సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించడానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న దీక్షకు తమ మద్దతు ఉంటుందని, ఈ అంశంపై కలిసి పోరాడేందుకు సిద్ధమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ ఏపీ, తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ పేర్కొన్నారు. ఆయన మంగళవారం ఏఐసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న పలు ప్రయోజనాలతోపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై స్పష్టంగా మద్దతు పలికింది. పార్లమెంట్లో అప్పటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీలను, పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీలను నెరవేర్చేలా చేస్తానని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు. ఇప్పుడు ఆ అంశాన్ని మరిచిపోతున్నారు.
ఆయన రాష్ట్ర ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారు. మాకు జగన్మోహన్రెడ్డితో విభేదాలు ఉన్నప్పటికీ.. ఆయన ప్రత్యేక హోదాపై చేసిన దీక్షకు మద్దతు ఇస్తున్నాం. ప్రాణాలను పణంగా పెట్టరాదని జగన్కు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని దిగ్విజయ్ విజ్ఞప్తి చేశారు. ప్రతి రాష్ట్రంలో ప్యాకేజీ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని, ప్రధానమంత్రి ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారని, చంద్రబాబు కూడా అలా చేయడంలో నిపుణుడని విమర్శించారు.
కేసీఆర్కు కుటుంబ సభ్యులే ముఖ్యం
తెలంగాణలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలపై దిగ్విజయ్సింగ్ స్పందించారు. ‘‘మేం ఈ అంశంపై పోరాడుతున్నాం. తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలకు మా విజ్ఞప్తి ఏంటంటే.. కేసీఆర్ కుటుంబ పాలన, నియంతృత్వ పాలనపై పోరాడాలి. కేసీఆర్కు ఆయన కుటుంబ సభ్యులే ముఖ్యం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఆయన నెరవేర్చలేదు. కేసీఆర్, చంద్రబాబు, నరేంద్రమోదీ.. ముగ్గురూ తప్పుడు హామీలు ఇవ్వడంలో, ప్రజలను పిచ్చోళ్లను చేయడంలో నిపుణులు’’ అని మండిపడ్డారు.
జగన్ దీక్షకు మా మద్దతు: దిగ్విజయ్
Published Wed, Oct 14 2015 12:29 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
Advertisement