ముంబై: ఇన్ఫోసిస్ సంస్థలో ఇటీవల చెలరేగిన విభేదాల నేపథ్యంలో ఎలాంటి సమస్యలు లేవని బోర్డ్ వివరణ ఇచ్చింది. వ్యవస్థాపకులకు బోర్డ్కుమధ్య ఎలాంటి విభేదాలు లేవని ఇన్ఫీ ఛైర్మన్ శేషపాయి స్పష్టం చేశారు. ముఖ్యంగా సంస్థ సీఈవో విశాల్ సిక్కా వేతనం సరియైనదేనని తెలిపారు. అలాగే బోర్డు పారదర్శకతకు, కార్పొరేట్ పాలనకు వచ్చిన ప్రమాదమేమీలేదని వివరణ ఇచ్చారు. అన్ని బోర్డు నిర్ణయాల మేరకు జరిగినట్టు తెలిపారు. ఇది బోర్డువార్ గా చూడొద్దని కోరారు. వ్యవస్థాపకులు వ్యక్తం చేసిన భిన్నాభిప్రాయాలు సంస్థ అభివృద్ధికోసం చేసినట్టుగా భావించాలన్నారు. ఈ సందర్భంగా తమకు అండగా నిలిచిన వాటాదారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సంస్థలో కార్పొరేట్ నైతికత కు పూర్తిగా కట్టుబడి ఉన్నట్టు హామీఇచ్చారు.
ముఖ్యంగా పునీత సిన్హా, ఇండిపెండెంట్ డైరెక్టర్గా ప్రహ్లాద్ నియామకాన్ని పూర్తిగా సమర్ధించుకున్నారు. ఒక మహిళ ప్రొఫెషన్ ను ఆమె జీవిత భాగస్వామి(జయంత్ సిన్హా) వృత్తి ఆధారంగా చూడడం సరియైంది కాదని వ్యాఖ్యానించారు. వారు పూర్తిగా అన్ని రకాల అర్హతలు కలిగి ఉన్నారని చెప్పారు. అలాగే ఈ నియామకాలను ఒక పద్ధతి ప్రకారమే జరిగినట్టు తెలిపారు. వారు బోర్డులో ఉండడం తమకు గర్వకారణం మన్నారు. తమకు పటిష్టమైన ఇంటర్నెల్ ఆడిట్ కమిటీ ఉందని చెప్పారు. ఈ మేరకు బోర్డులో నిర్ణయాలు కూడా తీసుకుంటామని చెప్పారు. ఆర్థిక వ్యవహారాల్లో గోల్డెన స్టాండర్డ్స్ ను పాటిస్తున్నామని తెలిపారు.
అలాగే ప్రధానంగా సెవరెన్స్ ప్యాకేజీలపై వచ్చిన ఆరోపణలు బాధ కలిగించాయన్నారు. అయితే కెన్నడీ సహా అన్ని ప్యాకేజీలు కూడా సరియైనవేనని చెప్పుకొచ్చారు. ఇన్పోసిస్ లో నెలకొన్న సంక్షోభంపై నెలకొన్న ఆందోళన నేపథ్యంలో సోమవారం ముంబైలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన శేషసాయి ఈ వివరణ ఇచ్చారు.
మరోవైపు ఈ సమావేశంలో పాల్గొన్న సీఈవో విశాల్ సిక్కా ఇన్ఫీలో నెలకొన్న ముసలంపై స్పందించారు. తమకు వ్యవస్థాపకులు నారాయణ మూర్తితో హృదయపూర్వక సంబంధాలు ఉన్నాయని విశాల్ సిక్కా పేర్కొన్నారు. ఇన్ఫోసిస్ బోర్డుకు, వ్యవస్థాపకులకు మధ్య విభేదాలు నెలకొన్నట్లు వస్తున్న వార్తలు సరికాదని , బోర్డులో చాలామంది డైరెక్టర్లతో మంచి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని చెప్పారు. పటిష్టమైన పునాదితో ఇన్ఫోసిస్ కొనసాగుతోందని విశాల్ సిక్కా స్పష్టం చేశారు.
ఎలాంటి విభేదాలు లేవు-ఇన్ఫీ ఛైర్మన్
Published Mon, Feb 13 2017 6:33 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement