'వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను రాహుల్ ముందుండి నడిపిస్తాడు' | Sakshi
Sakshi News home page

'వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను రాహుల్ ముందుండి నడిపిస్తాడు'

Published Tue, Sep 10 2013 5:04 PM

'వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను రాహుల్ ముందుండి నడిపిస్తాడు' - Sakshi

రానున్న లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ముందుండి నడిపిస్తాడని కేంద్ర మంత్రి సచిన్ పైలెట్ అన్నారు. బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి ధీటుగా రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తారా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. '2014 లో రాహుల్ గాంధీ పార్టీకి నాయకత్వం వహిస్తారు. తమ పార్టీ ఎన్నికల్లో గెలిచాకా, యూపీఏ-3 ప్రభుత్వం ఏర్పాటైతే ఎవరు ప్రధాని అవుతారో మీరే చూస్తారు' అని సచిన్ పైలెట్ వ్యాఖ్యానించారు.

2009 ఎన్నికల్లో కాంగ్రెస్ మానిఫెస్టో విడుదల సందర్భంలో మన్మోహన్ సింగ్ ను ప్రధానిగా ప్రకటించారనే ప్రశ్నకు.. మానిఫెస్టో ప్రకటించే సమయం దాకా వేచి చూడండి.. మీ ప్రశ్నకు సమాధానం దొరుకుందేమో అని పైలెట్ బదులిచ్చాడు. ఇటీవల మీడియా సమావేశంలో దేశానికి ప్రధాని అయ్యేందుకు రాహుల్ అర్హుడని ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement