సంస్థలో పని చేస్తున్న కార్మికులను తొలగించేందుకు ప్రముఖ కూల్ డ్రింక్ కంపెనీ కోకో కోలా స్పెయిన్లోని ఆ సంస్థ యాజమాన్యం సమయాత్తమైంది. యాజమాన్యం తీసుకున్న నిర్ణయంపై ఆ సంస్థలలో పని చేసే కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా రాజధాని మాడ్రిడ్ నగర శివారులోని కోకోకోలా కూల్ డ్రింక్ తయారీ ప్లాంట్ వద్ద శుక్రవారం కార్మికులు ఆందోళనకు దిగారు.
అయితే ఆందోళన చేస్తున్న సమయంలో ఆగంతకుడు ఆ ప్లాంట్లోకి బాంబు విసిరారు. దాంతో ప్లాంట్లోని సిబ్బంది అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఆ బాంబుని నిర్వీర్యం చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. కోకోకోలా కంపెనీ వద్ద ఏర్పాటు చేసి వీడియో పూటేజ్లను పోలీసు ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు.