అదే తిరిగే 16 మెగాపిక్సెల్ కెమెరా దీని ప్రత్యేకత. నాణ్యమైన చిత్రాలు తీసేందుకు వీలుగా 5 ఆప్టికల్ లెన్స్‌ను కెమెరాలో పొందుపరిచారు. ధర రూ.42,990. ఫోన్ కావాల్సిన వారు ముందుగా బుక్ చేసుకోవాల్సిందే.
 

Advertisement
Advertisement