స్టేషన్ ఘన్పూర్ బహిరంగ సభలో వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి
* టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపు
* ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నల్లా సూర్యప్రకాశ్ను గెలిపించాలని విజ్ఞప్తి
వరంగల్ నుంచి ‘సాక్షి’ప్రతినిధి: మంత్రిమండలిలో తనకు తొత్తుగా ఉండే వ్యక్తిని పెట్టుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మోజుపడి అహంకారంతో తీసుకున్న నిర్ణయం వల్లే వరంగల్ పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక వచ్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి దుయ్యబట్టారు.
అందువల్ల ఉప ఎన్నికలో కేసీఆర్, టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం స్టేషన్ ఘన్పూర్ పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో పొంగులేటి మాట్లాడుతూ రైతులకు లక్ష రూపాయల చొప్పున రుణమాఫీ చేస్తానన్న కేసీఆర్ ఆ హామీని మరచిపోయారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం బంగారు తెలంగాణకు బదులు ఆత్మహత్యల రాష్ట్రంగా మారిందని విమర్శించారు.
రాష్ట్రంలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబులు ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు మండుటెండలో పాదయాత్ర చేశారని పొంగులేటి గుర్తుచేశారు. ప్రజల దీవెనలతో ముఖ్యమంత్రి అయ్యాక అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి అంటే వైఎస్సార్ అనే తరహాలో పరిపాలించారన్నారు.
2004 కంటే మందు ఉమ్మడి రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు జరిగేవని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక టీఆర్ఎస్ పాలనలో మళ్లీ రైతు ఆత్మహత్యలు తెరమీదకు వచ్చాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పరిపాలన దుర్మార్గంగా ఉందని, ఆయనకు ఓటు అడిగే అర్హతే లేదని పొంగులేటి విమర్శించారు. ప్రాణం పోసిన నేత కుటుంబాన్నే జైలుకు పంపించిన కాంగ్రెస్ పార్టీది భస్మాసుర హస్తమని, ఆ పార్టీకి ప్రజలు ఓటు వేయవద్దని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నేరవేర్చకుండా రాష్ట్రంలో కుటుంబ పాలనను తెచ్చిందని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వైఎస్సార్ అభిమానులకు భరోసా కల్పించడం కోసం వైఎస్ జగన్ వచ్చారని...ఉప ఎన్నికలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ను గెలిపించాలని కోరారు.
కేసీఆర్ మోజు వల్లే ఉప ఎన్నిక
Published Fri, Nov 20 2015 1:34 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement