అమర్సింగ్ను పార్టీలో చేర్చుకోం: యాదవ్ | Sakshi
Sakshi News home page

అమర్సింగ్ను పార్టీలో చేర్చుకోం: యాదవ్

Published Sun, Aug 17 2014 2:47 PM

అమర్సింగ్(ఫైల్ ఫోటో)

మెయిన్పురి: రాజ్యసభ సభ్యుడు అమర్సింగ్ను మళ్లీ సమాజ్వాది పార్టీ చేర్చుకుంటారని వస్తున్న వార్తలను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ తోసిపుచ్చారు. అమర్సింగ్ను తమ పార్టీలో చేర్చుకునే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.

పార్టీలో ఈ విషయాన్ని ఎవరూ ప్రస్తావించలేదని యాదవ్ చెప్పారు. నాలుగేళ్ల తర్వాత ములాయం సింగ్ యాదవ్, అమర్సింగ్ ఓ బహిరంగ సభలో ఒకే వేదిక మీద కనిపించారు. దీంతో అమర్సింగ్ మళ్లీ సమాజ్వాది పార్టీలో చేరతారని ప్రచారం మొదలైంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement