శేషాద్రి ఎక్స్ ప్రెస్ లో దొంగల భీభత్సం | Sakshi
Sakshi News home page

శేషాద్రి ఎక్స్ ప్రెస్ లో దొంగల భీభత్సం

Published Wed, Sep 16 2015 10:51 AM

శేషాద్రి ఎక్స్ ప్రెస్ లో దొంగల భీభత్సం - Sakshi

నెల్లూరు: నెల్లూరు జిల్లా మనుబోలు వద్ద శేషాద్రి ఎక్స్ ప్రెస్ లో దొంగలు భీభత్సం సృష్టించారు. రైలు కాకినాడ నుంచి బెంగళూరు వెళ్తుండగా బుధవారం ఈ సంఘటన జరిగింది. మనుబోలు వద్ద రైలు లోకి చొరబడిన దొంగలు చైన్ లాగి దోపిడీకి పాల్పడ్డారు. ఎస్-2, 7, 8 బోగిల్లో ఉన్న ప్రయాణికులను బెదిరించి నగదును, బంగారాన్ని దోచుకెళ్లారు.  ప్రయాణికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement