బంకులు, బ్యాంకుల ఎండీఆర్ చార్జీల లొల్లి
♦ తమ నుంచి వసూలు చేయాలన్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న డీలర్లు
♦ సోమవారం నుంచి బంకుల్లో డెబిట్/క్రెడిట్ కార్డు చెల్లింపులు బంద్ చేస్తున్నట్టు ప్రకటన
♦ తర్వాత 13వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్టు వెల్లడి
♦ జనరల్, మెడికల్ షాపుల్లోనూ వినియోగదారులు, వ్యాపారులపై సర్చార్జి మోత
♦ మళ్లీ నగదు వైపే చూస్తున్న జనం
న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్:
బంకుల్లో నగదు రహిత లావాదేవీలపై ‘పెట్రో’వార్ మొదలైంది! పెట్రోలు, డీజిల్ కొనుగోళ్లపై ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) చార్జీల వసూలు బ్యాంకులు, బంకుల మధ్య చిచ్చు రేపింది. ఈ చార్జీలను వినియోగదారుల నుంచి కాకుండా తమ నుంచి వసూలు చేయాలన్న నిర్ణయాన్ని నిరసిస్తూ సోమవారం నుంచి దేశవ్యాప్తంగా బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొనుగోలుకు క్రెడిట్, డెబిట్ కార్డులను అంగీకరించబోమంటూ ఆదివారం ఆలిండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ బాంబు పేల్చింది. అయితే ఉన్నట్టుండి అర్ధరాత్రి తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ నెల 13 వరకు తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్టు అఖిల భారత పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ బన్సల్ వెల్లడించారు.
నోట్ల రద్దు నిర్ణయం తర్వాత నగదు రహిత లావాదేవీల్ని ప్రోత్సహించేందుకు.. పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై వినియోగదారుల నుంచి ఎండీఆర్ చార్జీలు వసూలు చేయడాన్ని కేంద్రం ఎత్తివేసింది. అయితే 50 రోజుల గడువు ముగియడంతో ఆ చార్జీలను వినియోగదారుల నుంచి కాకుండా పెట్రోల్ బంకుల యాజమాన్యాల నుంచి వసూలు చేయాలంటూ బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. ‘‘పెట్రోల్ బంకుల్లో క్రెడిట్ కార్డు లావాదేవీలపై 1 శాతం పన్ను, డెబిట్ కార్డులపై 0.25 శాతం నుంచి 1 శాతం పన్నును జనవరి 9 నుంచి వసూలు చేస్తాం’’అంటూ హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి తమకు లేఖ వచ్చిందని అజయ్ బన్సాల్ తెలిపారు. డిసెంబర్ 16న రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన సరŠుక్యలర్ మేరకే నిర్ణయం తీసుకున్నట్లు ఆ లేఖలో హెచ్డీఎఫ్సీ పేర్కొందని వివరించారు. ఈ చార్జీల వసూలును నిరసిస్తూ సోమవారం నుంచి బంకుల్లో డెబిట్/క్రెడిట్ కార్డులను అంగీకరించవద్దని నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే ఆ చార్జీల వసూలును 13 వరకు వాయిదా వేస్తున్నట్లు చమురు కంపెనీల నుంచి సమాచారం అందడంతో నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్టు చెప్పారు.
జనరల్, కిరాణా షాపుల్లో సర్‘చార్జ్’
క్యాష్లెస్ చెల్లింపుల ప్రక్రియతో అటు కొనుగోలుదారులు, ఇటు వ్యాపారులపై సర్చార్జీ భారం పడుతోంది. డెబిట్/క్రెడిట్ కార్డు వాడుతున్న వినియోగదారుడి ప్రతి లావాదేవీపై సగటున 2.8 శాతం సర్చార్జీ పడుతోంది. స్వైపింగ్ మిషన్ ద్వారా చెల్లించిన మొత్తానికి మాత్రమే మొబైల్ ఫోన్కు మెసేజ్ వస్తోంది. సర్చార్జీ పేరిట కోత పడుతున్న డబ్బులకు సంబంధించి ఎలాంటి మెసేజ్ రావడం లేదు. జనవరి 1 నుంచే ఈ వాత అమల్లోకి వచ్చింది. మరోవైపు పీఓఎస్ మెషీన్లతో లావాదేవీలు సాగిస్తున్న వ్యాపారులపైన 2 శాతం భారం పడుతోంది.
దీంతో జనరల్, కిరాణా సోర్లు, మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసిన మొత్తంపై 2 శాతం అదనంగా వసూలు చేస్తున్నారు. ఎల్బీనగర్కు చెందిన రవికుమార్ ఆదివారం ఓ మెడికల్షాపులో రూ.165 మెడిసిన్ కొనుగోలు చేయగా.. షాప్కీపర్ మాత్రం స్వైపింగ్ మిషన్లో రూ.169 ఎంట్రీ చేసి బిల్లు తీసుకున్నాడు. అదేంటని అడిగితే.. తమకు ప్రతి కొనుగోలుపై సర్చార్జీ పడుతోందని, అందుకే రూ.4 అదనంగా తీసుకుంటున్నట్టు చెప్పాడు. ఇది వినియోగదారులకు, వ్యాపారులకు భారంగా మారుతుండడంతో మళ్లీ నగదు లావాదేవీల వైపే మొగ్గుతున్నారు.
కారులో రూ.1,200 పెట్రోలు కొట్టించా. నగదుకు బదులుగా డెబిట్కార్డుతో డబ్బులు చెల్లించా. బ్యాంకు ఖాతా నుంచి రూ.1,200తో పాటు సర్వీసు చార్జీ పేరిట అదనంగా రూ.34 కోత పడింది. మినీ స్టేట్మెంట్ తీసుకుంటే ఈ విషయం తెలిసింది. ఇట్లా సర్చార్జీ పడితే మళ్లీ కార్డు ఉపయోగించ.
– కొట్ర బలరాం, నాగర్కర్నూల్
క్యాష్లెస్ పద్ధతిలో రోజుకు సగటున రూ.2 లక్షల రాబడి వస్తుండగా.. బ్యాంకు ఖాతాలో మాత్రం రూ.1.95 లక్షలు మాత్రమే జమవుతున్నట్లు స్టేట్మెంట్లో కనిపిస్తోంది. వారం రోజుల్లో దాదాపు రూ.40 వేలు కోత పడింది. కార్డుల ద్వారా చెల్లింపులతో ఇలా కోత పడితే వాటిని వినియోగించడం కష్టం కదా..
– హనుమంతు, పెట్రోల్ క్ క్యాషియర్, ఇబ్రహీంపట్నం
క్యాష్లెస్పై ‘పెట్రో’వార్
Published Mon, Jan 9 2017 1:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించాలి
శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలి
అక్రమ కేసులు పెడుతున్నారు..
మూడు నియోజకవర్గాలకు అదనపు ఈవీఎంలు
బడి.. దందా!
పలుచోట్ల వడగళ్లు
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
‘దోస్త్’ సహాయ కేంద్రం ప్రారంభం
ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
మెరుగైన వైద్య సేవలందించాలి●
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement