Sakshi News home page

నేడు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేయనున్న జగన్‌

Published Mon, Jul 17 2017 3:07 AM

నేడు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేయనున్న జగన్‌ - Sakshi

- పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి రానున్న ప్రతిపక్షనేత
- ఎన్డీఏ అభ్యర్థి కోవింద్‌కు ఇప్పటికే మద్దతు ప్రకటించిన వైఎస్సార్‌సీపీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలతో కలసి సోమవారం వెలగపూడిలోని అసెంబ్లీకి చేరుకుని ఓటుహక్కు వినియోగించుకుంటారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆ ప్రకారమే తమ ఎమ్మెల్యేలంతా ఓటింగ్‌లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఓటింగ్‌లో పాల్గొనడానికి రావాల్సిందిగా వైఎస్సార్‌సీపీ నుంచి పార్టీ ఎమ్మెల్యేలందరికీ ఇప్పటికే వర్తమానం వెళ్లింది.  వారంతా విజయవాడ చేరుకుంటున్నారు. జగన్‌ అసెంబ్లీలో తన ఓటు హక్కును వినియోగించుకున్న తరువాత అక్కడే తన చాంబర్‌లో కొద్దిసేపు ఉండి పోలింగ్‌ను పర్యవేక్షిస్తారు.

Advertisement
Advertisement