మీ రాష్ట్రం ధైర్య, సాహసికులను ఇచ్చింది | Sakshi
Sakshi News home page

మీ రాష్ట్రం ధైర్య, సాహసికులను ఇచ్చింది

Published Fri, May 1 2015 11:25 AM

మీ రాష్ట్రం ధైర్య, సాహసికులను ఇచ్చింది - Sakshi

న్యూఢిల్లీ: మీ రాష్ట్రం ధైర్యం, సాహసం ఉన్నవాళ్లను దేశానికి ఇచ్చిందని ప్రధాని నరేంద్రమోదీ మహారాష్ట్రను కొనియాడారు. గుజరాత్, మహారాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ఆ రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశాభివృద్ధిలో ఆ రెండు రాష్ట్రాల పాత్ర అద్వితీయమంటూ కొనియాడుతూ శుక్రవారం ట్వీట్ చేశారు. ఈ రెండు రాష్ట్రాలు కూడా 1960 మే 1న ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ మోదీ మహారాష్ట్రపై అధికంగా ప్రశంసలు గుప్పించారు. దేశాభివృద్ధికి మహారాష్ట్ర సేవల చాలా గొప్పవని అన్నారు.

ఆ నేల ఈ దేశానికి గొప్పగొప్ప తత్వవేత్తలను, మత పెద్దలను, ధైర్యవంతులను, సాహసికులను అందించిందని చెప్పారు. దేశంలో మహారాష్ట్ర ప్రజలకు అత్యధికంగా కష్టపడేతత్వం ఉంటుందని చెప్పారు. మహారాష్ట్ర మరింత గొప్పగా అభివృద్ధి పదాన దూసుకెళ్లాలని తాను మనసారా ఎల్లప్పుడూ కోరుకుంటానని చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement