రెండు భారత పడవలు పట్టుకున్న పాక్ | Sakshi
Sakshi News home page

రెండు భారత పడవలు పట్టుకున్న పాక్

Published Sun, Jan 4 2015 8:08 PM

Pakistan abducts two boats with 12 Indian fishermen

న్యూఢిల్లీ: ముంబై ముట్టడి తరహా దాడికి యత్నించి విఫలమైన పాకిస్థాన్ మరో కుతంత్రానికి పాల్పడింది. రెండు భారతీయ మత్స్యకార పడవలను పాకిస్థాన్ పట్టుకుంది. జెలీల్, జలరామ్ పేరు గల ఈ పడవల్లో12 మంది జాలర్లు ఉన్నారు. అంతర్జాతీయ సముద్ర సరిహద్దులో శనివారం రాత్రి ఈ పడవలను పట్టుకున్నట్టు సమాచారం. పట్టుకున్న 12 మందిని ఎక్కడకు తీసుకెళ్లారనేది తెలియరాలేదు.

అరేబియా సముద్రం తీరం నుంచి గుజరాత్ లో చొరబడేందుకు డిసెంబర్ 31న పాకిస్థాన్ బోటు విఫలయత్నం చేసిన సంగతి తెలిసిందే. పాక్‌కు చెందిన ఆ పడవలోని సిబ్బంది తమను తాము పేల్చేసుకున్నారు.

Advertisement
Advertisement