మిస్ వెస్ట్ గోదావరిగా రేష్మిశర్మ | Sakshi
Sakshi News home page

మిస్ వెస్ట్ గోదావరిగా రేష్మిశర్మ

Published Sun, Sep 13 2015 11:52 PM

మిస్ వెస్ట్ గోదావరిగా రేష్మిశర్మ

పశ్చిమగోదావరి(భీమవరం): భీమవరంలోని వీబీఎస్ గార్డెన్‌లో ఆదివారం జరిగిన అందాల పోటీ ఫైనల్లో విజేతగా భీమవరానికి చెందిన రేష్మిశర్మ ఎంపికైంది. రెండో స్థానం సుజ దక్కించుకోగా.. మూడోస్థానంలో దేవి అనే విద్యార్థిని నిలిచింది.

ఈ పోటీలకు సినీ హీరో కృష్ణుడు, హీరోయిన్ మాధవీలత, సంగీత దర్శకుడు ఆర్పీపట్నాయక్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. పోటీల అనంతరం బహుమతులు ప్రదానం చేశారు.

Advertisement
Advertisement