‘పోలవరం’పై రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు | Sakshi
Sakshi News home page

‘పోలవరం’పై రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

Published Fri, Feb 3 2017 2:26 PM

‘పోలవరం’పై రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు - Sakshi

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సుప్రీంకోర్టు నాలుగు రాష్ట్రాలకు నోటీసులు జారీచేసింది. ప్రాజెక్టుకు భూసేకరణ విషయంలో అటవీ చట్టాల అమలుకానీ, నిర్వాసితులకు సరైన పరిహారంగానీ చెల్లించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయంటూ రేలా అనే సంస్థ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌)ను అ‍త్యున్నత న్యాయస్థానం శుక్రవారం విచారించింది.

సంబంధిత చట్టాలు సరిగా అమలు కావడంలేదన్న పిటిషనర్‌ వాదనతో ఏకీభవించిన కోర్టు.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు నోటీసులు జారీచేసింది. చట్టాల అమలు తీరుపై సమగ్ర వివరాలు అందించాలని ఆయా రాష్ట్రాలను ఆదేశించింది.

Advertisement
Advertisement