న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర కేబినెట్ను పునర్వ్యవస్థీకరించారు. మంత్రివర్గంలోకి కొత్తగా 19 మందిని తీసుకున్నారు. స్వతంత్ర మంత్రి ప్రకాష్ జవదేకర్కు కేబినెట్ హోదాతో పదోన్నతి కల్పించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్ర మంత్రివర్గ విస్తరణలో పెద్దపీట వేశారు. రాజస్థాన్కు నాలుగు.. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు మూడేసి చొప్పున.. మహారాష్ట్రకు రెండు.. కర్ణాటక, పశ్చిమ బెంగాల్, అసోం, ఉత్తరాఖండ్లకు ఒక్కొక్కటి చొప్పున మంత్రి పదవులు దక్కాయి. దళిత ఎంపీలకు ప్రాధాన్యమిచ్చారు. బీజేపీలో కొత్తముఖాలకు చోటు కల్పించారు. ఎన్డీయే మిత్రపక్షాలయిన రిపబ్లికన్ పార్టీకి చెందిన దళిత ఎంపీ రామ్దాస్ అథవాలే (మహారాష్ట్ర), అప్నా దళ్కు చెందిన అనుప్రియా పటేల్ (ఉత్తరప్రదేశ్)కు మంత్రి పదవులు దక్కాయి. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.
జవదేకర్కు పదోన్నతి
స్వతంత్ర హోదాతో ఉన్న ప్రకాష్ జవదేకర్కు పదోన్నతి లభించింది. కేబినెట్ మంత్రిగా తొలుత ఆయన ప్రమాణం చేశారు.
కొత్త మంత్రులు
ఫగన్సింగ్ కులస్తే (మధ్యప్రదేశ్)
ఎస్ఎస్ అహ్లూవాలియా(పశ్చిమబెంగాల్ )
రమేశ్ చంద్రప్ప జిగజినగీ (కర్ణాటక)
విజయ్ గోయల్ (రాజస్థాన్)
రామ్దాస్ అథవాలే (మహారాష్ట్ర)
రాజేన్ గొహెయిన్ (అసోం)
అనిల్ మాధవ్ దవే (మధ్యప్రదేశ్)
పురుషోత్తం రుపాలా (గుజరాత్)
ఎంజే అక్బర్ (మధ్యప్రదేశ్)
అర్జున్ రామ్ మేఘవాల్ (రాజస్థాన్)
జశ్వంత్ సింగ్ భాబోర్ (గుజరాత్)
మహేంద్రనాథ్ పాండే (ఉత్తరప్రదేశ్)
అజయ్ తమ్తా (ఉత్తరాఖండ్)
కృష్ణరాజ్ (ఉత్తరప్రదేశ్)
మన్సుఖ్భాయ్ మాండవీయ (గుజరాత్)
అనుప్రియా పటేల్ (ఉత్తరప్రదేశ్)
సీఆర్ చౌదరి (రాజస్థాన్)
పీపీ చౌదరీ (రాజస్థాన్)
సుభాష్ రామ్రావ్ భామ్రే(మహారాష్ట్ర)
Related news
-
మాలో తెలంగాణ పౌరుషం ఉంది.. భయపడేది లేదు: సీఎం రేవంత్
సాక్షి, జగిత్యాల: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ దేశాన్ని అదానీ, అంబానీ, కార్పొరేట్ శక్తులకు అమ్ముతున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. మోదీ హయాంలో దళితులు, బలహీన వర్గాలకు ఎలాంటి న్యాయం జరగలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ను గెలిపిస్తే.. బీసీ జనగణన చేసి, వారికి న్యాయం చేస్తామని చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. అందుకే 400 సీట్లు కావాలని బీజేపీ అడుగుతోందని దుయ్యబట్టారు.కోరుట్లలో కాంగ్రెస్ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. బీజేపీని ప్రశ్నిస్తే మోదీ, అమిత్ షా తనపై కేసు పెట్టారన్నారు. ఢిల్లీ పోలీసులను ఉపయోగించి మనల్ని భయపెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు. కేసులకు రేవంత్ రెడ్డి భయపడడని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటే రిజర్వేషన్లను రుద్దు చేయడమేనా అని ప్రశ్నించారు. తెలంగాణకు నీళ్లు ఇవ్వరు, నిధులు ఇవ్వని వారు నేడు ఓట్లు ఎలా అడుగుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘కార్మికుల త్యాగాలు, పొరాటాల వలనే తెలంగాణ ఏర్పడింది. పార్లమెంటు ఎన్నికలు ప్రత్యేక పరిస్థితులలో జరుగుతున్నాయి. రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర జరుగుతుంది. 400 సీట్లు గెలిచి అదానీ, అంబానీలకు దోచిపెట్టాలని చూస్తున్నారు. కుల గణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశాం. నేను బిజెపి ని ప్రశ్నిస్తే ఢిల్లీలో కేసు పెట్టారు.చదవండి: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులుపదేళ్లు కేసీఆర్ భయపెట్టాలని చూశాడు.కేసులు పెట్టినోళ్ళను అధికారంలో లేకుండా చేశాం. ఒక ప్రధానిగా నరేంద్ర మోదీ కనబడితే నమస్కరిస్తా. గుజరాత్ వాడిగా తెలంగాణకు వస్తున్నాడు. తెలంగాణకు వచ్చిన వాటిని రద్దు చేసిన వ్యక్తి మోదీ. కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటే రిజర్వేషన్ రద్దు చేయడమేనా? మెట్రో రైలుకి అనుమతులు ఇవ్వాలని అడిగితే స్పందనలేదు. నీటి కేటాయింపులు అడిగితే స్పందించలేదు. తెలంగాణ ఏర్పాటును అగౌరపరిచిన వ్యక్తి నరేంద్ర మోదీ. ఆయన తన స్థాయిని మరచి ప్రవర్తిస్తున్నాడు.దలితులు,గిరిజనులు ఇంకా చితికి పోవాలా. గుజరాత్ నుంిచి వచ్చి తెలంగాణలో పెత్తనం ఏంటి? గుజరాత్ అహాంకారానికి, తెలంగాణ అత్మగౌరవానికి జరుగుతున్న పోరాటం.మనకి విభేదాలు ఉన్న ఊరుకానొడు వస్తే తరిమికొట్టాలి. రేవంత్ రెడ్డిని జైలులో వెయడానికేనా ప్రధాన మంత్రి ఉద్దేశమా. తెలంగాణ పౌరుషం మాలో ఉంది...భయపడేది లేదు. నిజాం,రజాకార్లకు పట్టిన గతే బిజేపికి పట్టింది.పదవులకే వన్నె తెచ్చిన వ్యక్తి జీవన్ రెడ్డి. పదవులను అడ్డం పెట్టుకొని జీవన్ రెడ్డి ఎప్పుడూ అక్రమంగా సంపాదించలేదు. నిజామాబాదు ప్రాంతం వారికి అండగా నిలబడడానికే జీవన్ రెడ్డి ఇక్కడి నుంచి పోటి చేస్తున్నారు. కొడంగల్ ఓటమి నాకు లాభం తెస్తే, జీవన్ రెడ్డికి జగిత్యాల ఓటమి లాభం చేకూర్చుంది’ అని రేవంత్ పేర్కొన్నారు. రాజ్యాంగం రద్దుకు బీజేపీ చేస్తున్న కుట్రను సాయంత్రం హైదరాబాద్లో విలేకరుల సమావేశంలో వెల్లడిస్తానని తెలిపారు. -
కేంద్ర వ్యవసాయ మంత్రిగా మాజీ సీఎం? ప్రధాని మోదీ లేఖలో స్పష్టం?
గత ఏడాది జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినా, శివరాజ్సింగ్ చౌహాన్ను బీజేపీ తిరిగి ముఖ్యమంత్రిని చేయలేదు. అయితే ఇప్పుడు మోదీ ప్రభుత్వం మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా నియమించనున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇటీవల శివరాజ్సింగ్ చౌహాన్కు ప్రధాని మోదీ రాసిన లేఖ ఇటువంటి వార్తలకు కారణంగా నిలుస్తోంది. ‘దేశంలోని వ్యవసాయరంగంలో మీరు స్ఫూర్తిదాయకంగా నిలిచారని ప్రధాని మోదీ.. శివరాజ్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో మీ దూరదృష్టి విధానాలు మధ్యప్రదేశ్లోని రైతుల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకువచ్చాయని కూడా మోదీ ఆ లేఖలో శివరాజ్ను ప్రశంసించారు.ప్రధాని మోదీ మాజీ సీఎం శివరాజ్ సింగ్కు రాసిన లేఖలో ‘మీకు విద్యార్థి రాజకీయాలలో అపారమైన రాజకీయ అనుభవం ఉంది. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ పదవీకాలంలో మధ్యప్రదేశ్ అగ్రగామి రాష్ట్రాలలో ఒకటిగా నిలిచింది. మీరు రాష్ట్రంలో సానుకూల అభివృద్ధిని తీసుకువచ్చారు. మహిళలు, పిల్లలు, యువత సాధికారత కోసం అనేక పథకాలు అమలు చేశారు. ప్రజలు మిమ్మల్ని తమ కుటుంబ సభ్యునిగా భావిస్తున్నారు. మిమ్మల్ని ‘మామాజీ’ అని పిలుస్తూ, గౌరవిస్తున్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో మీ దూరదృష్టి విధానాలు మధ్యప్రదేశ్లోని రైతుల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకువచ్చాయి.సాంకేతికతతో వ్యవసాయ ఉత్పత్తులను వృద్ధి చేయడం, ఆ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం కోసం నూతన మార్గాలు ఏర్పాటు చేయడం లాంటి పనులు చేపట్టారు. వ్యవసాయంలో స్వయం సహాయక బృందాలను భాగస్వామ్యం చేశారు. విదిశ నుండి మీరు వరుసగా ఐదు సార్లు ఎన్నిక కావడం అనేది ప్రజలకు సేవ చేయాలనే మీ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. త్వరలో మీరు పార్లమెంటుకు చేరుకుంటారని, కొత్త ప్రభుత్వంలో మనమందరం కలిసి దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడానికి అన్ని విధాలా కృషి చేస్తామని నేను నమ్ముతున్నాను’ అని పేర్కొన్నారు. -
గుజరాత్ పెత్తనమా.. తెలంగాణ పౌరుషమా?: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ భూపాలపల్లి/ సాక్షి, రంగారెడ్డి జిల్లా/ దిల్సుఖ్నగర్ (హైదరాబాద్): కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం వస్తే దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలపై సర్జికల్ స్ట్రైక్ చేసి రిజర్వేషన్లు రద్దు చేస్తారని ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని సవరించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఆ పార్టీకి ఓటు వేస్తే విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు లభించవని, బలహీన వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్రావు ఆత్మ బీజేపీ నేత అమిత్ షాను ఆవహించిందని, ఆ రెండు పార్టీలు ఒక్కటై రాష్ట్రంలో గూడు పుఠాణి చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో కొన్నిచోట్ల బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు బీఆర్ఎస్ పార్టీ అనామకులకు ఎంపీ టికెట్ ఇచ్చిందని అన్నారు. డిసెంబర్లో జరిగిన సెమీఫైనల్ ఎన్నికల్లో కేసీఆర్ను బొంద పెట్టామని, ఇప్పుడు జరిగే ఫైనల్ మ్యాచ్లో తెలంగాణ పౌరుషం గుజరాత్కు తెలిసేలా మోదీని ఓడించాలని ప్రజలను కోరారు. ఫైనల్స్లో మోదీ, అమిత్షాలను ఓడించి, రాహుల్గాం«దీని ప్రధానిని చేసినప్పుడే మనం గెలిచినట్లు అని పేర్కొన్నారు. ‘గుజరాత్ పెత్తనమా.. తెలంగాణ పౌరుషమా? తేల్చుకుందాం..’ అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో, జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో నిర్వహించిన జనజాతర సభల్లో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ శివారు బాలాపూర్, బడంగ్పేట్, సరూర్నగర్లో, మహేశ్వరం నియోజకవర్గంలోని ఎన్టీఆర్ నగర్లో రోడ్ షో అనంతరం కార్నర్ మీటింగుల్లో ప్రసంగించారు. తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారు ‘కులగణన చేపట్టి దామాషా ప్రకారం బలహీనవర్గాలకు రిజర్వేషన్లు తీసుకురావాలని మేము ప్రయత్నిస్తుంటే, బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తోందో మోదీ సమాధానం చెప్పాలి. బీజేపి కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు వారిని గద్దె దించుతారు. ప్రధానిగా మోదీ పదేళ్లలో తెలంగాణకు ఇచ్చింది ఏమీ లేదు. బండి సంజయ్ కరీంనగర్కు తెచ్చిందేమీ లేదు.. గాడిద గుడ్డు తప్ప. గుండు అర్వింద్, అరగుండు సంజయ్లు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలి. పదేళ్లలో మోదీ కర్ణాటకకు చెంబు, ఏపీకి పాచిపోయిన లడ్డూలు, మట్టి, నీళ్లు, తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారు..’ అని రేవంత్ ఎద్దేవా చేశారు. మోదీ, షాలకు కర్రుకాల్చి వాత పెట్టాలి ‘మోదీ అన్ని రకాలుగా మోసం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ హయాంలో మంజూరు చేసిన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేశారు. బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వేకోచ్లను రద్దు చేశారు. ఏటా ఐదు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి ఒక్కరికీ ఇవ్వలేదు. రైతుల ఆదాయం పెంచుతామని చెప్పి రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చారు. అధికారంలోకి వచ్చాక కేసీఆర్ మోసం చేసినందుకు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. అదే విధంగా నరేంద్ర మోదీకి, అమిత్షాకు కర్రు కాల్చి వాత పెట్టాలి..’ అని సీఎం అన్నారు. సైనికుల్ని పంపించినా భయపడేది లేదు ‘తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్రంలో డ్రగ్స్ నిషేధిస్తుంటే వాటి మూలాలు గుజరాత్లో వెలుగు చూస్తున్నాయి. కేసీఆర్ ఉపన్యాసాన్ని మోదీ నకలు కొట్టారు. నన్ను తిడితే ఏం వస్తుంది? సలహాలు ఇవ్వాల్సింది పోయి అడ్డగోలుగా తిట్టిపోయిండు. కేసీఆర్, కిషన్రెడ్డి కూడా ఇదే పని చేస్తున్నారు. తిట్టడానికి ఇంత దూరం రావలసిన అవసరం లేదు. హైదరాబాద్ మెట్రో రైలుకు నిధులు కేటాయించలేదు. బుల్లెట్ రైలు ఇవ్వలేదు. వరంగల్కు ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్రోడ్డు రాకుండా ప్రధాని అడ్డుకున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన నన్ను కేసీఆర్ తరహాలోనే అరెస్టు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. కేసీఆర్ బెదిరిస్తేనే భయపడలేదు. తాజాగా మోదీ ఢిల్లీ పోలీసులను పంపాడు. వాళ్లకు భయపడతామా? సైనికుల్ని పంపించినా భయపడేది లేదు. రేవంత్రెడ్డికి జైలు కొత్త కాదు..’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాజకీయం కోసం రాముడి అక్షింతలు పంచారు ‘అయోధ్యలో రాముడి కల్యాణానికి 15 రోజుల ముందే రాజకీయం కోసం శ్రీరాముడి అక్షింతలు ఇంటింటా పంచి బీజేపీ అవమానించింది. రాజకీయాల కోసం రాముడిని వాడుకుంటున్న విషయాన్ని హిందువులందరూ ఆలోచించాలి. మనమందరం హిందువులం కాదా? రామభక్తులం కాదా? అయినా ఓట్ల కోసం హిందుత్వాన్ని ఎప్పుడూ వాడుకోలేదు..’ అని రేవంత్ అన్నారు. ఇండియా కూటమిలోకి కేసీఆర్ను తీసుకోం ‘బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ను ఓడించేందుకు, బీజేపీని గెలిపించేందుకు పలు స్థానాల్లో డమ్మీ అభ్యర్థులను కేసీఆర్ పోటీలో నిలిపారు. బీఆర్ఎస్ను ఇండియా కూటమిలోకి తీసుకోం. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ నన్ను వేధించి కేసులు పెట్టి జైలుకు పంపాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అక్రమ కేసులు పెట్టింది. కేసీఆర్ మళ్లీ పగటి కలలు కంటున్నాడు. వంద రోజుల్లోనే కాంగ్రెస్ను దిగిపోవాలంటున్నాడు. నేను ప్రజల మద్దతుతో సీఎం అయ్యా. ఏడాది కాదు..కేసీఆర్? నీ జీవితం మొత్తం ఎదురు చూసినా మళ్లీ నీకు సీఎం పదవి రాదు. తిక్కలోడు తిరనాళ్లకు పోయినట్లు కేసీఆర్ బస్సుయాత్ర ఉంది..’ అని సీఎం విమర్శించారు. కొండా రాజ్యసభ సీటు కొనుక్కోవచ్చు ‘మాజీ మంత్రి సబితమ్మ పొద్దున కారు గుర్తు అంటుంది. రాత్రిపూట కమలం గుర్తుకు ప్రచారం చేస్తుంది. సొంత పార్టీని బీజేపీకి తాకట్టు పెట్టింది. కొండా విశ్వేశ్వర్రెడ్డి రాజకీయాన్ని కూడా ఓ వ్యాపారంగా చూస్తున్నాడు. పదేళ్లు తెలంగాణను మోసం చేసిన మోదీ పక్కన చేరి మళ్లీ ఇక్కడి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడు. వందల కోట్లు ఉన్న కొండాకు నిజంగానే ప్రజా సేవ చేసే ఆలోచన ఉంటే.. రూ.కోట్లు పెట్టి ఏ రాజ్యసభ సీటో కొనుక్కోవొచ్చు..’ అని రేవంత్ అన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, దనసరి సీతక్క, కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్బాబు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, రేవూరి ప్రకా‹Ùరెడ్డి, కేఈఆర్ నాగరాజు, నాయిని రాజేందర్రెడ్డి, కడియం శ్రీహరి, కరీంనగర్, వరంగల్, చేవెళ్ల పార్టీ అభ్యర్థులు వెలిచాల రాజేందర్రావు, కడియం కావ్య, గడ్డం రంజిత్రెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వడదెబ్బతో వృద్ధురాలు మృతి జమ్మికుంట (హుజూరాబాద్): జమ్మికుంటలో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో అపశ్రుతి చోటు చేసుకుంది. వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన అంబాల ఐలమ్మ (68) వడదెబ్బకు గురై సభలోనే కుప్పకూలింది. వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఐలమ్మ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి సహాయం అందేలా చూస్తానని కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితెల ప్రణవ్ హామీ ఇచ్చారు. -
మోదీ సభతో బీజేపీలో జోష్
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్తున్న బీజేపీలో ప్రధాని మోదీ బహిరంగసభ నూతనోత్సాహాన్ని నింపింది. ఈ సభ లో యువత పెద్దసంఖ్యలో పాల్గొనడం, మోదీ ప్రసంగం సందర్భంగా కరతాళధ్వనులు, నినాదాలతో హోరెత్తించడం పార్టీ కేడర్లో హుషారు తెచ్చింది. ఈ సభకు ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి కాంగ్రెస్ నాయకులకు నిద్రపట్టదంటూ మోదీ తన ప్రసంగం సందర్భంగా వ్యాఖ్యానించారు. మంగళవారం జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని అల్లాదుర్గ్లో నిర్వహించిన సభ సక్సెస్ కావడం పట్ల పార్టీ ముఖ్యనేతలు సంతోషాన్ని వ్యక్తంచేస్తున్నారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా బీబీ పాటిల్ను, మెదక్ ఎంపీ అభ్యర్థిగా ఎం.రఘునందన్రావును గెలిపించాలంటూ మోదీ కోరడంతోపాటు, ఈ ప్రాంతానికి సంబంధించి కేంద్రంలోని తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించడంపై ప్రజల్లో మంచి స్పందన కనిపించింది, మళ్లీ మే 8న వేములవాడలో, మే 10న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగసభల్లో మోదీ పాల్గొననున్నారు. నేడు అమిత్షా రోడ్షో... బీజేపీ అగ్రనేత, కేంద్రహోంమంత్రి అమిత్ షా బుధవారం హైదరాబాద్ లోక్సభ పరిధిలో రోడ్షో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన బుధవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో బేగంపేట ఎయిర్పోర్టులో దిగుతారు. ఆ తర్వాత పాతబస్తీ లాల్దర్వాజ మహంకాళి ఆలయం నుంచి అక్కడికి దగ్గరలోని సుధ టాకీస్ వరకు రోడ్షో నిర్వహిస్తారు. రాత్రి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో చేవెళ్ల, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ స్థానాల్లో పార్టీపరంగా చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్షిస్తారు. -
ఆర్ ట్యాక్స్ నిజమైతే ఐటీ, ఈడీలను పంపించు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: నేడు తెలంగాణలో ఆర్ ట్యాక్స్ పేరుతో సీఎం రేవంత్రెడ్డి వసూళ్లు మొదలెట్టాడని ప్రధాని మోదీ అన్నారని..అవినీతి జరిగిందని తెలిస్తే ఐటీ, ఈడీలను రంగంలోకి దించాలి కానీ ఉత్త ఆరోపణలు చేయడం ఎందుకని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి కొత్తగూడెంలో జరిగిన రోడ్షోలో ఆయన ప్రసంగించారు. చోటేభాయ్, బడేభాయ్ ఇద్దరూ ఒక్కటేనని, బయటకు మాత్రం వేర్వేరు అన్నట్టుగా నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. వీరికి ఓటేస్తే గోదావరి నీళ్లు మనకు దక్కవని, మోటర్లకు మీటర్లు వస్తాయని హెచ్చరించారు. ఈ రెండు పార్టీ లకు ఓటేస్తే గోదావరిలో పడేసినట్టేనని వ్యాఖ్యానించారు. తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న గోదావరి నీటిని తమిళనాడుకు తరలించుకుపోయేందుకు ప్రధాని నరేంద్రమోదీ కుట్రలు చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజీ కట్టి ఈ నీటిని ఎత్తుకుపోయేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు. మన బతుకుదెరువు, మన జీవన్మరణ సమస్య అయిన గోదావరి నీటిని తీసుకుపోతాం అంటుంటే ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కొత్తగూడెం జిల్లా ఉండాలా? వద్దా? ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా.. పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలను రద్దు చేయాలని సీఎం రేవంత్రెడ్డి చూస్తున్నారని కేసీఆర్ అన్నారు. అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత రాష్ట్రాన్ని అంధకారం చేస్తోందని విమర్శించారు. కొత్తగూడెం జిల్లాను రద్దు చేయాలని సీఎం రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారని, ఈ జిల్లా ఉండాలా? వద్దా ? అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రైతుబంధు రూ.10వేలు అందిస్తే కాంగ్రెస్ పార్టీ రూ.15,000 ఇస్తామని చెప్పిందని, కల్యాణలక్ష్మి ద్వారా తాము ఆర్థికసాయం అందిస్తే, దానికి అదనంగా తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పారని, ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. తమ ప్రభుత్వం రూ.లక్ష రుణమాఫీ చేస్తే కాంగ్రెస్ ఎన్నికల హామీలో రూ. రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని ప్రకటించారని, మరి ఈ రోజు ఎంతమందికి రైతుబంధు అందింది, ఎంతమందికి తులం బంగారం ఇచ్చారు, రుణమాఫీ ఎంత అమలు చేశారు.. అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులకు ఇబ్బంది రావొద్దనే ఉద్దేశంతోనే ఖర్చుకు వెనుకాడకుండా అన్ని ప్రాంతాల్లో త్రీఫేస్ కరెంట్ ఇచ్చామని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో విద్యుత్ సమస్యల కారణంగా మోటార్లు కాలిపోతున్నాయన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఎక్కడ కాటకలిసిందని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు గురుకులాలు పెట్టి అద్భుతమైన ఫలితాలు సాధించామన్నారు. కానీ కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో కలుíÙత ఆహారం తిని భువనగిరిలో ఓ విద్యార్థి చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణిపై కుట్రలు చేస్తారు కేంద్రంలో అధికారంలో ఉన్న బడేభాయ్ ఆదేశాల మేరకు ఇక్కడి చోటే భాయ్ సింగరేణి మీద కుట్రలు చేసే ప్రమాదం ఉందని కేసీఆర్ హెచ్చరించారు. గతంలో ఆ్రస్టేలియా నుంచి అదాని దిగుమతి చేసుకున్న బొగ్గు కొనాలంటూ ప్రధాని మోదీ ఎంత ఒత్తిడి చేసినా ‘మాకు సింగరేణి బొగ్గు ఉంది.అదాని బొగ్గు అవసరం లేదు. ఒక్క టన్ను కూడా కొనను’అంటూ తెగేసి చెప్పానని కేసీఆర్ తెలిపారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని ఆదేశిస్తే.. నా తలకాయ తెగిపడ్డా మోటార్లకు మీటర్లు పెట్టనంటూ రైతుల ప్రయోజనాలు కాపాడిన చరిత్ర తనకు ఉందన్నారు. మత విద్వేషాలు రేపుతున్నారు.. తెలంగాణలో మత సామరస్యానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని కేసీఆర్ చెప్పారు. తమ హయాంలో ఏ ఒక్కరోజూ మత కలహాలు జరగలేదని గుర్తు చేశారు. కానీ ఈ రోజు హిందూ, ముస్లిం అంటూ విద్వేషాలు రేపుతున్నారని ఆయన మండిపడ్డారు. దేశంలో నరేంద్రమోదీ అంత దరిద్రమైన పాల న చేసిన మరో నేత లేడని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మతాల మధ్య పంచాయితీలు పెట్టి ఓట్లు దండుకోవడం తప్ప మరేం లేదన్నారు. బీఆర్ఎస్ గెలిస్తేనే నిధులు.. గోదావరి నీళ్లు తెలంగాణకు దక్కాలన్నా, కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు రావాలన్నా, రైతుల మోటార్లకు మీటర్లు పెట్టొద్దన్నా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీనే గెలిపించాలని కేసీఆర్ కోరారు.ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత గెలిస్తేనే ఈ ప్రాంత ప్రయోజనాలు కాపాడుకుంటామని చెప్పారు. ప్రాణాలకు తెగించి తెలంగాణ సాధించానన్నారు. ‘జబ్తక్ తెలంగాణా మే కేసీఆర్ హై, తబ్తక్ సెక్యులర్ రియాసత్ రహేగా’అంటూ మైనారిటీలకు హామీ ఇచ్చారు.
Related News by category
-
Lok sabha elections 2024: బారామతి నుంచి మెయిన్పురి దాకా...హోరాహోరీ
లోక్సభ ఎన్నికల సుదీర్ఘ ఘట్టంలో మే 7న మూడో విడత పోలింగ్కు రంగం సిద్ధమవుతోంది. ఈ విడతలో రాజకీయ ఉద్ధండులతో పాటు కొత్త ముఖాలూ బరిలో ఉన్నారు. కొల్హాపూర్లో ఛత్రపతి శివాజీ వారసునికి బీజేపీ టికెటిచి్చంది. శివమొగ్గలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ భార్య బరిలోకి ఉన్నారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ లోక్సభ టికెట్ తీసుకున్నారు. మెయిన్పురిలో డింపుల్ భాభీ మరోసారి మేజిక్ చేసేందుకు సిద్ధమంటున్నారు. ఇలా మూడో దశ బరిలో ఆసక్తి రేపుతున్న కీలక స్థానాలపై ఫోకస్... బారామతి వదినా మరదళ్ల వార్! దేశమంతటా ఆసక్తి రేపుతున్న నియోజకవర్గమిది. మరాఠా రాజకీయ యోధుడు శరద్ పవార్ ముద్దుల తనయ సుప్రియా సులేపై వదిన సునేత్రా పవార్ పోటీకి సై అంటున్నారు. బాబాయి శరద్ పవార్పై తిరుగుబావుటా ఎగరేసి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని దక్కించుకున్న అజిత్ పవార్ తన చెల్లెలిపై ఏకంగా భార్యనే రంగంలోకి దించారు. సుప్రియ ఇక్కడ సిట్టింగ్ ఎంపీ. ఎన్సీపీ (శరద్) వర్గానికి సారథ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ నేత కంచన్ రాహుల్ కూల్పై 1,55,774 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈసారి వదినా మరదళ్ల మధ్య హై ఓల్టేజ్ పోటీ నెలకొంది. సునేత్రకు బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్)లతో కూడిన మహాయుతి కూటమి బలమైన దన్నుంది. ఇక సుప్రియ కాంగ్రెస్, శివసేన (ఠాక్రే) ఎన్సీపీ (పవార్)తో కూడిన మహా వికాస్ అగాడీ తరఫున వదినకు సవాలు విసురుతున్నారు. బీఎస్పీ నుంచి ప్రియదర్శని కోక్రే కూడా రేసులో ఉన్నారు. విదిశ మామాజీ ఈజ్ బ్యాక్ మధ్యప్రదేశ్కు 20 ఏళ్లకు పైగా సీఎం. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి బంపర్ మెజారిటీ సాధించి పెట్టారు. ఇంతటి రికార్డున్నా శివరాజ్సింగ్ చౌహాన్కు మళ్లీ సీఎంగా చాన్స్ రాలేదు. అయితే బీజేపీ అనూహ్యంగా ఆయనను విదిశ నుంచి లోక్సభ బరిలో దింపింది. ‘‘శివరాజ్ను ఢిల్లీకి తీసుకెళ్తా. కేంద్ర ప్రభుత్వంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారు’ అన్న మోదీ ప్రకటనతో విదిశ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మామాజీగా ప్రసిద్ధుడైన శివరాజ్ ఇక్కడ 1991 నుంచి 2004 దాకా వరుసగా ఐదుసార్లు ఎంపీగా గెలవడం విశేషం. బీజేపీ దిగ్గజాలు వాజ్పేయి ఒకసారి, సుష్మా స్వరాజ్ రెండుసార్లు ఇక్కడ విజయం సాధించారు. ఈ బీజేపీ కంచుకోటలో కాంగ్రెస్ నుంచి ప్రతాప్ భాను శర్మ బరిలో ఉన్నారు. ఆయన కూడా 1980, 1984లో ఇక్కడ రెండుసార్లు గెలిచారు. ఏకంగా 40 ఏళ్ల తర్వాత మళ్లీ బరిలో దిగుతున్నారు!ఆగ్రా త్రిముఖ పోరు యూపీకి దళిత రాజధానిగా పేరొందిన ఆగ్రాలో ముక్కోణపు పోరు నెలకొంది. సిట్టింగ్ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ బఘెల్పై బీఎస్పీ నుంచి పూజా అమ్రోహి, సమాజ్వాదీ నుంచి సురేశ్ చంద్ర కర్దామ్ బరిలో ఉన్నారు. మోదీ–యోగీ ఫ్యాక్టర్, అయోధ్య రామమందిరం, సంక్షేమ పథకాలనే బఘెల్ నమ్ముకున్నారు. వైశ్యులు, బ్రాహ్మణులు, పంజాబీలు, యాదవేతర ఓబీసీలతో పాటు దళితుల్లో ఒక వర్గం కమలానికి మద్దతిస్తుండటం ఆయనకు కలిసి రానుంది. దళితుల ఓటు బ్యాంకుపై పూజ, జాతవ్లు, ముస్లిం ఓట్లపై కర్దామ్ ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడి 20.57 లక్షల ఓట్లలో 30 శాతం దళితులే. వారిలోనూ మూడొంతుల మంది జాతవ్ దళితులు! బీఎస్పీ, ఎస్పీ అభ్యర్థులిద్దరిదీ ఇదే సామాజికవర్గం. ప్రత్యర్థుల నాన్ లోకల్ విమర్శలను పూజ దీటుగా తిప్పికొడుతున్నారు. ఈ స్థానం ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోట. రామమందిర ఉద్యమంతో 1990 నుంచి బీజేపీ గుప్పిట్లోకి చేరింది. మధ్యలో రెండుసార్లు మాత్రం ఎస్పీ నుంచి బాలీవుడ్ నటుడు రాజ్ బబ్బర్ గెలిచారు.శివమొగ్గ బీజేపీకి పక్కలో బల్లెం కర్ణాటక దిగ్గజ నేత బీఎస్ యడ్యూరప్ప కుమారుడు బీవై రాఘవేంద్ర మరోసారి శివమొగ్గలో బరిలో నిలిచారు. కన్నడ సూపర్స్టార్ శివరాజ్కుమార్ భార్య గీతకు కాంగ్రెస్ టికెటివ్వడంతో రాజకీయం వేడెక్కింది. పైగా బీజేపీతో 50 ఏళ్లకు పైగా అనుబంధమున్న అగ్ర నేత కేఎస్ ఈశ్వరప్ప స్వతంత్ర అభ్యరి్థగా బరిలో నిలిచి రాఘవేంద్రకు పక్కలో బల్లెంలా మారారు. ఈ ముక్కోణపు పోటీ అందరినీ ఆకర్షిస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్న ఈశ్వరప్ప తన కుమారుడు కంతేశ్కు ఎంపీ టికెట్ కోసం విఫలయత్నం చేశారు. యడ్యూరప్పతో మొదట్నుంచీ ఉప్పు నిప్పుగా ఉన్న ఈశ్వరప్పకు ఈ పరిణామం తీవ్ర ఆగ్రహం కలిగించింది. రాష్ట్ర బీజేపీ చీఫ్, యడ్యూరప్ప కుమారుడు విజయేంద్రపై తీవ్ర విమర్శలకు దిగి పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. తాను మోదీకి వీర విధేయుడినంటూ ఆయన బొమ్మతోనే ఈశ్వరప్ప జోరుగా ప్రచారం చేస్తుండటంతో బీజేపీ నేతలు తలపట్టుకుంటున్నారు!కొల్హాపూర్.. బరిలో ఛత్రపతి ఛత్రపతి శివాజీ వంశీయుడిని కాంగ్రెస్ బరిలోకి దించడంతో కొల్హాపూర్లో పోటీ కాక పుట్టిస్తోంది. శివసేన సిట్టింగ్ ఎంపీ సంజయ్ మాండ్లిక్ ఈసారి శివసేన (షిండే) నేతగా మహాయుతి కూటమి తరఫున మళ్లీ బరిలో ఉన్నారు. దాంతో కాంగ్రెస్, శివసేన (ఠాక్రే) ఎన్సీపీ (శరద్)లతో కూడిన మహా వికాస్ అగాడీ వ్యూహాత్మకంగా ఛత్రపతి రాజర్షి సాహు మహారాజ్కు టికెటిచ్చింది. ఆయన కాంగ్రెస్ అభ్యరి్థగా బరిలో ఉన్నారు. అయితే ఆయన శివాజీకి నిజమైన వారసుడు కాదన్న మాండ్లిక్ వ్యాఖ్యలతో అగ్గి రాజుకుంది. వీటిపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అధికార కూటమి వెనక్కు తగ్గింది. ‘గాడీ (సింహాసనం)ని గౌరవించండి. కానీ ఓటు మాత్రం మోడీకే వేయండి’ అంటూ కొత్త తరహా ప్రచారం మొదలుపెట్టింది. రెండు కూటముల మధ్య ఇక్కడ టఫ్ ఫైట్ జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, ఎన్సీపీలకు గట్టి పట్టుండటం సాహు మహారాజ్కు కలిసొచ్చే అంశం.మెయిన్పురి.. భాభీ సవాల్ ఈ స్థానం ఎస్పీ దిగ్గజం దివంగత ములాయం సింగ్ యాదవ్ కంచుకోట. ములాయం మరణానంతరం 2022లో ఉప ఎన్నికలో ఆయన కోడలు, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ సత్తా చాటారు. 2.88 లక్షల ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి రఘురాజ్ సింగ్ శాక్యను ఓడించారు. ఈసారి మళ్లీ బీజేపీకి సవాలు విసురుతున్నారు. బీజేపీ నుంచి యూపీ పర్యాటక మంత్రి జైవీర్ సింగ్ ఠాకూర్ బరిలో ఉన్నారు. ఫిరోజాబాద్కు చెందిన ఠాకూర్ బలమైన నాయకుడు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా గెలిచారు. బీఎస్పీ కూడా శివ ప్రసాద్ యాదవ్ రూపంలో బలమైన అభ్యరి్థని రంగంలోకి దించడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. బీఎస్పీ నుంచి మధ్యలో బీజేపీలోకి వెళ్లిన శివప్రసాద్ అనంతరం సొంత పార్టీ కూడా పెట్టి చివరికి బీఎస్పీ గూటికే చేరారు. ఇక్కడ మోదీ–యోగి ఫ్యాక్టర్, అభివృద్ధి నినాదంతో సమాజ్వాదీకి ఎలాగైనా చెక్ పెట్టేందుకు కమలనాథులు తీవ్రంగా ప్రయతి్నస్తున్నారు. కానీ డింపుల్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దే..: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రిజర్వేషన్లను రద్దు చేయడమే ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంత మని, దాన్ని అమలు చేయడమే బీజేపీ ఎజెండా అని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ వేసుకున్న ప్రణాళికలను మాత్రమే తాను ప్రస్తావించానని.. ఆధా రాలతో సహా తాను చెప్తున్న అంశాలపై కేంద్రం వివరణ ఇవ్వడంగానీ, సవరించుకోవడం గానీ చేయాలని స్పష్టం చేశా రు. రేవంత్రెడ్డి బుధవారం సాయంత్రం తన నివాసంలో మీడి యాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..‘‘సమయం, సందర్భం, అవకాశం వచ్చిన ప్రతీ సందర్భంలో రాజ్యాంగాన్ని మార్చి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలనే ఎజెండాతోనే బీజేపీ పనిచేస్తోంది. ఆ విషయాన్నే నేను ప్రస్తావించడంతో దేశవ్యాప్తంగా చర్చ జరుగు తోంది. తమ ఎన్నికల ప్రయోజనాలకు దెబ్బతగులుతుందనే భయంతో కప్పి పుచ్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే కేంద్ర హోంశాఖ ఫిర్యాదు చేసి నాపై అక్రమ కేసు నమోదు చేసింది. కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి కూడా నోటీసులు ఇచ్చారు. మోదీ, అమిత్ షా, బీజేపీ నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోకుండా కేసు నమోదు చేశారు. 2000వ సంవత్సరంలో బీజేపీ ప్రధాని వాజ్పేయి, 2002లో జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ చేసిన సూచనలను బీజేపీ ప్రస్తుతం రహస్య ఎజెండాగా మార్చుకుంది. వాటి ఆధారంగా 2024 పార్లమెంటు ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజారిటీ వస్తే అమలు చేసేందుకు బీజేపీ వేసుకున్న ప్రణాళికలను మాత్రమే నేను ప్రస్తావించా. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నేను చేస్తున్న ఆరోపణలపై తగిన సమాధానం ఇవ్వాల్సింది పోయి.. విపక్షాలపై ఈడీ, సీబీఐ, ఐటీలను ప్రయోగించిన తరహాలో నాపై ఢిల్లీ పోలీసులను ప్రయోగిస్తున్నారు.లొంగిపోతానని అనుకుంటున్నారా?ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం కొట్లాడే నేను లొంగిపోతానని ఢిల్లీ సుల్తానులు ఎలా అనుకుంటున్నారు? బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికే నేను ప్రయత్నం చేస్తున్నా. రిజర్వేషన్ల రద్దుకు సంబంధించి గతంలో పార్లమెంటులో రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ప్రసంగంలో చెప్పించడంతోపాటు, కమిషన్ నియమిస్తున్నట్టు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. వెంకటాచలయ్య కమిషన్ రాజ్యాంగాన్ని ఎలా సవరించాలో నివేదిక కూడా ఇచ్చింది. 2004లో యూపీఏ–1 అధికారంలోకి రావడంతో రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం నిలిచిపోయింది. ఆర్ఎస్ఎస్ మూలాలున్న గోల్వాల్కర్, సిద్ధాంతకర్త ఎన్జీ వైద్య, లోక్సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర మాజీ మంత్రి అనంత్కుమార్ హెగ్డే తదితరులు రిజర్వేషన్ల రద్దుపై పలు సందర్భాల్లో ప్రకటనలు కూడా చేశారు. దళితులకు హక్కులు, కుల ఆధారిత రిజర్వేషన్లు అవసరం లేదని.. రిజర్వేషన్లు రద్దు చేయాలనేది బీజేపీ ఉద్దేశంగా ఉంది. బీసీలకు 27శాతం రిజర్వేషన్లు కల్పించాలనే మండల్ కమిషన్ సిఫారసు అమలుకు వీపీ సింగ్ ప్రభుత్వం ప్రయత్నిస్తే.. అద్వానీ నేతృత్వంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశాయి. ఆ రిజర్వేషన్లు న్యాయ సమ్మతమేనని, అయితే 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ 50శాతం పరిమితిని తొలగించాలంటే.. బీసీ జనాభాను లెక్కించాలన్న కోర్టు సూచన మేరకే భారత్ జోడో యాత్రలో రాహుల్గాంధీ కుల గణనకు హామీ ఇచ్చారు. తెలంగాణలో బీసీ జన గణన కోసం మా ప్రభుత్వం నిధులు కూడా కేటాయించింది.రిజర్వేషన్ల రద్దుకు ప్రణాళికలుకాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన చోట కులగణన చేస్తామనే విధానం తీసుకోవడంతో బీజేపీ అప్రమత్తమైంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు పెంచుతుందనే ఉద్దేశంతో లోక్సభలో మూడింట రెండొంతుల మెజారిటీ కోసం ప్రయత్నిస్తోంది. మరోవైపు పార్టీలను చీల్చి ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంది. 17వ లోక్సభలో ఆర్టికల్ 370రద్దు, సీఏఏ అమలు వంటి ఆర్ఎస్ఎస్ ఎజెండాను పూర్తి చేసింది. 18వ లోక్సభలో హిందూ దేశంగా భారత్, రిజర్వేషన్ల రద్దుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. ఈ విషయాలను ప్రస్తావించినందునే కేంద్ర ప్రభుత్వం నాపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసింది. అమిత్ షా నియంత్రణలో పనిచేసే ఢిల్లీ పోలీసులను ప్రయోగించి, నాపై ఒత్తిడి తెచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా కుట్ర జరుగుతోంది.ఎటువైపు నిలవాలో తేల్చుకోండిబీజేపీకి వేసే ప్రతీ ఓటు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల రద్దుకు దారితీస్తుంది. ప్రస్తుత ఎన్నికలు సంక్షేమం, అభివృద్ధి చుట్టూ జరగడం లేదు. రాజ్యాంగాన్ని మార్చాలా, వద్దా అనే అంశం చుట్టూనే తిరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎటువైపు నిలబడాలో దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు తేల్చుకోవాలి. పోలీసులతో బెదిరించాలని మోదీ, అమిత్ షా చూస్తే అది కుదరని పని. గతంలో రిజర్వేషన్లు రద్దు చేయాలనే బీజేపీ ఆలోచనల అమలుకు రాజ్యాంగ పరిమితులు అడ్డుపడ్డాయి. అందుకే ఇప్పుడు 400 సీట్ల కోసం అరాచకాలు, అభ్యర్థులను భయపెట్టి ఏకగ్రీవం చేసుకుంటున్నారు..’’ అని రేవంత్ ఆరోపించారు.అభివృద్ధి కోరితే.. ‘గాడిద గుడ్డు’ ఇచ్చింది– కేంద్ర ప్రభుత్వంపై ‘ఎక్స్’ వేదికగా సీఎం రేవంత్రెడ్డి వ్యంగ్యాస్త్రాలుకేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందంటూ సీఎం రేవంత్రెడ్డి ‘ఎక్స్’ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘పాలమూరు–రంగారెడ్డికి జాతీయ హోదా అడిగితే బీజేపీ ప్రభుత్వం గాడిద గుడ్డు ఇచ్చింది. రాష్ట్రానికి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కృష్ణా, గోదావరి నదుల్లో వాటాల పంపకం, మేడారం సమ్మక్క–సారక్క జాతరకు జాతీయహోదా వంటివి అడిగితే గాడిద గుడ్డు ఇచ్చింది. మొత్తంగా ‘తెలంగాణ అభివృద్ధికి బీజేపీ ప్రధాన అడ్డు.. పదేండ్ల మోదీ పాలనలో తెలంగాణకు ఇచ్చింది పెద్ద గాడిద గుడ్డు’’ అని పోస్ట్ చేశారు. -
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
లక్కీ డ్రాలో బహుమతులు గెలుచుకోవచ్చంటే సామాన్యుల కాలు కదలకుండా ఉంటుందా..? మధ్యప్రదేశ్లోని భోపాల్ లోక్సభ స్థానంలో ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు ఇలాంటి ఆఫరే ఇస్తున్నారు. మూడో దశలో భాగంగా ఈ నెల 7న భోపాల్లో పోలింగ్ జరుగుతోంది. ఆ రోజున ఓటేసే వారి పేర్లనుంచి ప్రతి మూడు గంటలకు ఒకసారి లక్కీ డ్రా తీయనున్నారు. విజేతలకు వజ్రపు ఉంగరాలు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు తదితర కానుకలిస్తారట! ‘‘నియోజకవర్గవ్యాప్తంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉదయం 10, మధ్యాహ్నం 3, సాయంత్రం 6 గంటలకు లక్కీ డ్రా తీసి విజేతలకు బహుమతులిస్తం. పోలింగ్ మర్నాడు మెగా డ్రా తీసి విజేతలకు మరింత పెద్ద బహమతులిస్తాం’’అని జిల్లా ఎన్నికల అధికారి కౌసలేంద్ర విక్రమ్ సింగ్ ప్రకటించారు. ఓటింగ్ పెంచేందుకే.. మధ్యప్రదేశ్లో ఇప్పటిదాకా జరిగిన రెండు దశల్లో పోలింగ్ 2019తో పోలిస్తే సగటున 8.5 శాతం తగ్గింది. 2019లో భోపాల్లో 65.7 శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి ఎండలు విపరీతంగా ఉన్నందున ఓటర్లు పెద్దగా ఇల్లు కదలకపోవచ్చన్న ఆందోళనలున్నాయి. దీంతో ఎలాగైనా ఓటింగ్ను పెంచాలని ఈసీ కృత నిశ్చయంతో ఉంది. భోపాల్ నియోజకవర్గంలో 3,097 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి బూత్ వద్ద ఒక బీఎల్వో, వలంటీర్ను లక్కీ డ్రా కోసం నియమించారు. ఓటేశాక అక్కడి కూపన్ బుక్లెట్లో పేరు, మొబైల్ నంబర్ రాసి రసీదు తీసుకోవాలి. బహమతుల ఖర్చును కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కంపెనీలు భరిస్తున్నాయి. మెగా డ్రా కోసం డైమండ్ ఉంగరాలు, ల్యాప్టాప్లు, ఫ్రిజ్లు ఎనిమిది డిన్నర్ సెట్లు, రెండు మొబైల్ ఫోన్లు రెడీగా ఉన్నాయి. దీంతోపాటు ప్రతి పోలింగ్ కేంద్రంలో తొలి ఓటర్ను గౌరవించేందుకు ప్రత్యేకంగా ఏదైనా చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
పల్లవి శ్రీనివాస్ డెంపో. దక్షిణ గోవా నుంచి బీజేపీ టికెట్పై లోక్సభ బరిలో ఉన్నారు. గోవాలో బీజేపీ తరఫున లోక్సభ ఎన్నికల బరిలోకి దిగిన తొలి మహిళగా నిలిచారు. అఫిడవిట్లో పల్లవి ప్రకటించిన ఆస్తులు చూసి అంతా నోరెళ్లబెట్టారు. భర్తతో కలిపి ఏకంగా రూ.1,361 కోట్ల ఆస్తులు వెల్లడించారు. మూడో దశలో రేసులో మొత్తం 1352 మంది అభ్యర్థుల్లో అత్యంత సంపన్నురాలిగా నిలిచారు. గోవా ఎన్నికల చరిత్రలో అత్యంత సంపన్న వ్యక్తి పల్లవే. ఏ రాజకీయానుభవం లేని కుటుంబానికి చెందిన ఆమెను ఎంపిక చేసుకోవడానికి ఆమె దాతృత్వ నేపథ్యమే కారణం కావచ్చంటున్నారు...దాతృత్వం నుంచి రాజకీయాలకు 49 ఏళ్ల పల్లవి స్వస్థలం గోవాలోని మార్గావ్. టింబ్లో కుటుంబంలో జని్మంచారు. రసాయన శాస్త్రంలో డిగ్రీ, పుణెలోని ఎంఐటీ నుంచి ఎంబీఏలో పీజీ చేశారు. 1997లో డెంపో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ శ్రీనివాస్ డెంపోను పెళ్లాడారు. వారి కుటుంబం ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో లేదు. డెంపో గ్రూప్ మైనింగ్ వ్యాపారంతో మొదలుపెట్టి ఫుడ్ ప్రాసెసింగ్, షిప్ బిల్డింగ్, న్యూస్ పేపర్ పబ్లిíÙంగ్, పెట్రోలియం, కోక్, రియల్ ఎస్టేట్ తదితరాలకు విస్తరించింది. పల్లవి ప్రస్తుతం డెంపో ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మీడియా, రియల్ ఎస్టేట్ విభాగాలను పర్యవేక్షిస్తున్నారు. డెంపో చారిటీస్ ట్రస్టీగా దశాబ్దాలుగా సేవా కార్యక్రమాల్లో ఉన్నారు. ప్రత్యేకించి గోవాలో బాలికల విద్యను పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. కొత్త ప్రదేశాలను చూడటం, కొత్త వంటకాలను ప్రయతి్నంచడం తన అభిరుచి అంటారామె. ఇప్పుడు రాజకీయాల్లోకి దిగి మరో ప్రయోగం చేయబోతున్నారు. ఎన్నికల బాండ్ల రగడ... 2022 జనవరిలో గోవాలో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం నెల ముందు పల్లవి భర్త శ్రీనివాస్ వ్యక్తిగతంగా రూ.1.25 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసినట్లు వెల్లడవడం కలకలం రేపింది. ఇక గోవా కార్బన్ లిమిటెడ్, దేవశ్రీ నిర్మాణ్ ఎల్ఎల్పి, నవ్హింద్ పేపర్స్ అండ్ పబ్లికేషన్స్తో సహా డెంపో, గ్రూప్ అనుబంధ సంస్థలు 2019 నుంచి 2024 మధ్య రూ.1.1 కోట్ల విలువైన బాండ్లు కొనుగోలు చేశాయి. ఇవన్నీ బీజేపీ ఖాతాలోకే వెళ్లాయి.బీజేపీ సిద్ధాంతాలు నమ్మి... దక్షిణ గోవా కాంగ్రెస్ కంచుకోట. 2019లో ఈ స్థానాన్ని బీజేపీ కేవలం 9 వేల పై చిలుకు ఓట్ల తేడాతో చేజార్చుకుంది. ఈ సారి ఎలాగైనా ఇక్కడ నెగ్గి తీరాలని పట్టుదలగా ఉంది. క్యాథలిక్ క్రిస్టియన్ల ఓట్లపై పల్లవి ప్రధానంగా దృష్టి పెట్టారు. కాంగ్రెస్ కూడా నాలుగు సార్లు గెలిచిన సిట్టింగ్ ఎంపీ ఫ్రాన్సిస్కో సార్డినాను అనూహ్యంగా పక్కనబెట్టి మాజీ నేవీ అధికారి కెపె్టన్ విరియాటో ఫెర్నాండెజ్ను బరిలోకి దించింది. అయితే ఏకంగా 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ చేయడం వంటివన్నీ ఆ పారీ్టకి కలిసొచ్చేలా ఉన్నాయి. ఆప్, గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్పీ) వంటి ఇండియా కూటమి భాగస్వాముల దన్నుతో బీజేపీని కాంగ్రెస్ ఢీకొంటోంది. స్థానిక రివల్యూషనరీ గోవన్స్ (ఆర్జీ) పార్టీ అభ్యర్థి రూబర్ట్ పెరీరియా ఆ రెండింటికీ సవాలు విసురుతున్నారు. అయినా పల్లవి మాత్రం విజయంపై ధీమాగా ఉన్నారు. ‘‘రాజకీయాలు నా మనసులో ఎప్పుడూ లేవు. మూడు దశాబ్దాలుగా కుటుంబ వ్యాపారాలు, సేవా కార్యకలాపాల్లో బిజీగా ఉన్నాను. అయితే దేనికైనా ఒక ఆరంభమంటూ ఉంటుంది. రాజకీయాల్లో ఇది నా తొలి అడుగు. బీజేపీ సిద్ధాంతాన్ని నమ్మి ముందడుగు వేస్తున్నాను’’ అంటున్న ఆమె కాంగ్రెస్కు కంచుకోటలో చరిత్ర సృష్టిస్తారేమో చూడాలి! – సాక్షి, నేషనల్ డెస్క్ -
నేహా కుటుంబానికి అండగా అమిత్షా..
కర్ణాటక రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విద్యార్థిని నేహా హిరేమఠ తండ్రి, కాంగ్రెస్ కౌన్సిలర్ నిరంజన్ హిరేమఠతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఈ భేటీలో నేహా హీరేమఠ మరణం విషయంలో వారి కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా నిరంజన్ హిరేమఠ మాట్లాడుతూ తనని కలిసేందుకు వచ్చిన అమిత్షాకు తన కుమార్తె నేహా హీరేమత్ మరణంపై న్యాయం చేయాలని కోరుతూ మెమోరాండం ఇచ్చినట్లు తెలిపారు.ఇలాంటి కేసుల్లో ఉరిశిక్ష ఉండేలా చూడాలని, ఇలాంటి కేసులను 90 నుంచి 120 రోజుల్లో పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేయాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. నిరంజన్ హిరేమఠ విజ్ఞప్తితో నేహా మరణంపై తగిన న్యాయం చేస్తామని అమిత్ షా ఇచ్చినట్లు నేహా హిరేమఠ తండ్రి నిరంజన్ హిరేమఠ వెల్లడించారు
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
నేహా కుటుంబానికి అండగా అమిత్షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కుమార్తెకు అరుదైన గౌరవం!
వరల్డ్కప్కు సెలక్టయ్యాడు.. తొలిసారి డకౌటయ్యాడు! వీడియో వైరల్
ఈవీఎంలపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
ఎందుకంత ఓవరాక్షన్.. వాళ్లతో పోలిస్తే నువ్వెంత?: పూరి
వడగళ్ల వానతో దెబ్బతిన్న విమానం.. ఒడిశాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
Photos
View allVideo
View allతప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement