వీర సైనికుడి కుటుంబానికి రూ. 30లక్షల సాయం | Sakshi
Sakshi News home page

వీర సైనికుడి కుటుంబానికి రూ. 30లక్షల సాయం

Published Wed, Jan 28 2015 11:05 PM

వీర సైనికుడి కుటుంబానికి రూ. 30లక్షల సాయం

లక్నో: తీవ్రవాదుల దాడిలో మృతి చెందిన కల్నల్ మునీంద్ర నాథ్ రాయ్ కుటుంబానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ రూ. 30 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. యూపీలోని ఘాజీపూర్ కు చెందిన కల్నల్ రాయ్ జమ్మూ, కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా మిండోరా గ్రామంలో మంగళవారం జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందారు.

ధైర్యసాహసాలు ప్రదర్శించిన దేశం కోసం ప్రాణాలు వదిలిన కల్నల్ రాయ్ సేవలను మరిపోమని సంతాప సందేశంలో అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. కల్నల్  కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని హామీయిచ్చారు. గణతంత్ర దినోత్సవంలో శౌర్య పతకం అందుకున్న మరుసటి రోజే కల్నల్ రాయ్ ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement