మళ్లీ పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన | Sakshi
Sakshi News home page

మళ్లీ పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన

Published Tue, May 6 2014 11:11 PM

Pakistan again violates ceasefire in Kashmir

జమ్మూ: నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వెంబడి పాకిస్థాన్ బలగాలు మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించాయి. జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో ఎల్‌వోసీ వెంబడి భీంబర్ గాలీ వద్ద ఉన్న భారత ఔట్‌పోస్టులపై పాకిస్థాన్ బలగాలు సోమవారం అర్ధరాత్రి కాల్పులు జరిపాయని, వాటిని భారత సైన్యం దీటుగా తిప్పికొట్టిందని రక్షణ శాఖ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ఈ కాల్పుల్లో భారత సైనికులు ఎవరూ గాయపడలేదని, ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తె లిపారు.

 

పాక్ బలగాలు చిన్న తుపాకులతోపాటు ఆటోమేటిక్ తుపాకులతోనూ భారత పోస్టులపై కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. భారత్‌లోకి ఉగ్రవాదుల చొరబాట్లకు మార్గం సుగమం చేసేందుకే పాక్ బలగాలు కాల్పులకు దిగాయని సైనిక వర్గాలు చెబుతున్నాయి.

 

 

Advertisement
Advertisement