న్యూయార్క్: ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) డైరెక్టర్ సౌమ్యా స్వామినాథన్(57)కు అరుదైన గౌరవం దక్కింది. మందులకు లొంగని సూపర్బగ్లపై పరిశోధనలకు సలహాలందించే హైపవర్ కమిటీలో ఆమెను చేరుస్తూ ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటరస్ నిర్ణయం తీసుకున్నారు.
సౌమ్య ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ హెల్త్ రీసెర్చ్ విభాగంలో కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె భారత హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్ కూతురు.
సౌమ్యా స్వామినాథన్కు అరుదైన గౌరవం
Published Mon, Mar 20 2017 3:59 AM
Related news
-
విన్నపాలు వినవలె..!
హైపవర్ కమిటీకి విజ్ఞాపనల వెల్లువ - కేకే నివాసంలో రెండోరోజు భేటీ అయిన కమిటీ - కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటుకు విజ్ఞప్తులు - సిరిసిల్ల జిల్లా ఏర్పాటు కోసం కమిటీని కలసిన మంత్రి కేటీఆర్ - దేవరకొండను జిల్లా చేయండి: ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, బాలూ నాయక్ - మొత్తం 630 దరఖాస్తులు అందాయి: కేకే సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల డిమాండ్లను పరిశీలించేందుకు ఏర్పాటైన ైెహ పవర్ కమిటీకి వినతులు వెల్లువెత్తుతున్నాయి. మరో ఆరు రోజుల్లో కొత్త జిల్లాలు మనుగడలోకి రానున్న నేపథ్యంలో కూడా కమిటీకి ఇంకా దరఖాస్తులు అందుతున్నాయి. రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు చైర్మన్గా వ్యవహరిస్తున్న హై పవర్ కమిటీ ఆయన నివాసంలో బుధవారం రెండోరోజూ భేటీ అయ్యింది. వాస్తవానికి పది పాత జిల్లాలకు తోడు మరో 17 కొత్త జిల్లాలు కలిపి మొత్తంగా 27 జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే సిరిసిల్ల, జనగామ, గద్వాల ప్రత్యేక జిల్లాల కోసం పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. దీంతో ఈ మూడింటికి తోడు ఆదిలాబాద్ జిల్లాలో అదనంగా ఆసిఫాబాద్ జిల్లాను కూడా ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు రెండ్రోజులపాటు పార్టీ నాయకులతో జరిపిన సమావేశాల్లో సూత్రప్రాయంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నాలుగు జిల్లాల ఏర్పాటుపై ప్రజాభిప్రాయం తెలుసుకుని ప్రభుత్వానికి నివేదించేందుకు హైపవర్ కమిటీని నియమించారు. అయితే రెండ్రోజులుగా కమిటీకి మరికొన్ని కొత్త జిల్లాలు కావాలంటూ విజ్ఞప్తులు అందుతున్నాయి. ఉదయం నుంచే తాకిడి హైపవర్ కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు పోచారం శ్రీనివాస్రెడ్డి, జగదీశ్ రెడ్డి, జోగు రామన్న.. కేకే నివాసానికి చేరుకోక ముందే నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఉదయం ఏడున్నర గంటలకే కేకేను కలసి వెళ్లారు. అలాగే అలంపూర్ ఎమ్మెల్యే సంపత్.. కమిటీని కలిసి కొత్తగా ఏర్పాటు కాబోయే గద్వాలకు జోగులాంబ పేరును పెట్టాలని కోరారు. కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి రెండోరోజు కూడా కల్వకుర్తి అఖిలపక్ష నేతలతో కలిసి వచ్చారు. వెల్దండ, ఊర్కొండ, వంగూరు, చారగొండ, కల్వకుర్తి మండలాలతో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ బాలూ నాయక్, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి వచ్చి కమిటీతో భేటీ అయ్యారు. దేవరకొండను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని వినతిపత్రం ఇచ్చారు. ఎమ్మెల్యే కోవా లక్ష్మి, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, స్థానిక ప్రజాప్రతినిధులు ఆసిఫాబాద్ జిల్లాను ఏర్పాటు చేయాలని కమిటీని కలిసి విజ్ఞప్తి చేశారు. ఆర్మూరు నియోజకవర్గం పరిధిలోని ఆలూరును మండలంగా మార్చాలని ఎమ్మెల్యే జీవన్రెడ్డి వినతి పత్రం ఇచ్చారు. బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్రెడ్డి కమిటీని కలిసి.. రంగారెడ్డి జిల్లాలో బార్వాద్ గ్రామాన్ని మండల కేంద్రంగా చేయాలని డిమాండ్ చేశారు. ఆయనతోపాటు వచ్చిన కార్యకర్తలు, కొద్దిసేపు కేకే నివాసం ఎదుట బైఠాయించారు. అక్కడే ఉన్న చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్రెడ్డిని కూడా వారు నిలదీశారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ పట్నం నరేందర్రెడ్డి కూడా కమిటీని కలిసి వెళ్లారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి కమిటీని కలిసి కల్లూరు రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేయాలని కోరారు. గార్ల, బయ్యారం, వెంకటాపురం, వాజేడు మండలాలను ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల పరిధిలోనే ఉంచాలని కోరారు. ఆదివాసీ జిల్లాలు ఏర్పాటు చేయండి సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)లు ఉన్న చోట్ల ఆదివాసీ జిల్లాలు ఏర్పాటు చేయాలని న్యూడెమొక్రసీ పార్టీ డిమాండ్ చేసింది. ఆ పార్టీకి చెందిన ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, పార్టీ ప్రతినిధులతో కలిసి వచ్చి హైపవర్ కమిటీని కలిశారు. తెలంగాణలో భద్రాచలం, ఉట్నూరు, ఏటూరునాగారంలో ఐటీడీఏలు ఉన్నాయని, ఇవి జిల్లా కేంద్రాలుగా ప్రత్యేకంగా ఆదివాసీ జిల్లాలు ఏర్పాటు చేయాలని విన్నవించారు. 630 దరఖాస్తులు స్వీకరించాం: కేకే ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే కొత్త జిల్లాలు ఏర్పాటవుతాయని హైపవర్ కమిటీ చైర్మన్ కేకే తెలిపారు. ఇప్పటి దాకా 630 దరఖాస్తులు అందాయన్నారు. మరికొన్ని కొత్త జిల్లాలు కావాలన్న దరఖాస్తులు కూడా అందాయని, వాటినీ పరిశీలిస్తున్నట్లు వివరించారు. రాజన్న జిల్లాగా ఏర్పాటు చేయాలి: కేటీఆర్ సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాలను కలుపుతూ సిరిసిల్లను రాజన్న జిల్లాగా ఏర్పాటు చేయాలని హైపవర్ కమిటీని కోరినట్లు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్తో కలసి బుధవారం ఆయన హైపవర్ కమిటీని కలిశారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా సిరిసిల్ల జిల్లా ఏర్పాటవుతుందన్న విశ్వాసం తమకుందన్నారు. కొత్తగా రుద్రంగి, మానాల మండలాలను ఏర్పాటు చేయాలని వినతిపత్రం ఇచ్చినట్లు చెప్పారు. -
వద్దంటే రద్దయిపోతారు
♦ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులకూ కొత్త ఎస్ఎస్ఆర్ అమలుకు సన్నాహాలు ♦ అంచనాల పెంపునకు అడ్డుచెబుతున్న కమిటీలపై వేటు.. సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా ప్రాజెక్టుల అంచనాలను పెంచుతున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు అడ్డు చెబుతున్న కమిటీలపై వేటు వేసేందుకు సిద్ధమవుతోంది. అంచనాల పెంపుపై తమ నిర్ణయాలను వ్యతిరేకించిన అధికారులున్న కమిటీలనే రద్దు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తోంది. ఈపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్) నియమావళికి వ్యతిరేకంగా పోలవరం హెడ్వర్క్స్ పనులకు కొత్త ఎస్ఎస్ఆర్ అమలు చేసిన ప్రభుత్వం రాష్ట్రంలోని మిగతా సాగునీటి ప్రాజెక్టులకూ కొత్త ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్)ను వర్తింపజేయడానికి సిద్ధమవుతోంది. ఈపీసీ విధానంలో కొత్త ఎస్ఎస్ఆర్ వర్తింపజేయాల్సిన అవసరం లేకపోయినా.. పోలవరంలో భారీ మామూళ్ల రుచి చూసిన చినబాబు.. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులకు కొత్త ఎస్ఎస్ఆర్ అమలు చేయిస్తామని, ఫలితంగా దక్కే అదనపు సొమ్ములో వాటా ఇవ్వాలంటూ కాంట్రాక్టర్లతో మాట్లాడుకున్నట్లు జల వనరుల శాఖలో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఇసుక ఉచితం.. స్టీలు, అల్యూమినియం, పెట్రోలు-డీజిల్, సిమెంట్ ధరలు తగ్గాయి. అన్నీ తగ్గిన నేపథ్యంలో.. అంచనా వ్యయం తగ్గాలి. కానీ కొత్త ఎస్ఎస్ఆర్ అమలు పేరిట అంచనా వ్యయాన్ని భారీగా పెంచడం, ఆ మేరకు కాంట్రాక్టర్ల నుంచి భారీగా సొమ్ము దండుకోవడమే లక్ష్యంగా.. చినబాబు ముఠా సాగిస్తున్న వ్యవహారాన్ని చూసి అధికారులే ముక్కున వేలేసుకుంటున్నారు. పోలవరం హెడ్వర్క్స్ పనుల అంచనా వ్యయాన్నే కొత్త ఎస్ఎస్ఆర్ పేరిట రూ. మూడు వేల కోట్లు పెంచిన ప్రభుత్వం.. మిగతా ప్రాజెక్టుల పనుల అంచనా వ్యయాన్ని కొత్త ఎస్ఎస్ఆర్ అమలు చేయడం ద్వారా ఖజానా మీద రూ. 20 వేల కోట్ల భారం వేయడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అంచనాల పెంపునకు అభ్యంతరాలు చెబుతున్న, అడ్డు తగులుతున్న ఎస్ఎల్ఎస్సీ, ఇంటర్నల్ బెంచ్ మార్క్ (ఐబీఎం) కమిటీతో పాటు జిల్లాస్థాయి స్టాండింగ్ కమిటీలను ఒక్క కలం పోటుతో రద్దు చేయడానికి ప్రభుత్వం తెగిస్తోంది. అన్ని కమిటీలనూ రద్దుచేసి ‘కమిషన్ ఆఫ్ టెండర్స్’కే బాధ్యత అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈమేరకు ప్రతిపాదనలు రూపొందించే పనిలో అధికారులు ఉన్నట్లు సమాచారం. అడ్డు తొలగించుకుంటే సరి! పోలవరం హెడ్వర్క్స్ పనులకు కొత్త ఎస్ఎస్ఆర్ అమలు చేయడం వల్ల అంచనా వ్యయం రూ. 4,050 కోట్ల నుంచి దాదాపు రూ. ఏడు వేల కోట్లకు పెరిగిన విషయం తెలిసిందే. ఫలితంగా.. అధికార పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ‘ట్రాన్స్ట్రాయ్’కి భారీ ప్రయోజనం చేకూరింది. ఇదే తరహాలో తమకూ కొత్త ఎస్ఎస్ఆర్ వర్తింపజేయాలంటూ అధికారపార్టీకి చెందిన కాంట్రాక్టర్లు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చారు. వాస్తవంగా ఈపీసీ పద్ధతిన ఒప్పందాలు జరిగిన ప్యాకేజీలకు ధరల విషయంలో మరే మార్పులు, చేర్పులు, మినహాయింపులు ఇవ్వడానికి వీల్లేదు. దీని ప్రకారం ఎస్ఎస్ఆర్లు పెంచడానికి మార్గదర్శకాలు అంగీకరించవు. కానీ రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులకు కొత్త ఎస్ఎస్ఆర్ అమలు చేయిస్తామని, ఫలితంగా దక్కే అదనపు సొమ్ములో వాటా ఇవ్వాలంటూ చినబాబు ముఠా కాంట్రాక్టర్లతో మాట్లాడుకున్నట్లు జల వనరుల శాఖలో ప్రచారం జరుగుతోంది. గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వంశధార ప్రాజెక్టుల్లో పలు ప్యాకేజీలకు కొత్త ఎస్ఎస్ఆర్ వర్తింపజేయడంతో అంచనా వ్యయం భారీగా పెరిగింది. మిగతా ప్యాకేజీల్లోనూ ఎస్ఎస్ఆర్ అమలు చేయడం వల్ల ప్రభుత్వం మీద అదనంగా రూ. 20 వేల కోట్లకు పైగా భారం పడుతుందని జల వనరుల శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. చినబాబు సూచనల మేరకు.. కొత్త ఎస్ఎస్ఆర్ అమలు చేయాలని జల వనరుల శాఖకు ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చాయని సమాచారం. అయితే కొత్త ఎస్ఎస్ఆర్ వర్తింపజేయడం నిబంధనలకు విరుద్ధమని, ఖజానాపై పెనుభారం పడుతుందంటూ ప్రతిపాదనను రాష్ట్రస్థాయి స్టాండింగ్ కమిటీ(ఎస్ఎల్ఎస్సీ) వ్యతిరేకించింది. గతంలో కాంక్రీట్ పనులకు కొత్త ఎస్ఎస్ఆర్ అమలును, హంద్రీ-నీవా, గాలేరు-నగరి అంచనాల పెంపును ఈ కమిటీ వ్యతిరేకించిందింది. ప్రభుత్వ పెద్దలు సొమ్ము చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను ఐబీఎం కమిటీ, ఆర్థిక శాఖ కూడా పలుమార్లు వ్యతిరేకించాయి. అంచనాల పెంపును ఇద్దరు సీఎస్ లు కూడా వ్యతిరేకించిన విషయాన్ని ‘సాక్షి’ బయటపెట్టినప్పుడు ప్రభుత్వం ఇరుకున పడిన విషయం తెలిసిందే. ఇలా అంచనాల పెంపును కమిటీలు, అధికారులు వ్యతిరేకించిన ప్రతిసారీ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతోంది. ఈ నేపథ్యంలో ఎస్ఎల్ఎస్సీ, ఐబీఎం కమిటీతో పాటు జిల్లాస్థాయి స్టాండింగ్ కమిటీలనూ రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈమేరకు ప్రతిపాదనలు రూపొందించే పనిలో అధికారులు ఉన్నట్లు సమాచారం. హైపవర్ కమిటీని రద్దు చేస్తారా? రూ. 100 కోట్ల కంటే ఎక్కువ విలువైన టెండర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని హైపవర్ కమిటీ ఆమోదించిన తర్వాతే కాంట్రాక్టును ఇవ్వాలనే నిబంధన ఉంది. పట్టిసీమ, కుప్పం బ్రాంచ్ కెనాల టెండర్ల విషయంలో హైపవర్ కమిటీ సానుకూల నిర్ణయం తీసుకోకుండా వెనకాడినప్పుడు ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఒత్తిడి తెచ్చి సానుకూల నిర్ణయం తెప్పించుకున్నారు. సర్కారు పెద్దలు చెప్పినట్లుగా నిర్ణయాలు తీసుకుంటే.. కమిటీలో తమకు స్థానం ఎందుకు? అని ప్రశ్నిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేష్ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో హైపవర్ కమిటీని కూడా రద్దు చేసి, ‘కమిషన్ ఆఫ్ టెండర్స్’కే బాధ్యత అప్పగిస్తే సరిపోతుందనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు జల వనరుల శాఖలో ప్రచారం జరుగుతోంది. -
స్కాలర్షిప్స్, జాబ్స్ అలర్ట్స్
ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఫెలోషిప్స్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) హెచ్ఆర్డీ ఫెలోషిప్లు అందజేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. హెచ్ఆర్డీ ఫెలోషిప్ (లాంగ్టర్మ్) విభాగాలు: టాక్సికాలజీ, జీనోమిక్స్, జరియాట్రిక్స్, స్టెమ్సెల్ రీసెర్చ్, క్లినికల్ ట్రైల్స్, డిసీజ్ మోడలింగ్, ఎన్విరాన్మెంటల్ హెల్త్, మెంటల్ హెల్త్, క్లినికల్ సైకాలజీ, క్వాలిటీ కంట్రోల్, మోడరన్ బయాలజీ, బయోటెక్నాలజీ, జెనెటిక్స్, డ్రగ్ కెమిస్ట్రీ, ఆపరేషనల్ రీసెర్చ్, హెల్త్ ఇన్ఫర్మాటిక్స్, మెడికల్ ఎథిక్స్, హెల్త్ ఎకనామిక్స్. వ్యవధి: విభాగాన్ని బట్టి ఆరు మాసాల నుంచి ఏడాది వరకు. ఫెలోషిప్: పనిచేస్తున్న సంస్థలోనే పరిశోధన కొనసాగించేవారికి నెలకు రూ.20.000; ఇతర సంస్థల్లో పరిశోధన చేసేవారికి నెలకు రూ.40,000 అందజేస్తారు. కంటిన్జెన్సీ ఫండ్, ట్రావెల్ అలవెన్స్ అదనం. అర్హత: ఎండీ/ ఎమ్మెస్/ ఎండీఎస్/ ఎంబీబీఎస్/ ఎంవీఎస్సీ/ ఎమ్మెస్సీ/ ఎంఫార్మసీ/ ఎంటెక్తోపాటు సంబంధిత విభాగంలో పీహెచ్డీ ఉండాలి. జాతీయ, రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు/ పరిశోధనా సంస్థల్లో శాస్త్రవేత్త/ హెల్త్ రీసెర్చర్గా పనిచేస్తూ ఉండాలి. మూడేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 45 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: అర్హతల ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు. దరఖాస్తు: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: ఆగస్టు 20. వెబ్సైట్: www.icmr.nic.in ఇందిరాగాంధీ పీజీ స్కాలర్షిప్ ఫర్ సింగిల్ గర్ల్ చైల్డ్ తల్లిదండ్రులకు ఏకైక సంతానమై ఉన్న యువతులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్.. ఇందిరాగాంధీ స్కాలర్షిప్ను అందిస్తోంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీలు/కళాశాలల్లో మొదటి ఏడాది పీజీ కోర్సులు చదువుతున్నవారు అర్హులు. ఏడాదిలో (పదినెలలపాటు) నెలకు రూ.2000 చొప్పున స్కాలర్షిప్ ఇస్తారు. మొదటి ఏడాదిలో ప్రతిభను బట్టి మరో ఏడాది పొడిగిస్తారు. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: సెప్టెంబర్ 15 వెబ్సైట్: www.ugc.ac.in మెడికల్ ఆఫీసర్స్ బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సెన్సైస్.. కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. పోస్టుల వివరాలు.. ఊ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, అర్హతలు: ఎంబీబీఎస్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. ఊ క్లినికల్ సైకాలజిస్ట్, అర్హతలు: సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ లేదా మెడికల్ అండ్ సోషల్ సైకాలజీలో డీఎంపీ/డీఎంపీఎస్/ఎంఫిల్ ఉండాలి. ఊ సైకియాట్రిక్ సోషల్ వర్కర్, అర్హతలు: సోషల్ వర్క్లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా, దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 1 వెబ్సైట్: www.nimhans.kar.nic.in జనరల్ నాలెడ్జ్: భారత ఆర్థిక వ్యవస్థ: ప్రణాళికలు ఆర్థిక ప్రణాళిక: భారత ప్రణాళిక విధాన అంతిమ లక్ష్యం సామ్యవాద తరహా సమాజ స్థాపన. - 1934లో భారత ఆర్థిక వ్యవస్థకు ప్రణాళికా విధానాన్ని సూచిస్తూ క్రమబద్ధమైన తొలి గ్రంథాన్ని మోక్షగుండం విశ్వేశ్వరయ్య రచించారు. - మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం ఏప్రిల్ 1, 1951 నుంచి మార్చి 31, 1956 వరకు. - మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగం అత్యధిక ప్రాధాన్యతను పొందింది. - జమిందారీ తరహా రెవెన్యూ విధానం మొదటి పంచవర్ష ప్రణాళికలో రద్దయింది. - హారడ్, డొమర్ వృద్ధి వ్యూహాన్ని ఈ ప్రణాళికలో అనుసరించారు. - రెండో పంచవర్ష ప్రణాళికా కాలం ఏప్రిల్ 1, 1956 నుంచి మార్చి 31, 1961 వరకు. - రెండో పంచవర్ష ప్రణాళికా కాలంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చారు. భిలాయ్ (మధ్యప్రదేశ్), రూర్కెలా (ఒరిస్సా), దుర్గాపూర్ (పశ్చిమ బెంగాల్)లలో ఉక్కు కర్మాగారాలను స్థాపించారు. - మహల నోబిస్ నాలుగు రంగాల వృద్ధి నమూనా ఈ ప్రణాళికతో ప్రారంభమైంది. - మూడో పంచవర్ష ప్రణాళికా కాలం ఏప్రిల్ 1, 1961 నుంచి మార్చి 31, 1966 వరకు. - స్వయం సమృద్ధి, స్వావలంబనలు మూడో పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు. - 1962 చైనా దురాక్రమణ, 1965 భారత్ - పాక్ యుద్ధం, 1965 - 66 రుతుపవనాల వైఫల్యం మొదలైన కారణాల వల్ల మూడో పంచవర్ష ప్రణాళిక నిరాశాజనకంగా కొనసాగింది. రచయితలు ప్రముఖ గ్రంథాలు ఉద్యోధనుడు కువలయమాల రామానుజాచార్య భావార్థ దీపిక కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రీంశిక మల్లిఖార్జున పండితారాధ్య శివతత్త్వసారం వరాహమిహిరుడు బృహత్సంహిత ఆర్యభట్టు సూర్య సిద్ధాంతం విశాఖదత్తుడు దేవి చంద్రగుప్తం సుత్తలైసత్తనార్ మణిమేఖలై ఇలాంగో అడిగల్ శిలప్పాధికారం కాకతీయ రుద్రదేవుడు నీతిసారం (సంస్కృతం) -
కేన్సర్ బాధితుల వివరాలివ్వండి: ఎల్వీ సుబ్రమణ్యం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదయ్యే కేన్సర్ బాధితుల వివరాలు విధిగా ఇవ్వాలని శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వివరాల సేకరణకు నిమ్స్ కేంద్రంగా రిజిస్ట్రీ పనిచేస్తుందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హాస్పిటల్ బేస్డ్ కేన్సర్ రిజిస్ట్రీ(హెచ్బీసీఆర్), పేషెంట్స్ బేస్డ్ కేన్సర్ రిజిస్ట్రీ(పీబీసీఆర్) నమోదు చేయాలన్నారు. నిమ్స్ కేంద్రంగా పనిచేసే ఈ రిజిస్ట్రీ కేంద్రానికి ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) నిధులివ్వనుంది. కేన్సర్ బాధితులకు వైద్యం అందిస్తున్న ఆస్పత్రులు విధుల్లో భాగంగానే ఈ వివరాలు ఇవ్వాలని, అయితే వీటిని గోప్యంగా ఉంచాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
Related News by category
-
గాజాలో శిథిలాల తొలగింపునకు 14 ఏళ్లు?
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమై ఏడు నెలలవుతోంది. ఈ కాలంలో ఇజ్రాయెల్.. గాజా స్ట్రిప్పై బాంబులు వేసి, ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేసింది. దీంతో ఎక్కడ చూసినా శిథిల భవనాల కుప్పలే కనిపిస్తున్నాయి. దీనిపై ఐక్యరాజ్యసమితి మైన్ యాక్షన్ సర్వీస్ (యూఎంఎన్ఏఎస్) సీనియర్ అధికారి పిహార్ లోధమ్మర్ మీడియాతో మాట్లాడుతూ గాజా స్ట్రిప్లో శిధిలాలను తొలగించడానికి సుమారు 14 ఏళ్లు పట్టవచ్చని ప్రకటించారు. జెనీవాలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన యుద్ధం కారణంగా 37 మిలియన్ టన్నుల శిథిలాలు పేరుకుపోయాయని తెలిపారు.ఏడు నెలలుగా నిరంతర ఇజ్రాయెల్ దాడులు చేస్తుండటంతో జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లోని పలు భవనాలు నేలమట్టమయ్యాయని పేర్కొన్నారు. దాడిలో ఉపయోగించిన 10 శాతం షెల్స్ పేలి ఉండకపోవచ్చని, ఇవి భవిష్యత్తులో ముప్పుగా మారవచ్చని అన్నారు. ఈ షెల్స్ భవన శిథిలాల కింద కూరుకుపోయి ఉండవచ్చని పేర్కొన్నారు. గాజా స్ట్రిప్లో ప్రతిరోజు 100 ట్రక్కుల శిథిలాలను తరలిస్తున్నారని, ఇక్కడి ప్రతి చదరపు మీటరులో దాదాపు 200 కిలోల శిధిలాలు ఉన్నాయని వివరించారు.యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (యూఎన్ఆర్డబ్ల్యుఏ) ఒక ప్రకటనలో గాజాలో జీవన పరిస్థితులు మరింతగా క్షీణిస్తున్నాయని, రాఫా నగరంలో అధిక ఉష్ణోగ్రతలు, నీటి కొరత కారణంగా ప్రజల్లో అంటు వ్యాధులు ప్రభలుతున్నాయన్నారు. ఇజ్రాయెల్.. గాజా స్ట్రిప్పై జరిపిన దాడిలో 34 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు. 77 వేల మంది గాయపడ్డారు. -
పిల్లలతో రైలు ప్రయాణం మరింత భారం!
వేసవి సెలవుల్లో పిల్లలతో రైలు ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అయితే మీపై మరింత భారం పడనుంది. భారతీయ రైల్వే ప్రయాణ టిక్కెట్లపై ఐచ్ఛిక బీమా నిబంధనలలో పలు మార్పులు చేసింది. ఇకపై రైలు ప్రయాణంలో పిల్లలకు హాఫ్ టికెట్ తీసుకుంటే వారికి ఐచ్ఛిక బీమా ప్రయోజనం లభ్యకాదు.ఐఆర్సీటీసీ తెలిపిన వివరాల ప్రకారం ఇకపై పిల్లలకు పూర్తి టిక్కెట్ తీసుకుంటేనే బీమా సౌకర్యంలోని ప్రయోజనాన్ని పొందగలుగుతారు. మరోవైపు ఐఆర్సీటీసీ ప్రత్యామ్నాయ బీమా ప్రీమియంను కూడా పెంచింది. ఏప్రిల్ ఒకటి నుంచి ఒక్కో ప్రయాణికుడి ప్రీమియం 45 పైసలకు పెంచింది. గతంలో ఇది 35 పైసలు ఉండేది.ఐచ్ఛిక బీమా పథకం అందించే ప్రయోజనం ఈ-టికెట్లను బుక్ చేసుకునే ప్రయాణీకులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రైల్వే టికెట్ కౌంటర్ నుండి కొనుగోలు చేసే టిక్కెట్లపై ఈ బీమా పథకం వర్తించదు. ఆన్లైన్ లేదా ఈ-టికెట్ను కొనుగోలు చేసిన వారికే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్లో టిక్కెట్లను బుక్ చేసేటప్పుడు వారు బీమా సౌకర్యాన్ని పొందాలనుకుంటున్నారా లేదా అనేది ఎంచుకోవాలి. ప్రయాణీకుడు బీమా సౌకర్యాన్ని పొందాలనుకుంటే, అతను ఆ ఎంపికపై క్లిక్ చేయాలి. అప్పుడు రైల్వే ప్రయాణీకుడి మొబైల్, ఈ-మెయిల్కు బీమా కంపెనీ నుండి సందేశం వస్తుంది.ఈ బీమా పథకం కింద రైల్వే ప్రయాణీకులు మరణిస్తే రూ.10 లక్షలు, పాక్షిక అంగవైకల్యం ఏర్పడితే రూ.7.5 లక్షలు, గాయాలపాలైతే చికిత్స కోసం కుటుంబానికి రూ.2 లక్షలు అందజేస్తారు. రైల్వే ప్యాసింజర్ ఐచ్ఛిక బీమా పథకాన్ని భారతీయ రైల్వే సెప్టెంబర్ 2016లో ప్రారంభించింది. -
అమేథీలో కాంగ్రెస్ 1981 ఫార్ములా?
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ యూపీలోని అమేథీ నుంచి పోటీ చేయనున్నారని ఆ పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలు అంటున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయమై నోరు మెదపలేదు. అయితే పార్టీ 1981 నాటి ఉప ఎన్నికల ఫార్ములాను ఇప్పుడు అనుసరించనున్నదనే మాట వినిపిస్తోంది.1981లో కాంగ్రెస్ నామినేషన్ల పర్వం ప్రారంభమైన తర్వాతనే అభ్యర్థులను రంగంలోకి దించింది. రాజీవ్ గాంధీని యూపీలోని అమేథీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన రోజునే రాజీవ్ గాంధీ తన నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఇదే విధానాన్ని కాంగ్రెస్ అనుసరించనున్నదని కొందరు పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు.మరోవైపు అమేథీలో బీజేపీ మినహా ఏ పార్టీ కూడా అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. ఎస్పీ-కాంగ్రెస్ పొత్తులో అభ్యర్థి ఎవరనేదానిపై బీఎస్పీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అదేసమయంలో బీఎస్పీ అభ్యర్థి ఖరారైనట్లు కూడా ప్రచారం జరుగుతోంది.ఇప్పటి వరకు రాహుల్ గాంధీ తాను అమేథీ నుంచి పోటీ చేస్తానని చెప్పలేదు. అమేథీ నుంచి బీజేపీ తరుపున స్మృతి ఇరానీ ఎన్నికల రంగంలోకి దిగారు. కాగా రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయనున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ప్రదీప్ సింఘాల్ ప్రకటించారు. -
నేడు అమేథీలో స్మృతి ఇరానీ నామినేషన్
ఈరోజు (ఆదివారం) భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మహిళా నేత స్మృతి ఇరానీ యూపీలోని అమేథీ లోక్సభ స్థానానికి తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీనికి ముందు ఆమె అయోధ్యలోని రామ్లల్లాను దర్శించుకోనున్నారు. అనంతరం ఆమె తన లోక్సభ నియోజకవర్గానికి వెళ్లి నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. మే 20న అమేథీలో ఐదో దశలో ఓటింగ్ జరగనుంది. అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ శుక్రవారం (ఏప్రిల్ 26) ప్రారంభమైంది. ఐదో దశలో మొత్తం 49 స్థానాలకు పోలింగ్ జరగనుంది.అమేథీలో నామినేషన్కు చివరి తేదీ మే 3. దీంతో కాంగ్రెస్కు ఈ సీటు నుంచి పోటీచేయబోయే అభ్యర్థిని ప్రకటించడానికి ఎక్కువ సమయం లేదు. కాంగ్రెస్ పార్టీ అమేథీలో తన అభ్యర్థిని ఇంకా నిర్ణయించలేదు. అయితే రాహుల్ గాంధీ ఈ స్థానం నుండి మరోసారి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమేథీ నియోజకవర్గం చాలాకాలంపాటు గాంధీ కుటుంబం ఆధీనంలో ఉంది. అయితే 2019లో రాహుల్ను ఓడించడం ద్వారా స్మృతి ఇరానీ ఇక్కడ కాంగ్రెస్ ఆధిపత్యానికి స్వస్తి పలికారు. అయితే ఇప్పుడు స్మృతిని ఓడించి, కాంగ్రెస్ కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందేందుకు రాహుల్ ప్రయత్నించనున్నారని సమాచారం.అమేథీతో పాటు రాయ్బరేలీ లోక్సభ స్థానానికి కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ ఎవరికీ టిక్కెట్ కేటాయించలేదు. ఈ సీటు కూడా కాంగ్రెస్ సంప్రదాయ సీటు. 2019లో కాంగ్రెస్ గెలిచిన ఏకైక సీటు ఇదే. సోనియాగాంధీ ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆమె ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీటు నుంచి సోనియా కుమార్తె ప్రియాంక ఎన్నికల బరిలో దిగవచ్చని తెలుస్తోంది. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా కూడా ఎన్నికల్లో పోటీ చేస్తారని తెలుస్తున్నప్పటికీ ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. -
ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా?
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైల్లో ఉన్నంత వరకూ మేయర్ ఎన్నిక వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రిసైడింగ్ అధికారిని నామినేట్ చేసే హక్కు ఎల్జీకి ఉన్నప్పటికీ, ప్రిసైడింగ్ అధికారిగా ఎవరిని నామినేట్ చేయాలనే విషయంలో సీఎం సూచన తప్పనిసరి. సీఎం జైలులో ఉన్నందున సంబంధిత ఫైలును ఢిల్లీ ప్రధాన కార్యదర్శి ఎల్జీ కార్యాలయానికి పంపించాల్సి వచ్చింది.ప్రిసైడింగ్ అధికారిని నామినేట్ చేయకపోవడంతో ఏప్రిల్ 26న మేయర్ ఎన్నిక జరగలేదు. దీంతో ప్రస్తుత మేయర్ షెల్లీ ఒబెరాయ్ తన బాధ్యతలను కొనసాగించనున్నారు. ఆమె ఎంసీడీ సాధారణ సమావేశాలను నిర్వహించడాన్ని కొనసాగిస్తునే ఉంటారు. అయితే ఇటువంటి సందర్భాల్లో ఆర్థిక, విధానపరమైన కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.
Advertisement
Photos
View allVideo
View allదిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement