- జాదవ్ తల్లికి వీసాకు నో... మండిపడ్డ సుష్మా స్వరాజ్
న్యూఢిల్లీ: గూఢచర్యం కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారత నేవీ మాజీ అధికారి కుల్భూషణ్ తల్లి అవంతికకు పాకిస్థాన్ వీసా నిరాకరించడంపై విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ మండిపడ్డారు. అవంతికా జాదవ్కు వీసా ఇవ్వాలని స్వయంగా తానే పాకిస్థాన్ను కోరినా ఆ దేశం మాత్రం స్పందించడం లేదని సుష్మ ఆదివారం విమర్శించారు. తన కుమారున్ని చూడాలనుకుంటున్న జాదవ్ తల్లికి పాక్ వీసా ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు.
అయితే ఓ పాకిస్థానీకి మాత్రం తాను మెడికల్ వీసా ఇప్పించినట్లు ఆమె ట్వీట్ చేశారు. మెడికల్ వీసా కోరుకుంటున్న పాకిస్థానీల పట్ల తనకు సానుభూతి ఉందని, పాక్ మాత్రం ఇదే విధంగా స్పందించడం లేదన్నారు. పాక్ విదేశాంగమంత్రి సర్తాజ్ అజీజ్కు లేఖ రాసినా ఆయన కనీసం స్పందించలేదని ఆక్షేపించారు. గత ఏడాది జాదవ్ను పాకిస్థాన్ అరెస్టు చేయడం తెలిసిందే. దేశద్రోహం కేసులో పాక్ మిలిటరీ కోర్టు అతనికి మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఆదివారం పాకిస్థాన్కు చెందిన ఫైజా తన్వీర్ అనే తనకు మెడికల్ వీసా ఇప్పించాలని ట్విటర్ ద్వారా సుష్మ కోరారు. ఇందుకు ఆమె అనుకూలంగా స్పందించారు. ఏటా ఏడాది దాదాపు 500 మంది పాకిస్థానీలు వైద్యం కోసం భారత్ వస్తున్నారు.
ముగ్గురు ఉగ్రవాదుల కాల్చివేత
శ్రీనగర్: ఉత్తర కశ్మీర్లోని నౌగాం సెక్టార్ నుంచి దేశంలోకి చొరబడేందుకు యత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం కాల్చిచంపింది. ఆదివారం రాత్రి నౌగాం సెక్టార్ అనుమానిత కదలికలను గుర్తించామని సైనిక విభాగం అధికార ప్రతినిధి సోమవారం చెప్పారు. , భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయని, ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల మరణించారని చెప్పారు. ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకునేందుకుగాను అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ను నిర్వహిస్తున్నామన్నారు.
అన్ని సమస్యలూ పరిష్కారం కావాలి : పాక్
ఇస్లామాబాద్: కశ్మీర్ సహా అన్ని అంశాలపై భారత్తో చర్చలు జరిపి పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్టు పాకిస్థాన్ ప్రకటించింది. కశ్మీరీలు స్వాతంత్య్రం పొందే వరకు వారికి అన్ని విధాలా సహాయసహకారాలు అం దిస్తామని పాక్ ప్రధాని విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ ప్రకటించారు. ఆదివారం ఆయన ఒక వార్తా చానెల్తో మాట్లాడుతూ కశ్మీరీ లకు భారత్ విముక్తి కల్పించాలని సూచించారు. గత ఏడాది హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ మృతి తరువాత కశ్మీరీలపై అత్యాచారాలు విపరీతంగా పెరిగాయం టూ అజీజ్ భారత్పై మండిపడ్డారు.
దయచూపని పాకిస్థాన్..
Published Mon, Jul 10 2017 11:33 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
Advertisement