ఏడాదికి 45 వేల మందికి శిక్షణ: లోకేష్ | Sakshi
Sakshi News home page

ఏడాదికి 45 వేల మందికి శిక్షణ: లోకేష్

Published Wed, Sep 30 2015 1:49 AM

ఏడాదికి 45 వేల మందికి శిక్షణ: లోకేష్ - Sakshi

దేవరపల్లి(నల్లజర్ల): రాష్ట్రంలో ఏడాదికి 45 వేల మంది కార్యకర్తలకు నాయకత్వ శిక్షణ ఇవ్వనున్నట్టు టీడీపీ కార్యకర్తల సంక్షేమనిధి సమన్వయకర్త నారా లోకేష్ చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణాజిల్లా టీడీపీ కార్యకర్తల శిక్షణ  కార్యక్రమాన్ని మంగళవారం లోకేష్ ప్రారంభించారు. అనంతరం ఎస్.వి.ఆర్.కె. జూనియర్ కళాశాలలో పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. తిరుపతి, నల్లజర్ల, అరకు, కందుకూరులో శిక్షణ  కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 100 మంది చొప్పున బ్యాచ్‌లుగా ఏర్పాటు చేసి ఒక్కొక్క బ్యాచ్‌కి మూడు రోజులు  టీడీపీ ఆవిర్భావం, పార్టీ చరిత్రపై శిక్షణ ఇస్తామని తెలిపారు.

Advertisement
Advertisement