29 మంది మృతి; జవాన్ల ఎదురుదాడిలో 13 మంది మిలిటెంట్ల హతం
పెషావర్: పాకిస్తాన్లో తాలిబాన్ ఉగ్రవాదులు భద్రతా బలగాలకు గట్టి సవాల్ విసిరారు. ఖైబర్ పంక్తూన్క్వా రాష్ట్ర రాజధాని పెషావర్ సమీపంలోని బదాబర్ వైమానిక స్థావరంపై శుక్రవారం దాడికి తెగబడ్డారు. సైనిక దుస్తుల్లో వచ్చిన 13 మంది ఉగ్రవాదులు పెషావర్కు 6 కి.మీ దూరంలో ఉన్న ఈ స్థావరంలో, స్థావరం లోపలి మసీదుపై విచక్షణా రహితంగా కాల్పులు, గ్రెనేడ్ పేలుళ్లకు పాల్పడ్డారు.
ఈ దాడిలో ఒక ఆర్మీ కెప్టెన్, ఇద్దరు సైనికులు, 23 మంది పాక్ వైమానిక దళ సిబ్బంది, ముగ్గురు పౌరులు(మొత్తం 29 మంది) మృతిచెందారు. భద్రతా బలగాలు ఎదురుదాడి చేసి మొత్తం 13 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఈ ఘటనలో పదిమంది జవాన్లు సహా 29 మంది గాయపడ్డారు. ఉగ్రవాదులు పేలుడు పదార్థాల జాకెట్లు ధరించి బృందాలుగా విడిపోయి రెండు మార్గాల్లో ప్రవేశించారు. సెక్యూరిటీ పోస్ట్పై దాడి చేసి, అక్కడున్న ఇద్దరు వాయుసేన సాంకేతిక అధికారులను చంపేశారు.
మసీదులో ప్రార్థన చేసుకుంటున్నవారిపై దాడి చేశారు. క్షతగాత్రులను సైనిక ఆస్పత్రికి, లేడీ రీడింగ్ ఆస్పత్రికి తరలించామని ఆర్మీ ప్రతినిధి అసీం బాజ్వా తెలిపారు. స్థావరంలో ఉగ్రవాదులెవరైనా దాక్కుని ఉన్నారేమోనని ఆపరేషన్ సాగిస్తున్నామన్నారు. సోదాల్లో ఇప్పటి వరకు 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ క్షతగాత్రులను పరామర్శించారు. ఈ దాడికి పాల్పడింది తమ ఆత్మాహుతి మిలిటెంట్లేనని తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ప్రకటించింది. మిలిటెంట్లు 50 మంది జవాన్లను చంపేశారని పేర్కొంది. అయితే అధికారులు ధ్రువీకరించలేదు.
బదాబర్ స్థావరం ప్రస్తుతం వినియోగంలో లేదు. వాయుసేన సిబ్బంది, ఉద్యోగులకు నివాస స్థలంగా వాడుతున్నారు. గత డిసెంబర్లో పెషావర్లోని ఆర్మీ స్కూల్పై జరిగిన దాడిలో 150 మంది చనిపోవడం తెలిసిందే. ఇదిలా ఉండగా, పాక్ పంజాబ్ రాష్ట్రంలోని కమ్రా వైమానిక స్థావరంపై దాడికి పన్నిన కుట్రను భగ్నం చేసి, ఒక మానవ బాంబర్ను అరెస్టు చేశామని కరాచీ పోలీసులు శుక్రవారం తెలిపారు.
పాక్ వైమానిక స్థావరంపై ‘ఉగ్ర’దాడి
Published Sat, Sep 19 2015 1:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యదు! గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
తప్పక చదవండి
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement