లండన్ నగరంలోని ప్రతిష్ఠాత్మకమైన హాటన్ గార్డెన్స్ సేఫ్ డిపాజిట్ లిమిటెడ్ బ్యాంకులో దొంగలు పడి దాదాపు 1860 కోట్ల రూపాయల విలువైన వజ్రాలు, నగలను ఎత్తుకుపోయారు. ఈస్టర్ సెలవుల ద్వారా కలిసొచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని దొంగలు గత గురువారమే బ్యాంకులో పైకప్పును కట్ చేసి లోపల జొరబడ్డారని, బ్యాంకులో మొత్తం 600 సేఫ్ డిపాజిట్ లాకర్ బాక్సులుండగా వాటిలో 300 బాక్సులను తెరచి వాటిలోని వజ్రాలు, నగలు, నగదును దోచుకొని ఉడాయించారని నగర పోలీసులు తెలిపారు.
లాకర్ బాక్సులను తెరవడానికి దొంగలు అత్యాధునిక కటింగ్ యంత్రాలను ఉపయోగించారని వారు చెప్పారు. గత గురువారం సాయంత్రం నుంచి బ్యాంకు సిబ్బంది సెలవులపై వెళ్లి మంగళవారమే తిరిగి విధులకు రావడంతో ఈ దోపిడీ వ్యవహారం వెలుగులోకి వచ్చిందన్నారు. బ్యాంకులోని అలారం వ్యవస్థ శుక్రవారం మధ్యాహ్నం నుంచి పనిచేయకుండా పోయిందని, బహుశా అప్పుడే దొంగలు లాకర్లను తెరవడానికి కటింగ్ యంత్రాలను ఉపయోగించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
దొంగలు ఎత్తుకుపోయిన వాటిలో 50 లక్షల రూపాయల విలువైన వజ్రం కూడా ఉన్నట్లు పోలీసులు తెలియజేస్తున్నారు. మంగళవారం నాడు ఈ చోరీ గురించి తెలిసి బాధిత ఖాతాదారులు బ్యాంకు వద్దకు చేరుకొని బ్యాంకు అధికారులతో గొడవకు దిగారు. ఆదాయం పన్ను సమస్యలు వస్తాయన్న భయంతో చాలా మంది ఖాతాదారులు ఎంత సొమ్ము పోయిందో పోలీసులకు వెల్లడించేందుకు వెనుకాడుతున్నారు. దాదాపు 2 వేల కోట్ల రూపాయల విలువైన వజ్రాలు, నగలను దొంగలు ఎత్తుకుపోయి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. అలారం వ్యవస్థను ఎప్పటికప్పుడు ఎందుకు చెక్ చేయలేదని డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డును పోలీసులు ప్రశ్నించగా, తనకు చాలా తక్కువ జీతం ఇస్తున్నారని, అందుకే తానా విషయాన్ని సీరియస్గా పట్టించుకోలేదని చెప్పాడట!
కొంతమంది బ్యాంకు ఉద్యోగులు దొంగలతో కుమ్మక్కై ఉంటారని, లేకపోతే ఈ దొంగతనం గుట్టు చప్పుడు కాకుండా ఎలా సాధ్యమవుతుందని ఖాతాదారులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంకులోని సీసీటీవీ కెమేరాల ఫుటేజ్ని కూడా దొంగలు ఎత్తుకుపోయినట్టు తెలుస్తోంది. 2003లో కూడా ఈ బ్యాంకులో దొంగతనం జరిగింది.
లండన్లో రూ.1860 కోట్ల దోపిడీ
Published Wed, Apr 8 2015 4:58 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే ముస్లిం కోటా రద్దు: అమిత్ షా
బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే ముస్లిం కోటా రద్దు: అమిత్ షా
49 కేసుల్లో రూ.37,63,170 సొత్తు స్వాధీనం
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటే అందరి లక్ష్యం
జగన్ను మళ్లీ సీఎం చేద్దాం
పద్మనాభంలో టీడీపీకి భారీ షాక్
No Headline
8 నుంచి 13 వరకు అప్పన్న ఆర్జిత సేవలు రద్దు
రెండో రోజూ చందనం అరగదీత
ఈవీఎంల వినియోగంపై అవగాహన తప్పనిసరి
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement