లండన్: దివంగత ప్రధాని ఇందిరా గాంధీ హత్యోదంతానికి సంబంధించిన సంచలన విషయం ఒకటి వెల్లడైంది. ఇందిర హత్యకు గురవుతారన్న సంగతి ఓ వ్యక్తికి ముందే తెలుసని బ్రిటన్ గురువారం విడుదల చేసిన ఓ డాక్యుమెట్ లో బయటపడింది. ఆ వ్యక్తి పేరు జగ్జీత్ సింగ్ చౌహాన్. ఇతను యూకేలో ఉంటూ ఖలిస్థాన్ ఉద్యమంపై అనేక ఆందోళనలను చేశాడు. 'సిఖ్ రిపబ్లిక్ ఆఫ్ ఖలిస్తాన్' పేరుతో సంస్థను స్థాపించిన చౌహాన్.. పలు మార్లు సంచలన ప్రకటనలు చేసేవాడు.
ఇందిరా గాంధీ మరొకొద్ది నెలల్లో హత్యకు గురవుతుందనే విషయం జగ్జీత్ సింగ్ చౌహాన్ కు తెలుసని, ఆయన ప్రకటనలు బ్రిటన్, భారత్ ల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపేవిగా ఉండేవని, అందుకే నాటి బ్రిటన్ ప్రధాని మార్గరెట్ థాచర్ చౌహాన్ పై చర్యలకు ఉపక్రమించిందని డాక్యుమెంట్లలో వెల్లడైంది. భారత ప్రభుత్వం కూడా చౌహాన్ పై బ్రిటన్ కు ఫిర్యాదు చేసినట్లు, ఇందిరతోపాటు ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ కూడా మరణిస్తాడని చౌహాన్ విచారణాధికారులకు చెప్పినట్లు డాక్యుమెంట్ల ద్వారా తెలిసింది.
ఎవరీ చౌహాన్?
ఖలిస్థాన్ ను ప్రత్యేక దేశంగా పరిగణించాలంటూ ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తుల్లో ముఖ్యుడు జగ్జీత్ సింగ్ చౌహాన్. పంజాబ్ లో పుట్టిపెరిగిన ఇతను వైద్య విద్య పూర్తిచేసి డాక్టర్ గా సేవలందిచేవాడు. కొద్ది కాలం తర్వాత రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. పంజాబ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గానూ పనిచేసిన చౌహాన్.. 1971లో లండన్ కు వలసవెళ్లారు. అక్కడ 'సిఖ్ రిపబ్లిక్ ఆఫ్ ఖలిస్తాన్' సంస్థ ద్వారా ఖలిస్థాన్ ఉద్యమాన్ని కొనసాగించారు. ప్రత్యేక ఖలిస్థాన్ కోసం పాక్, అమెరికా, కెనడాల మద్దతు కూడగట్టేందుకు విఫలయత్నం చేశారు. 2001లో ఇండియాకు తిరిగొచ్చిన ఆయన ఖల్సా రాజ్ పార్టీని స్థాపించారు. ఆ పార్టీ పెద్దగా జనాదరణ పొందలేకపోయింది. 2007లో 78 ఏళ్ల వయులో చౌహాన్ మరణించారు.
ఇందిరాగాంధీ హత్య అతనికి ముందే తెలుసు
Published Fri, Jul 22 2016 6:19 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement