పాప పుట్టాక ఆ మహిళను ? | Sakshi
Sakshi News home page

పాప పుట్టాక ఆ మహిళను ?

Published Fri, May 19 2017 12:46 PM

పాప పుట్టాక  ఆ మహిళను ?

భద్రాద్రి కొత్తగూడెం: ప్రేమించి మోసం చేసి.. దుబాయ్‌ చెక్కేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించి తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన బానోతు శ్యామల(25) సత్యభాస్కర్‌ ఇంటర్‌ కళాశాలలో చదువుతున్న సమయంలో స్థానికంగా నివాసముండే ఇంతియాజ్‌ అలీతో పరిచయమైంది. శ్యామల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న అతను ప్రేమిస్తున్నానని వేధించడం ప్రారంభించాడు.

గుడ్డిగా నమ్మిన తాను అతని ప్రేమలో పడింది. ఇదే ఆదునుగా భావించిన అతను శ్యామలను ఓ ఇంట్లో ఉంచి పెళ్లి చేసుకోకుండానే కాపురం చేశాడు. వీరికి ఓ పాప కూడా పుట్టింది. అనంతరం ఆమెను వదిలి దుబాయ్‌ వెళ్లిపోయాడు. దుబాయ్‌ వెళ్లిన తర్వాత కూడా కొంత కాలం ఫోన్‌లో మాట్లాడేవారు. గత మూడేళ్లుగా ఫోన్‌ చేయకపోవడంతో పాటు తను ఫోన్‌ చేసినా తీయకుండా చంపేస్తానని బెదిరించడం ప్రారంభించాడు. దీంతో ఆమె గతంలో పోలీసులను ఆశ్రయించింది. అయినా ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో ఈ రోజు తిరిగి పోలీసులను కలిసి తన గోడు వెళ్లబోసుకుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement