డెహ్రాడూన్: దేశంలో విద్యాహక్కు లాంటి చట్టాలు అమలవుతున్నా.. విద్యా ప్రమాణాలు మాత్రం పెరగడం లేదు. ఒకే టీచర్ తో నడుస్తున్న పాఠశాలలు దేశంలో ఒక లక్షకు పైగా ఉన్నట్లు సోమవారం పార్లమెంటు సమావేశాల్లో బయటపడింది. 1,05,630 ప్రభుత్వ ప్రాథమిక, సెకండరీ పాఠశాలలు ఈ దుస్థితిలో మగ్గుతున్నాయని తెలిసింది.
అత్యధికంగా మధ్యప్రదేశ్ లో 17,874 స్కూళ్లు, ఉత్తరప్రదేశ్ లో 17,602 పాఠశాలలు ఒక టీచర్ తో నడుస్తున్నాయి. ఈ పాఠశాలలో ఒక టీచరే అన్ని తరగతుల వారికి పాఠాలు చెబుతున్నారు. మానవ వనరుల శాఖ ఉపమంత్రి ఉపేంద్ర కుష్వాహ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ 13,575, ఆంధ్రప్రదేశ్ 9,540, జార్ఖండ్ 7,391లు వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో 13 పాఠశాలలు ఒక టీచర్ తో నడుస్తుండగా.. బీహార్ లో 3,708 స్కూళ్లు ఒక టీచర్ తో నడుస్తున్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి. ఢిల్లీ మినహాయించి కేంద్ర పాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్ ద్వీపంలో 16, త్రిపురలో 45, దాద్రా అండ్ నగర్ హవేలీలో 49, మిజోరాంలో 73 ఉన్నాయి.
హిమాలయన్ రాష్ట్రాలైన ఉత్తరాఖండ్ లో 1,771, హిమాచల్ ప్రదేశ్ లో 1,119, జమ్మూ అండ్ కశ్మీర్ లో 1,430, పంజాబ్ లో 1,360 పాఠశాలలు ఒక టీచర్ తో నడుస్తున్నాయి. అయితే సింగిల్ టీచర్ తో నడుస్తున్న పాఠశాలలకు సంబంధించి ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్ఫత్తి వివరాలు అందుబాటులో లేవు.
లక్షకు పైగా స్కూళ్లలో ఒకే టీచర్!
Published Tue, Aug 9 2016 8:52 AM
# Tag
Related news
-
ఒక్కరితో కష్టమే..!
సాక్షి, చీపురుపల్లి రూరల్: జిల్లాలోని పలు ఏకోపాధ్యాయ పాఠశాలల్లో బోధన సమస్యగా మారింది. అత్యవసర వేళ ఉపాధ్యాయుడు సెలవు పెట్టినా... కాస్త ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు చదువుకు దూరంకావాల్సిన పరిస్థితి. జిల్లాలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు 378, ప్రాథమికోన్నత పాఠశాలలు 213, ప్రాథమిక పాఠశాలలు 2,160 ఉన్నాయి. వీటిలో సుమారు 275 పాఠశాలలు ఒకే ఉపాధ్యాయుడితో నడుస్తున్నాయి. వీటిలో బోధన సమస్యలు షరామామూలయ్యాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఒక్క చీపురుపల్లి మండలంలోనే 12 పాఠశాలలు, నియోజకవర్గంలో 25 పాఠశాలలు ఏకోపాధ్యాయుడితోనే నడుస్తుండడం గమనార్హం. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో విద్యార్థుల బోధనకు, ఉపాధ్యాయుడికి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గతంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అకడమిక్ ఇన్స్ట్రక్టర్ను నియమించారు. ఏకోపాధ్యాయుడికి సహాయంగా ఈ బోధకులతో బోధన అందించి విద్యార్థులకు న్యాయం చేసేవారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ అకడమిక్ ఇన్స్ట్రక్టర్ నియామకాలను నిలిపివేసింది. దీంతో ఏకోపాధ్యాయ పాఠశాలల్లో కష్టాలు మొదలయ్యాయి. విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్నామ్నాయ చర్యలు తీసుకోకపోతే కొన్ని సమయాల్లో విద్యార్థులు విద్యా భోదనకు దూరమవ్వాల్సిన పరిస్థితి వస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇవీ సమస్యలు.. ఒకటి నుంచి ఐదు తరగతులకు కలిపి 18 సబ్జెక్టులు ఉంటాయి. ఈ సబ్జెక్టులను ఒక ఉపాధ్యాయుడే బోధన చేస్తూ మిగతా పనులను కూడా చూసుకోవాల్సి ఉంది. ఉపాధ్యాయుడికి నెలకోమారు సమావేశం ఉంటుంది. వృత్యంతర శిక్షణకు హాజరుకావాలి. ఈ లెక్కన ఏడాదికి 11 సమావేశాలు ఉంటాయి. దీంతో పాటుగా స్కూల్ కాంప్లెక్సు సమావేశాలు ఉంటాయి. ఈ సమావేశాలుకు ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరుకావాలి. ఆడిట్ వర్కులు, ఆన్లైన్ సేవలు సమయాల్లో సెలవులు తీసుకోవాలి. వీటితో పాటుగా ఉపాధ్యాయుడి అవసరాల నిమిత్తం తమ సెలవులను తీసుకుంటారు. ఇలాంటి సమయాల్లో ఏకోపాధ్యా పాఠశాలలు మూసే యాల్సి పరిస్థితి ఉండడమో.. లేదంటే సమీప దూరంలో ఉన్న వేరే పాఠశాల ఉపాధ్యాయుడిని మండల విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు వేరొకరిని వేయడమో చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏకోపాధ్యాయ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎంత వరకు అందుతుందన్నది ప్రశ్న. ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన విద్యకు విద్యార్థులు దూరమయ్యే పరిస్థితి ఎదురవుతుంది. విద్యార్థుల చదువులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రత్నామ్నాయ చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని జిల్లా విద్యాశాఖ అ ధికారుల వద్ద ప్రస్తావించగా... ఏకోపాధ్యాయ పాఠశాలల్లో అప్పుడప్పుడు సమస్యలు తలెత్తుతున్న మాట వాస్తవమేనని, అయితే... అత్యవసరంగా ఉపాధ్యాయుడు సెలవుపెట్టినప్పుడు సమీప పాఠశాల నుంచి వేరొక్క ఉపాధ్యాయుడుని సర్దుబాటు చేస్తున్నామన్నారు. విద్యాబోధనకు ఆటంకం లేకుండా చూస్తున్నామన్నారు. -
నీరుగారుతోన్న ఆర్టీఈ లక్ష్యం
జైపూర్: పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా హక్కు చట్టం(ఆర్టీఈ) లక్ష్యం మధ్యలోనే నీరుగారిపోతోంది. 6 నుంచి 14 సంవత్సరాల్లోపు పిల్లలందరూ తప్పనిసరిగా చదువుకోవాలన్న సమున్నత లక్ష్యంతో కేంద్రం ఈ చట్టాన్ని 2010, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ప్రాథమిక విద్య పూర్తయేంతవరకు పిల్లలకు ఉచితంగా, నిర్బంధ విద్యను అందించాల్సి ఉంటుంది. పిల్లలు తమకు సమీపంలోని పాఠశాలలో ఉచితంగా ప్రాథమిక విద్యను పూర్తి చేసేందుకు విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 3 అవకాశం కల్పిస్తోంది. ఆర్టీఈ కింద పాఠశాలన్నీ 25శాతం సీట్లను కేటాయించాల్సి ఉంటుంది. ఈ చట్టం ప్రకారం ప్రముఖ పాఠశాలల్లో ప్రాథమిక విద్యను అభ్యసించిన విద్యార్థులు తర్వాత బడి మానేసి దినసరి కూలీలుగా మారిపోతున్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల కారణంగా ఆర్టీఈ విద్యార్థులు విద్య కొనసాగించలేకపోతున్నారు. ఆర్టీఈ కింద 8వ తరగతి వరకు మాత్రమే ఉచితంగా అందిస్తున్నారు. అక్కడి నుంచి ఫీజులు చెల్లించి చదువు కొనసాగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత చదివించే స్తోమతలేక తల్లిదండ్రులు పిల్లలను చదువు మాన్పించేసి, తమతో పాటు పనులకు తీసుకెళ్లిపోతున్నారు. ‘ఆర్టీఈ కోటాలో చేరిన విద్యార్థుల్లో కొంత మంది చాలా తెలివైనవారు ఉంటున్నారు. పేద విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించలేక మధ్యలోనే చదువు ఆపేస్తుండటం బాధ కలిగిస్తోంది. వీరిలో డ్రైవర్లు, దినసరి కూలీల పిల్లలు ఎక్కువగా ఉంటున్నారు. 8వ తరగతి పూర్తి చేసిన తర్వాత తమ తల్లిదండ్రులతో కలిసి పనులకు వెళ్తుఉన్నారు. ప్రాథమిక విద్య పూర్తి చేసిన తర్వాత వీరిని పాలకులు పట్టించుకోకపోవడం విచారకరమ’ని జైపూర్లోని ప్రముఖ పాఠశాల ప్రిన్సిపాల్ ఒకరు వ్యాఖ్యానించారు. ఆర్టీఈ కోటాను 8 నుంచి 12వ తరగతి వరకు పొడించాలని కేంద్రానికి లేఖ రాయనున్నట్టు రాజస్తాన్ విద్యా శాఖ మంత్రి గోవింద్ సింగ్ తెలిపారు. దీనికి అనుగుణంగా జాతీయ విద్యా విధానాన్ని మార్చాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. -
‘విద్యాహక్కు’కు గండి
విద్యారంగానికి అవసరమైన నిధులిచ్చి దాని ఎదుగుదలకు దోహదపడటం చేతగాని ప్రభుత్వాలు ప్రమాణాలు పడిపోవడానికి విద్యార్థుల్ని బాధ్యుల్ని చేయడంలో మాత్రం ఉత్సాహం చూపుతు న్నాయి. లోక్సభ గతవారం ఆమోదించిన విద్యా హక్కు చట్టం (రెండో సవరణ) బిల్లు గమనిస్తే ఆ సంగతి అర్ధమవుతుంది. ఈ సవరణ ప్రకారం పిల్లలు ఇకపై ప్రతి తరగతిలోనూ నిర్దేశించిన మార్కులు పొందితేనే వారిని పై తరగతులకు పంపుతారు. ఫెయిలైన విద్యార్థులకు ఫలితాలు వెలువడిన రెండు నెలల్లో మరోసారి పరీక్ష నిర్వహిస్తారు. అందులోనూ ఉత్తీర్ణులు కాలేని విద్యా ర్థులను ఆ తరగతిలోనే ఉంచేస్తారు. ఒకపక్క బడి ఈడు పిల్లలందరికీ నిర్బంధ, ఉచిత విద్య అంది స్తామని ఎనిమిదేళ్ల క్రితం విద్యాహక్కు చట్టం అమల్లోకి తెచ్చారు. విద్యార్థులు ఎలా చదివినా వారిని ఎనిమిదో తరగతి వరకూ ఫెయిల్ చేయకూడదని ఈ చట్టం చెబుతోంది. 14 ఏళ్ల లోపు పిల్లలకు తప్పనిసరి విద్య అమలు కావాలన్నదే ఈ నిబంధన ముఖ్యోద్దేశం. ఇది కేవలం మన దేశంలో మాత్రమే అమలవుతున్న విధానం కాదు. బ్రిటన్లాంటి అభివృద్ధి చెందిన దేశం కూడా దీన్నే అనుసరిస్తోంది. అయితే అక్కడ చదువులో మెరుగ్గా లేని విద్యార్థుల్ని గుర్తించి, అందుకు గల కార ణాలను ఆరా తీసి వారిని మెరుగుపరుస్తారు. మన పాలకులకు అలాంటి అంశాలు పట్టవు. ఫెయి లయ్యే పిల్లల్ని చదువుకు దూరం చేయటమే సమస్యకు పరిష్కారమనుకుంటున్నారు. విద్యాహక్కు చట్టం అమలు ఒక పెద్ద ప్రహసనం. ఇప్పటికీ ప్రాథమిక విద్యా రంగ సంస్థలు సౌకర్యాల లేమితో అల్లాడుతున్నాయి. మొండి గోడలు, చెట్లకింది చదువులు, పిల్లలకు సకాలంలో పుస్తకాలు అందించలేకపోవటం, అవసరమైన సంఖ్యలో ఉపాధ్యాయుల్ని నియమించలేకపోవటం ఇంకా కొట్టొచ్చినట్టు కనబడుతూనే ఉన్నాయి. వీటి సంగతలా ఉంచి బాలబాలికలకు కనీసం మరు గుదొడ్డు నిర్మించాలని, వారికి మంచినీటి సదుపాయం కల్పించాలని కూడా ప్రభుత్వాలకు తోచటం లేదు. దేశంలో పట్టుమని 10 శాతం పాఠశాలలు కూడా చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా లేవు. తమ దగ్గర ఇన్ని లోపాలు పెట్టుకుని పిల్లలు మాత్రం మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాల్సిందేనను కోవటం దుర్మార్గం. నిజానికి ఆరేళ్లక్రితం యూపీఏ సర్కారు హయాంలోనే ఈ సవరణ బిల్లుకు బీజాలు పడ్డాయి. చాలామంది విద్యార్థులు తొమ్మిదో తరగతిలో ఫెయిలవుతున్న తీరు గమనించి 2012లో కేంద్ర విద్యా విషయాల సలహా బోర్డు(సీఏబీఈ) అప్పటి హర్యానా విద్యామంత్రి గీతా భుక్కాల్ నేతృత్వంలో ఒక సబ్ కమిటీని నియమించింది. ఆ కమిటీ కొండను తవ్వి ఎలుకను పట్టి నట్టు ఎనిమిదో తరగతి వరకూ అమల్లో ఉండే ‘నో డిటెన్షన్’ విధానం వల్లే ఈ సమస్యంతా వచ్చిం దంటూ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను సీఏబీఈ ఏకగ్రీవంగా ఆమోదించింది. చివరకు ‘నో డిటె న్షన్’కు వీలు కల్పిస్తున్న విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 16ను సవరించాలని నిరుడు ఆగస్టులో కేంద్ర కేబినెట్ తీర్మానించింది. 24 రాష్ట్రాలు ఈ ప్రతిపాదనకు అనుకూలంగా ఉన్నాయని, కేవలం ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మాత్రమే ఇప్పుడున్న విధానం కొనసాగాలంటున్నాయని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవ్డేకర్ ఇటీవల చెప్పారు. రెండింటిలో ఏదో ఒక విధానాన్ని ఎంచుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు విడిచిపెట్టామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇది అమ లవుతుందని కూడా ఆయన చెబుతున్నారు. ఫెయిలవుతామన్న భయం లేకపోవటం వల్ల విద్యార్థుల్లో అలసత్వం ఏర్పడుతున్నదని, బాగా చదివే పిల్లలూ, చదవని పిల్లలూ కూడా పైతరగతులకు వస్తుండటం వల్ల ఉపాధ్యాయులకు బోధన కష్టమవుతున్నదని ‘నో డిటెన్షన్’ నిబంధన రద్దును సమర్థించేవారి వాదన. చదువులో వెనకబడిన వారి కోసం బోధించాలో, చురుగ్గా అందుకోగలిగినవారికోసం బోధించాలో తెలియని స్థితి ఏర్పడుతు న్నదని ఉపాధ్యాయుల నుంచి ఫిర్యాదు వస్తున్నదట. తగినంతమంది ఉపాధ్యాయులను నియమించి చదువులో వెనకబడినవారి మెరుగుదలకు శ్రద్ధ పెడితే ఈ సమస్యను అవలీలగా అధిగమించవచ్చు. తరగతి గదిలో పరిమిత సంఖ్యలో విద్యార్థులుంటే ఎవరు మందకొడిగా ఉంటున్నారో, ఎవరు సరిగా అవగాహన చేసుకోలేకపోతున్నారో ఉపాధ్యాయులకు అంచనా ఉంటుంది. సమస్యను సరిదిద్దేందుకు వారికి వీలుంటుంది. అనవసర ఆర్భాటాల కోసం, హంగామా కోసం కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగపరుస్తున్న ప్రభుత్వాలకు ఉపాధ్యాయులను నియమించటం వృథా ఖర్చుగా అనిపిస్తోంది. ఏళ్ల తరబడి వేలాది టీచర్ పోస్టులు ఖాళీగా పడి ఉంటున్నా, చదువు చెప్పేవారు లేక విద్యార్థులు సమస్య ఎదుర్కొంటున్నా పట్టనట్టుండే పాలకులు ఎన్నికలొచ్చేముందు టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించటం రివాజుగా మారింది. ఇలా సమస్య మూలాలు తమ దగ్గర పెట్టు కుని, నెపం విద్యార్థులపైకి నెట్టి వారిని మరింత అధోగతిపాలు చేయటం క్షమించరాని నేరం. విద్యాహక్కు చట్టం తీసుకొచ్చిన ఉద్దేశాన్ని ప్రభుత్వాలు మరిచాయి. 2016–17 ఎకనామిక్ సర్వే లోని గణాంకాలు గమనిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని తెలుస్తుంది. 2013–14లో మొత్తం బడ్జెట్లో విద్యారంగానికి 4.57 శాతం కేటాయించిన కేంద్రం 2017–18కి వచ్చేసరికి దాన్ని 3.71 శాతానికి దిగజార్చింది. రాష్ట్రాల తీరుతెన్నులూ ఇలాగే ఉంటు న్నాయి. గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 2 లక్షల పాఠశాలలు మూతబడ్డాయి. ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, రాజస్తాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్లలో పలు పాఠ శాలలు విలీనం పేరుతో మూతబడ్డాయి. వీటిల్లో చాలాభాగం ఆదివాసీ ప్రాంతాల్లోనివి. బడిఈడు పిల్లలు తప్పనిసరిగా తరగతి గదిలో ఉండాలన్న సంకల్పానికి ఇలాంటి చర్యలు గండికొడుతున్నాయి. అట్టడుగు వర్గాల పిల్లలకు తీరని అన్యాయం చేసే విద్యాహక్కు చట్టం సవరణ బిల్లు కనీసం రాజ్య సభలో ప్రవేశించినప్పుడైనా అర్ధవంతమైన చర్చ జరిగి ప్రతిపాదన వీగుతుందని ఆశించాలి. -
ఆరేళ్ల పిల్లాడికి కరాటే, యోగా ఫీజు..!
తిరుపూర్/తిరువనంతపురం : ఒకటో తరగతి విద్యార్థికి కరాటే, యోగ ఫీజు కింద 20 వేల రూపాయలు చెల్లించాలని చెప్పడంతో ఆ పిల్లాడి తండ్రి షాక్ గురయ్యాడు. ఆరేళ్ల పిల్లాడికి యోగా, కరాటే ఎందుకని ప్రశ్నించడంతో స్కూలు యాజమాన్యం వారిని గేటు బయటే నిల్చోబెట్టింది. అయినా, ప్రభుత్వ సహకారంతో విద్యనభ్యసిస్తున్న తన కొడుక్కి ఫీజు ఎలా వసూలు చేస్తారని ఆ తండ్రి మంగళవారం ఉదయం నుంచి గేటు బయటే నిరసన వ్యక్తం చేస్తున్నాడు. వివరాలు.. ‘విద్యా హక్కు చట్టం - 2009’ (ఆర్టీఈ) ప్రకారం అన్ని ప్రైవేటు, అన్-ఎయిడెడ్ పాఠశాలల్లో పేద విద్యార్థుల కోసం 25 శాతం సీట్లు కేటాయించాలి. తిరుపూర్లోని కొంగు వెల్లలార్ ప్రైవేటు పాఠశాలలో గాంధీజీ అనే విద్యార్థి ఆర్టీఈ కోటాలో ఒకటో తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలాగానే తన కొడుకు గాంధీజీని స్కూల్లో దింపడానికి వచ్చిన పళనికుమార్కు మంగళవారం చేదు అనుభవం ఎదురైంది. ‘ఎక్స్ట్రా కరిక్యులర్’ ఫీజుల కింద 20 వేల రూపాయలు చెల్లించాలని అతన్ని స్కూలు యాజమాన్యం డిమాండ్ చేసింది. ఆర్టీఈ కోటాలో చదువుకుంటున్న తన కొడుకుపై ఈ ఫీజుల భారమేంటో పళని కుమార్కు అర్థం కాలేదు. కరాటే, యోగా, లైబ్రరీ, తమిళ్, ఇంగ్లిష్ హ్యాండ్ రైటింగ్, టేబుల్ టెన్నిస్ అంటూ చాంతాడంతా ఫీజుల చిట్టాను పాఠశాల సిబ్బంది అతని చేతిలో పెట్టారు. గాంధీజీతో పాటు ఆర్టీఈ కోటాలో విద్యనభ్యసిస్తున్న మరో ఇద్దరు విద్యార్థులకు ఇదే పరిస్థితి ఎదురైంది. పళనికుమార్ ఆందోళనకు ఆ విద్యార్థుల తండ్రి సెల్వం కూడా తోడయ్యారు. చేతిలో ప్లకార్డులతో వారంతా నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న తిరుపూర్ తహసీల్దార్ స్పందించారు. స్కూలు యాజమాన్యంతో చర్చలు జరిపారు. ప్రభుత్వం కేవలం ట్యూషన్ ఫీజులు మాత్రమే చెల్లిస్తుందనీ, ఎక్స్ట్రా కరిక్యులర్ ఫీజు చెల్లింపు తప్పనిసరని తేల్చారు. అరవై రోజుల గడువుతో ఫీజు చెల్లించాలనే షరతుతో విద్యార్థులను తరగతులకు అనుమతించారు. అయితే, తహసీల్దార్ స్కూలు యాజమాన్యంతో కుమ్మక్కయ్యారనీ, అందుకే ఫీజు చెల్లించమంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇంకా ఎందరో ఆర్టీఈ కోటాలో చదువుకుంటున్న విద్యార్థులు ఎక్స్ట్రా ఫీజులతో సతమతమవుతున్నారనీ, విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు. -
ఆర్టీఈని ఎందుకు నీరుగారుస్తున్నారు?
సాక్షి, హైదరాబాద్ : ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 25% సీట్లను అర్హులైన పేద విద్యార్థులకు కేటాయించాలని విద్యా హక్కు చట్టం(ఆర్టీఈ) నిబంధనలను ఎందుకు అమలు చేయట్లేదని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను హైకోర్టు ప్రశ్నించింది. పేద విద్యార్థులకు ఉపయోగపడాలనే చట్ట సంకల్పాన్ని ఎందుకు నీరుగారుస్తున్నారని ప్రశ్నించింది. ఈ చట్టాన్ని తెలుగు రాష్ట్రాలు సక్రమంగా అమలు చేయట్లేదంటూ వనపర్తి జిల్లా ఆత్మకూరు గ్రామానికి చెందిన వై.తిప్పారెడ్డి రాసిన లేఖను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) పరిగణించి అప్పటికే తాండవ యోగేశ్ అనే లా విద్యార్థి దాఖలు చేసిన పిల్తో జత చేసి మంగళవారం విచారించింది. ఆర్టీఈ చట్టం 2007లో వస్తే నేటికీ సక్రమంగా ఎందుకు అమలు చేయలేకపోతున్నారని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం మండిపడింది. ఏపీకి చెందిన ఒక మంత్రికే ప్రైవేటు విద్యా సంస్థలున్నాయని, ఆర్టీఈ చట్టానికి అనుగుణంగా జారీ అయిన జీవోలపై కోర్టులు స్టేలు ఇస్తే వాటిని ప్రభుత్వాలు రద్దు చేసేందుకు ప్రయత్నించట్లేదని పిటిషనర్ యోగేశ్ వాదించారు. పలు రాష్ట్రాల్లో ఆర్టీఈ చట్టం బాగా అమలు జరుగుతోందని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు–వసూలు చేస్తున్న ఫీజులు, సిబ్బంది–వారి విద్యార్హతలు, 25% సీట్ల వివరాలు, ఇతర సమాచారం విద్యాధికారి దగ్గర ఉండాలని, ఇవన్నీ వెబ్సైట్లో పొందుపర్చకుండా నిబంధనల్ని కాలరాస్తున్నారని చెప్పారు. ప్రైవేటు పాఠశాల్లో చదివే విద్యకు ఫీజుల్ని రీయింబర్స్మెంట్ చేస్తే.. సర్కారీ బడులు మూతపడే ప్రమాదం ఉందని ఏపీ ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఆర్టీఈ చట్టం ఏమేరకు అమలు చేశారో వివరణ ఇవ్వాలని రెండు రాష్ట్రాల్ని ఆదేశించింది. కేంద్ర మానవ వనరుల శాఖ కార్యదర్శి, ఇరు రాష్ట్రాల పాఠశాల విద్యా శాఖ ముఖ్యకార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. విచారణ 3 వారాలకు వాయిదా వేసింది.
Related News by category
-
అభివృద్ధి చెందే రంగాలు ఇవే.. నిర్మలా సీతారామన్
ఢిల్లీ: 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే.. వికసిత భారత్ సాధ్యమవుతుందని, ఇండియా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రధాని 'నరేంద్ర మోదీ' గతంలో చాలా సార్లు చెబుతూనే వచ్చారు. ఈ విషయం మీద కాంగ్రెస్ కీలక నేత, మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు.ఎవరు ప్రధానమంత్రి అయినా భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని చిదంబరం అన్నారు. ఈ మాటలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా విమర్శించారు. 2004 - 2014 మధ్య జీడీపీ కేవలం రెండు ర్యాంకులు మాత్రమే పెరిగిందని సోమవారం ఉదయం విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో జరిగిన విక్షిత్ భారత్ అంబాసిడర్ క్యాంపస్ డైలాగ్ సభలో వెల్లడించారు.2004 నుంచి 2014 వరకు అప్పటి ప్రభుత్వం పదేళ్లలో కేవలం రెండు ర్యాంకులు జీడీపీ పెంచింది. ఆ తరువాత పదేళ్ల మోదీ పాలనలో జీడీపీ ఐదు ర్యాంకులకు ఎగబాకింది. రాబోయే రోజుల్లో మళ్ళీ మోదీ ప్రభుత్వం వస్తే.. తప్పకుండా జేడీపీ మరింత పెరుగుతుందని నిర్మలా సీతారామన్ అన్నారు.ఆర్ధిక వ్యవస్థ 2014కు ముందు బాగా తగ్గింది. చెడు విధానాలు, భారీ అవినీతి కారణాల వల్ల ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతినింది. ప్రస్తుతం భారతదేశ జీడీపీ అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ తరువాత ఐదో స్థానంలో ఉంది. రానున్న రోజుల్లో ఇది మూడో స్థానానికి చేరుతుంది. అది మోదీ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని సీతారామన్ అన్నారు.భారతదేశంలో ఇన్నోవేషన్ అండ్ డెవలప్మెంట్ ఎలా ఉందనే విషయాలను నిర్మల సీతారామన్ వివరించారు. అంతే కాకుండా రాబోయే రోజుల్లో పునరుత్పాదక వస్తువులు, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ, గ్రీన్ హైడ్రోజన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆగ్రో-ప్రాసెసింగ్ రంగాలు మరింత అభివృద్ధి మార్గంలో నడుస్తాయని స్పష్టం చేశారు. -
కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఏడాదిలో తొమ్మిదో ఘటన
దేశంలోనే ‘కోచింగ్ హబ్’గా ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. చదువు ఒత్తిడి, వ్యక్తిగత కారణాలతో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నీట్పరీక్షకు సిద్ధమవుతున్న మరో విద్యార్థి తాజాగా తనువు చాలించాడు.హర్యానా రోహ్తక్కు చెందిన సుమిత్ అనే 20 ఏళ్ల విద్యార్థి నీట్ పరీక్షకు సన్నద్ధమవుతున్నాడు. ఏడాదిగా కోటాలోని కున్హాడి ల్యాండ్మార్క్ సిటీలో ఉన్న ఓ హాస్టల్లో ఉంటూ.. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం అతను తన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్యాన్కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.ఆదివారం సుమిత్కు అతడి తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. అనుమానం వచ్చి వారు హాస్టల్ వార్డెన్కు ఫోన్ చేశారు. సిబ్బంది సుమిత్ గది వద్దకు వెళ్లి చూడగా.. డోర్ లాక్ చేసుకొని రూమ్లో ఉరేసుకొని కనిపించాడు. దీంతో హాస్టల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.కాగాా కోటాలో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు కలకలం రేపుతున్నాయి. తాజా ఘటనతో కలిసి ఈ ఏడాది ఇప్పటి వరకూ ఇది తొమ్మిదో ఘటన కావడం గమనార్హం. ఇక గతేడాది ఏకంగా 30 మంది దాకా విద్యార్ధులు ప్రాణాలు విడిచారు. -
చికెన్ షావర్మా తిని.. 12 మందికి అస్వస్థత
ముంబై: చికెన్ షావర్మా తిని సుమారు 12 మంది అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ జరిగి రెండు ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటు చేసుకుంది.బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల వివరాల ప్రకారం.. తూర్పు గోరేగావ్ ప్రాంతంలోని సంతోష్ నగర్లో శాటిలైట్ టవర్ వద్ద చికెన్ షావర్మా తిని రెండు రోజుల వ్యవధిలో 12 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో తొమ్మిది మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా.. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఫుడ్ పాయిజనింగ్ కారణంగానే వీరు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు. -
కేజ్రీవాల్ను చూసేందుకు.. భార్య సునీతకు అనుమతి నిరాకరణ
న్యూఢిల్లీ: తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను కలిసేందుకు ఆయన సతీమణిి సునీతకు అధికారులు అనుమతి నిరాకరించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే సోమవారం ఆయనను కలిసి మాట్లాడేందుకు సీఎం సతీమణి సునీత అనుమతి కోరారు. అయితే ఇందుకు జైలు అధికారులు అంగీకరించలేదని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించింది. సునీత కలిసేందుకు అధికారులు అనుమతించకపోడంపై కారణాలు కూడా చెప్పలేదని పేర్కొన్నాయి.కాగా ఢిల్లీ మంత్రి ఆతిశీ నేడు 12.30 గంటలకు కేజ్రీవాల్ను కలవనున్నారు. మంగళవారం పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ కూడా అరవింద్ కేజ్రీవాల్తో సమావేశం కానున్నారు.ఈ ఇద్దరి సమావేశాలకు అనుమతినిచ్చిన నేపథ్యంలో సునీత అభ్యర్థనను తిరస్కరించామని జైలు వర్గాలు తెలిపాయి. ఇద్దరు నేతల భేటీ తర్వాత ఆమెను తన భర్తను కలిసేందుకు అనుమతిస్తామని పేర్కొన్నాయి. జైలు నియమాల ప్రకారం.. ఒక ఖైదీని ఒకేసారి ఇద్దరు వ్యక్తులు, వారంలో గరిష్టంగా నలుగురు కలవచ్చు. ఇదిలా ఉండగాఢిల్లీ ముఖ్యమంత్రిని ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మార్చి 21న తన అధికారిక నివాసంలో అరెస్టు చేసింది. ఏప్రిల్ 1 నుంచి తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ కేజ్రీఆల్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది.మరోవైపు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్ సతీమణి సునీత ఆప్ తరపున ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఆదివారం పశ్చిమ ఢిల్లీ అభ్యర్ధి మహాబల్ మిశ్రా తరపున ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. తన భర్త కేజ్రీవాల్ను సింహంతో పోల్చారు. దిల్లీలో పాఠశాలలు నిర్మించడం, ఉచిత విద్యుత్ అందించడం, మొహల్లా క్లీనిక్లను ప్రారంభించినందువల్లే తన కేజ్రీవాల్ జైలుకెళ్లారన్నారు. ‘భారతమాత బిడ్డగా మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా.. నియంతృత్వానికి వ్యతిరేకంగా ఓటేయండి. నియంతృత్వానికి మీ ఓటుతో సమాధానం చెప్పండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అని కోరారు. -
Lok Sabha Elections: ఆరో విడత ఎన్నికల షెడ్యూల్ రిలీజ్
సాక్షి, ఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆరో విడతలో తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఆరో విడతలో 57 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఆరో షెడ్యూల్లో ఆరు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి.కాగా, సోమవారం ఉదయం ఆరో విడతలో లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఆరో విడతలో బీహార్, హర్యానా, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఆరో విడతలో 57 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. కాగా, మే ఆరో తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరుగనుంది. మే 25వ తేదీన పోలింగ్ జరుగుతుంది. జూన్ నాలుగో తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. Election Commission issues notice for the Sixth phase of Lok Sabha elections.Elections will be held in 57 Lok Sabha seats in 6 states and 1 Union Territory. pic.twitter.com/3ASMsonYUb— Sunny Raj ( Modi ka Parivar ) (@sunnyrajbjp) April 29, 2024
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కాంగ్రెస్కు షాక్.. నామినేషన్ వెనక్కి తీసుకున్న ఇండోర్ అభ్యర్థి
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
- గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
- అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
- కొత్తపల్లి గీతకు డిపాజిట్ దక్కేనా?
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
- శుభకార్యానికి వెళ్తూ అనంతలోకాలకు..
- పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- ఆందోళనలు ఉద్రిక్తం.. హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement